
వినాయకుడి ఆలయంలో హుండీ చోరీ
కడియం: స్థానిక పోస్టాఫీసు వీధిలోని పెద్ద వినాయకుడి ఆలయం వద్ద హుండీని పగలగొట్టి అందులోని నగదును దొంగలు ఎత్తుకుపోయారు. ఉదయం పూజలు చేసేందుకు వచ్చిన అర్చకులు డిబ్బీ తాళం పగలగొట్టి ఉండడాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం ఇవ్వగా, వారు పోలీస్లకు తెలియజేశారు. క్రైం అడిషనల్ ఎస్పీ అర్జున్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఎ.వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ దుర్గాప్రసాద్, సిబ్బంది గంగాధర్, ప్రసాద్, రవి, కుమార్ దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది.