
నాణ్యమైన విత్తనాలతో లాభాలు
కోరుట్ల రూరల్/మల్లాపూర్/మేడిపల్లి/ఇబ్రహీంపట్నం/కథలాపూర్: నాణ్యమైన విత్తనంతో వ్యవసాయంలో అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అన్నారు. కోరుట్ల మండలం అయిలాపూర్ రైతువేదికలో ప్రాంతీయ పరిశోధనా స్థానం పొలాస శాస్త్రవేత్త పద్మజ, మల్లాపూర్ మండల కేంద్రంలోని రైతువేదిక లో పొలాస ప్రాంతీయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త సౌజన్య, మేడిపల్లి వ్యవసాయ శాస్త్రవేత్త రవి, కథలాపూర్లో తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త పద్మజ రైతులకు మంగళవారం ‘నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఇబ్రహీంపట్నంలో రైతులకు విత్తనాల మినీ కిట్లను ఏవో రాజ్కుమార్ పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఆయా మండలాల ఏవోలు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.