ఉపాధ్యాయుల సర్దుబాటు నిబంధనలు సడలించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సర్దుబాటు నిబంధనలు సడలించాలి

Jun 23 2025 5:24 AM | Updated on Jun 23 2025 5:24 AM

ఉపాధ్

ఉపాధ్యాయుల సర్దుబాటు నిబంధనలు సడలించాలి

టీఎస్‌యూటీఎఫ్‌

రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్‌

విద్యారణ్యపురి: టీచర్ల సర్దుబాటు నిబంధనలను సడలించడంతోపాటు పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించి పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం హనుమకొండలోని యూనియన్‌ వరంగల్‌ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతీ తరగతికి ఒక టీచర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు, పూర్వప్రాథమిక తరగతులు ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, అసంబద్ధంగా ఉన్న గురుకులాల పనివేళలను సవరించాలని పే ర్కొన్నారు. సమావేశంలో యూనియన్‌ బాధ్యులు తాటికాయల కుమార్‌, సుజనప్రసాద్‌రావు, ఎస్‌ఏ.రవూఫ్‌, పాక శ్రీనివాస్‌, నామోజు శ్రీనివాస్‌, విజయ్‌, కె.రమేశ్‌, గుండు కరుణాకర్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నేడు గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌

వరంగల్‌ అర్బన్‌ : వరంగల్‌ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్‌ జోనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని, నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పచ్చని ప్రకృతిని రక్షించాలి

జిల్లా సంక్షేమ అధికారి జయంతి

కేయూ క్యాంపస్‌ : పచ్చని ప్రకృతిని రక్షించాలని జిల్లా సంక్షేమ అఽధికారి జయంతి అన్నా రు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్విని యోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంవారోత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌కాలేజీ మైదానంలో మొక్కలు నాటిన అనంతరం ఆమె మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. టీజీ ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ విషయంలో యువతలో సరైన అవగాహన పెరగాలని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ రెహమాన్‌, ఎకై ్సజ్‌ సీఐ తిరుపతి, ఎన్‌సీసీ లెఫ్ట్‌నెంట్‌ స్వామి, అధ్యాపకురాలు నహేదా, నర్సింగ్‌ ఆఫీసర్‌ అరుణకుమారి, డీసీపీఓ ఇన్‌చార్జ్‌ ప్రవీణ్‌, ఎఫ్‌ఆర్‌ఓ రవికృష్ణ, ఉమెన్‌ హబ్‌ కోఆర్డినేటర్‌ కల్యాణి, సఖీ అడ్మిన్‌ హైమావతి, నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కోఆర్డినేటర్‌ తేజస్విని తదితరులు పాల్గొన్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌

బాధ్యులను శిక్షించాలి

హన్మకొండ: ఫోన్‌ ట్యాపింగ్‌ బాధ్యులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్‌ ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ డిమాండ్‌ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని స్వగృహంలో ఆదివారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రజలు భారీగా మద్దతు పలికి అధికారం ఇస్తే గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని కూలదోశారని ఆరోపించారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉపయోగించుకొని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. రాజరిక వంశ పారంపర్య పాలనను చిరకాలం కొనసాగించడానికి, ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడం కోసం వేలాది మంది ఫోన్లను బీఆర్‌ఎస్‌ పాలకులు ట్యాప్‌ చేసి దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి అక్రమంగా ఎన్నికై న ప్రజాస్వామ్య ద్రోహులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఫోరం ఫర్‌ బెటర్‌ వరంగల్‌ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్‌, ప్రముఖ సామాజిక వేత్త బొమ్మినేని పాపిరెడ్డి, రాచకొండ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సర్దుబాటు  నిబంధనలు సడలించాలి1
1/1

ఉపాధ్యాయుల సర్దుబాటు నిబంధనలు సడలించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement