కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమైంది | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమైంది

Jun 3 2025 5:33 AM | Updated on Jun 3 2025 5:33 AM

కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమైంది

కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమైంది

జగిత్యాల: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లే తెలంగాణ సాధ్యమైందని, అన్ని వర్గాలను ఏకం చేసి రాష్ట్రం సాధించారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. సోమవారం కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. ప్రస్తుతం దుర్మార్గమైన పాలన నడుస్తుందని, కాంగ్రెస్‌ గుండాలు సీఎం ఫొటో లేదని క్యాంప్‌ కార్యాలయాలు, తెలంగాణ తల్లి విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ వసంత మాట్లాడుతూ, రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేపట్టి కేసీఆర్‌ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ముందుకెళ్లి తెలంగాణ సాధించారన్నారు. నాయకులు రమణారావు, ఆనందరావు, దేవేందర్‌రావు, శ్రీనివాస్‌రావు, శివకేసరిబాబు, శీలం ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement