
పండుగ సమీపిస్తున్న వేళ ఎప్పుడో దాచిన డబ్బు అనుకోకుండా బయటపడితే..ఆ సంతోషమే వేరేలెవల్. అందులోనూ దీపావళి అంటే మహాలక్ష్మీదేవి పండుగ..అమ్మ ముందుగానే ఇలా కనక వర్షం కురిపిస్తే..ఆ సంతోషం మాటలకందనిది. అలాంటి ఆనందంలోనే తడిసిముద్దవుతోంది ఈ కుటుంబం.
దీపావళి పండుగ సమయం అని ఇల్లంతా క్లీన్ చేస్తుండగా..ఎప్పుడో దాచిన డబ్బులు బయటపడ్డాయి. ఆ సంగతే మర్చిపోయింది ఆ ఫ్యామిలీ. అనుకోకుండా పండుగ నేపథ్యంలో ఇల్లు శుభ్రం చేస్తుండగా పాత డీటీహెచ్ బాక్స్లో దాచిన సొత్తు బయటపడింది. దగ్గర దగ్గర రెండు లక్షలు ఉండటంతో ఆ కుంటుంబం సంతోషానికి అవధులే లేకుండా పోయింది. "మహాలక్ష్మీ ముందుగానే మమ్మల్ని కటాక్షించింది. ఇది దీపావళి పండుగ ఆశీర్వాదమే అంటూ పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబవ్వుతోంది ఆ కుటుంబం". అయితే అందులో ఉన్నవన్నీ రూ. 2 వేలు నోట్లు కావడం గమనార్హం.
బహుశా ఈ డబ్బుని మా నాన్నగారు నోట్లు రద్దు చేయకమునుపు దాచి ఉంచి ఉండొచ్చుని..ఆయనకి ఈ సంగతి ఇంకా తెలియదంటూ రెడ్డిట్లో ఈ సంగతిని షేర్ చేయడంతో నెట్టింట ఈ విషయం వైరల్గా మారింది. అయితే నెటిజన్లు తక్షణమే ఆ నోట్లను మార్చుకోండి. ఆర్బీఐని సంప్రదించే మందు ఆ డబ్బు ఎక్కడిది ఇప్పుడే ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలియజేయాలన్న విషయం మర్చిపోకండి బీకేర్ఫుల్ అని సూచిస్తూ పోస్టులు పెట్టారు.
కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మే 19, 2023న చలామణి నుంచి రూ.2000 డినామినేషన్ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, రూ.5,884 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాట్లు సమాచారం.
(చదవండి: ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..)