వాడపల్లిలో భక్తజన సందోహం | - | Sakshi
Sakshi News home page

వాడపల్లిలో భక్తజన సందోహం

Jun 2 2025 5:53 AM | Updated on Jun 2 2025 5:53 AM

వాడపల్లిలో భక్తజన సందోహం

వాడపల్లిలో భక్తజన సందోహం

కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా తిరుమల క్షేత్రాన్ని తలపిస్తోంది. శ్రీఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలంశ్రీ నానుడితో అశేష భక్తజనం తరలిరావడంతో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి ఆశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా మిగిలిన ఆరు రోజులు కూడా భక్తజనం తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారితో పాటు ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు అష్టోత్తర పూజలు జరిపిస్తున్నారు. ఆదివారం వాడపల్లి క్షేత్రానికి భక్తులు తరలివచ్చి అష్టోత్తర పూజలో పాల్గొని, స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఒక్కరోజు దేవస్థానానికి రూ 8,06,929 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్‌ ఈఓ చక్రధరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement