సోమవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2025

Jun 23 2025 5:24 AM | Updated on Jun 23 2025 5:24 AM

సోమవా

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2025

8లోu

సాక్షిప్రతినిధి, వరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ)లో ఇంజనీరింగ్‌ విభా గం కొందరు అధికారులు, కాంట్రాక్టర్లకు కల్పతరువుగా మారింది. సాధారణంగా ప్రభుత్వ ఖజానాకు మేలు జరిగేలా పోటీ పద్ధతిన తక్కువ కోట్‌ చేసి టెండర్లు వేసేలా చూడాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లను సిండికేట్‌ చేసి ఎక్సెస్‌ కోట్‌ చేసి టెండర్‌లు వేయిస్తున్నారు. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లలోనూ చక్రం తిప్పుతూ తమకు అనుకూలమైన వారికి పనులు దక్కేలా చూస్తున్నారు. సిండికేట్‌గా మారిన కాంట్రాక్టర్లు పనులు పంచుకుని ప్లాన్‌ ప్రకారం టెండర్లు వేస్తుండగా.. కీలక ప్రజాప్రతినిధి, కొందరు కార్పొరేటర్ల సిఫారసుల మేరకు ఆ పనులు దక్కేలా అధికారులు పావులు కదుపుతున్నారు. తప్పిదారి ఇతరులెవరైనా టెండర్లు వేస్తే.. టెండర్లు తెరిచింది మొదలు అగ్రిమెంట్‌ వరకు చుక్కలు చూపిస్తూ తప్పుకునేలా చేస్తున్నారు. ఇదే పద్ధతిన ఆరు నెలల్లో సుమారు రూ.210 కోట్లకు పైగా విలువ చేసే పనుల టెండర్ల ఖరారు జరిగిందని ఇటీవల విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషనల్‌ డీజీ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది.

పనుల వివరాలపై అంతా గోప్యం..

జీడబ్ల్యూఎంసీ పరిధిలో వివిధ గ్రాంట్ల కింద అభివృద్ధి పనులకు ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు పిలుస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలో సుమారు రూ.210 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారైనట్లు బల్దియాకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు సుమారు రూ.68 కోట్ల విలువైన 75 పనులకు టెండర్లు పిలిచారు. ఏప్రిల్‌ 5 నుంచి 12 వరకు రూ.28 కోట్లతో 32 పనులకు టెండర్లు జరిగాయి. మే 27 నుంచి ఈనెల 11 వరకు సుమారు రూ.12.15 కోట్ల విలువైన 12 పనులకు బల్దియా ఇంజనీరింగ్‌ విభాగం టెండర్లు నిర్వహించింది. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లే అయినప్పటికీ కమీషన్లకు కక్కుర్తిపడి కొందరు అధికారులు కాంట్రాక్టర్లకు సాంకేతికంగా సహకరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. కాగా ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ ఖరారు, పనులు పొందిన కాంట్రాక్టర్‌, తిరస్కరణకు గురైన కాంట్రాక్టర్ల వివరాలు, పనుల నిర్వహణ, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన సమాచారం విషయంలో గోప్యతను పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవే అంశాలను విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొనడం బల్దియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

న్యూస్‌రీల్‌

ప్రతీ పనికి ఓ రేటు.. భారీగా కమీషన్‌

కొందరు ఇంజనీర్లు ప్రతీ పనికి ఓ రేటును నిర్ణయిస్తుండగా.. ఆ మేరకు కొందరు కాంట్రాక్టర్లు చెల్లించి ఏ పనులైనా టెండర్ల ద్వారా దక్కించుకుంటున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఇది రెండు రకాలుగా సాగుతుండగా.. మిగిలిన కాంట్రాక్టర్లందరినీ పక్కనపెట్టి మంచి ధరకు కాంట్రాక్టును అప్పగిస్తే సదరు ఇంజనీర్‌కు 10–20 శాతం, అందరితో పోటీపడి టెండరు దక్కించుకుంటే వేర్వేరు స్థాయిల్లోని ఇంజనీర్లు, ఆడిట్‌ అధికారులకు వేర్వేరు శాతాల్లో కమీషన్లు ముట్టజెప్పుతున్నారట. సహాయ ఇంజనీరుకు 3–4, డిప్యూటీ ఈఈకి 2–3, ఈఈకి 1–3, హెచ్‌డీకి 0.5, డీఓ(డ్రాఫ్టింగ్‌ ఆఫీసర్‌) 0.5, ఆడిట్‌లో 2, చెక్‌ సెక్షన్‌లో 2–4, ఎగ్జామినర్‌కు 1–2 శాతం కమీషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. వీరంతా కలిసి కొంత మొత్తాన్ని ప్రతినెలా ఉన్నతాధికారులకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు. కాగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వివిధ విభాగాల్లో కొందరు ఏళ్ల తరబడిగా తిష్టవేసి అక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న తీరుపై ఇదివరకే ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఏది ఏమైనా ఉన్నతాధికారులు ఏ మేరకు స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.

ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు..!

ఈ–ప్రొక్యూర్‌మెంట్‌

టెండర్లలో ‘సిండికేట్‌’

అభివృద్ధి పనులకు రాజకీయ రంగు

అనుకున్నోళ్లకే పనులు

వచ్చేలా సిఫారసులు

జీడబ్ల్యూఎంసీ వ్యవహారంపై

‘విజిలెన్స్‌’కు ఫిర్యాదులు

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 20251
1/1

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement