మేడం.. ఏదో ఒకటి తేల్చండి..! | - | Sakshi
Sakshi News home page

మేడం.. ఏదో ఒకటి తేల్చండి..!

Jun 23 2025 5:24 AM | Updated on Jun 23 2025 5:24 AM

మేడం.. ఏదో ఒకటి తేల్చండి..!

మేడం.. ఏదో ఒకటి తేల్చండి..!

సాక్షిప్రతినిధి, వరంగల్‌: మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్‌ ఎమ్మెల్యేల వివాదం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరా జన్‌ పేషీకి చేరింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ వ్యాఖ్యలను.. వారి వ్యతిరేక వర్గం ప్రజాప్రతినిధులు మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్‌.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్‌ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరుల బృందం ఆదివారం హైదరాబాద్‌లో నటరాజన్‌ను కలిశారు. ‘మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యాఖ్యలు పార్టీని, నాయకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. వారి వైఖరి, వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడి పోతున్నాం.. ఇక భరించలేం.. మేడం.. మీరు ఏదో ఒకటి తేల్చండి.. పార్టీ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోండి’ అని లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా కామెంట్లు చేయడం, సీనియర్లని చూడకుండా పరుషపదజాలాన్ని వాడటం పార్టీ ఇమేజ్‌ను దిగజార్చేలా ఉందని వివరించారు. ఫిర్యాదులను స్వీకరించిన మీనాక్షి నటరాజన్‌.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, అన్ని కోణాల్లో పార్టీ పరంగా విచారించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పినట్లు సమాచారం. అక్కడి నుంచి వరంగల్‌ కాంగ్రెస్‌ నాయకులు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ మల్లు రవిని కలిసి కొండా దంపతులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత ఐదారు రోజులుగా వరంగల్‌లో జరుగుతున్న కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలు, కొండా దంపతుల వ్యాఖ్యలు, వైఖరిని ఆయనకు వివరించినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన మల్లు రవి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం. కాగా కొండా దంపతులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు లేదా ఐదుగురు సీనియర్లతో నేడో, రేపో కమిటీ వేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ఆ ఇద్దరి వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడుతున్నాం

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌తో కొండా సురేఖ

వ్యతిరేక ప్రజాప్రతినిధులు

హైదరాబాద్‌లో మీనాక్షి,

మల్లు రవిని కలిసిన

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

కమిటీ వేసి విచారణ చేపట్టి చర్యలు

తీసుకుంటామని హామీ..

నేడో, రేపో అధికారిక ప్రకటన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement