
జాతీయ యోగా పోటీలకు ముగ్గురి ఎంపిక
అమలాపురం టౌన్: శ్రీ స్వామి వివేకానంద యోగాశ్రమంలో శిక్షణ పొందుతున్న ముగ్గురు బాల బాలికలు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. గత ఏప్రిల్ 8న వైజాగ్లో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ఈ ముగ్గురి బాల బాలికలు జాతీయ పోటీలకు అర్హత సాధించారని ఆ యోగాశ్రమం యోగా గురువు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. జూనియర్ కేటగిరీలో వెయిట్ విభాగంలో బంగారు మేఘన, చామకూరి వర్ధిని, గుత్తల ప్రవీణ్ ఎంపికకై నట్లు చెప్పారు. వీరు ఈ నెల 12న ఢిల్లీలో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్టపతి అవార్డు గ్రహీత, జాతీయ యోగా న్యాయ నిర్ణేత మోటారి భైరవస్వామి ఎంపికై న ముగ్గురిని యోగా శిక్షకులను అభినందించారు.
విలేకరి రాముపై దాడిని
ఖండించిన వైఎస్సార్ సీపీ నేతలు
పరామర్శించిన ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, జగ్గిరెడ్డి, డాక్టర్ శ్రీకాంత్
అమలాపురం టౌన్: అయినవిల్లి మండల సాక్షి విలేకరి భావిశెట్టి రామకృష్ణ నాగేశ్వరరావు (రాము)పై జరిగిన దాడిని జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు ఖండించారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామును పార్టీ జిల్లా నేతలు ఆదివారం పరామర్శించారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ రామును పరామర్శించారు. రాముపై జరిగిన దాడి వివరాలపై వారు ఆరా తీశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు గొల్లపల్లి డేవిడ్ రాజు, కుడుపూడి భరత్ భూషణ్ రామును పరామర్శించారు.
వివాహిత అదృశ్యం
అమలాపురం టౌన్: గత నెల 30వ తేదీన తన భార్య చర్చికి వెళతానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదని ఆమె భర్త అమలాపురం రూరల్ మండలం రోళ్లపాలేనికి చెందిన ఉండ్రాజవరపు జగదీష్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. జగదీష్, నందినికి మూడేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇంకా సంతానం లేదు. రెండు రోజులుగా భార్య ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో భర్త జగదీష్ ఫిర్యాదు చేశాడు.

జాతీయ యోగా పోటీలకు ముగ్గురి ఎంపిక