నియామకాల్లో హిందీ ఆధిపత్యం | Nagati Narayana Article On Hindi Dominance Central Govt Jobs | Sakshi
Sakshi News home page

నియామకాల్లో హిందీ ఆధిపత్యం

Aug 2 2021 12:10 AM | Updated on Aug 2 2021 12:10 AM

Nagati Narayana Article On Hindi Dominance Central Govt Jobs  - Sakshi

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీ భాషకు ఇస్తున్న వెయిటేజ్‌ వలన హిందీయేతర రాష్ట్రాల ఉద్యోగా ర్థులు నష్టపోతున్నారు. ఉదాహర ణకు తెలంగాణలో గల 9 నవోదయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ సిబ్బంది 220 మంది ఉండగా వారిలో సుమారు 50 (22.7%) మంది మాత్రమే తెలంగాణ వారున్నారు. మిగిలిన వారిలో కొద్దిమంది ఆంధ్రప్రదేశ్‌ వారున్నా మెజారిటీ హిందీ ప్రాంతం వారే. ఏపీ నవోదయ విద్యాలయాల్లో కూడా అదే పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 72 కేంద్రీయ విద్యాల యాల్లోని దాదాపు 2,500 మంది ఉపాధ్యా యుల్లో తెలుగు వారు 20 శాతమే. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఉపా« ద్యాయ నియామ కాల్లో 75% పోస్టులు డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌ ద్వారా భర్తీ అవుతాయి. ప్రిన్సిపాల్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్, గ్రాడ్యు యేట్‌ టీచర్‌ పోస్టుల్లో ఏర్పడే ఖాళీల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు.

సబ్జెక్ట్‌ నాలెడ్జితో పాటు రీజనింగ్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్నెస్, లాంగ్వేజెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విషయాల్లో పరీక్ష ఉంటుంది. వీటిలో ఇంగ్లిష్, హిందీ భాషలకు 20 మార్కుల చొప్పున ఉంటాయి. ఇంగ్లిష్‌లో ఏ ప్రాంతం వారికైనా మార్కులు సమానంగానే వస్తున్నాయి. కానీ హిందీలో హిందీ ప్రాంతం అభ్యర్థులకు 80% పైగా మార్కులు వస్తుండగా హిందీయేతరులకు అందులో సగం కూడా రావడం లేదు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో బోధనా మాధ్యమం ఇంగ్లిష్‌. నియామక పరీక్షలో ఇంగ్లిష్‌ అని వార్యం. కానీ హిందీ ఎందుకు? ఇంగ్లిష్‌తో పాటు మరో భాషలో పరిజ్ఞానాన్ని పరీక్షించ దలిస్తే రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషల్లో దేనిలోనైనా రాసే అవకాశం ఇవ్వాలి. సివిల్‌ సర్వీసులకు కూడా ప్రాంతీయ భాషల్లో రాసే వీలుండగా కేంద్రీయ, నవోదయ ఉపాద్యాయ నియా మకాలకు లేకపోవడం అన్యాయం. నియామకాలు జోనల్‌ పరిధిలో కాకుండా దేశం మొత్తం ఒకే యూనిట్‌గా కేంద్రీకృతంగా నిర్వహించడం కూడా ఈ అస మానతకు మరో ముఖ్య  కారణం. 

పైన ఇచ్చినవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఈ నష్టం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్‌ సంస్థ ల్లోనూ జరుగుతోంది. ఇండియన్‌ రైల్వేస్, పోస్టల్, సీపీడబ్ల్యూడీ, సెంట్రల్‌ సెక్రటేరి యట్, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్స్, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీస్, డిఫెన్స్, రీసెర్చ్‌ ఎస్టాబ్లిష్మెంట్స్, సెంట్రల్‌ యూని వర్సిటీలు, ఐఐటీలు, ఎన్‌ ఐటీలు... ఇలా వందలకొలదీ వున్నాయి. వాటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 40 లక్షల పోస్టులకు నియామకాలు చేస్తే అందులో సుమారు 2 లక్షలు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుంది. అమల్లో వున్న ఎంపిక పరీక్షా విధానంలో హిందీకి గల ప్రాధాన్యత తెలుగుకు లేకపోవడం వలన అవి తెలుగు వారికి దక్కే అవకాశం లేదు. రాజకీయ పార్టీలు, పార్లమెంట్‌ సభ్యులు ఇంత పెద్ద సమస్యను పట్టించుకోకపోవడం అన్యాయం. ప్రభుత్వ రంగంలో వున్న కొద్దిపాటి ఉద్యో గాల్లో కూడా జరుగుతున్న ప్రాంతీయ అన్యాయాన్ని ఎది రించే ఉద్యమం ఊపందుకోవాలి.  


నాగటి నారాయణ 
వ్యాసకర్త విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు 
మొబైల్‌: 94903 00577

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement