
శాంతియుత వాతావరణంతోనే అభివృద్ధి
● ఎస్పీ అశోక్కుమార్
జగిత్యాలక్రైం: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అశోక్కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాంతియుత వాతావరణంతోనే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకేరకమైన సేవలందించడం జరుగుతుందన్నారు. అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, బాధ్యతతో పనిచేసి జిల్లా ప్రజ లకు మరింత మెరుగైన సేవలందించాలని సూ చించారు. అనంతరం తెలంగాణ అమరువీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్కుమార్, వేణు, సీఐలు ఆరీఫ్ అలీ ఖాన్, వేణుగోపాల్, కృష్ణారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.