
ఐసీఎస్ఈ, ఐఎస్సీ ఫలితాల్లో ‘ఫ్యూచర్కిడ్స్ గ్లోబల్’
రాజమహేంద్రవరం రూరల్: ఫిబ్రవరిలో జరిగిన ఐసీఎస్ఈ(పదో తరగతి), ఐఎస్సీ(ప్లస్ టూ) 2024–25 ఫలితాల్లో స్థానిక కవలగొయ్యి రోడ్లోని ఫ్యూచర్కిడ్స్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని పాఠశాల డైరెక్టర్ ఏలేటి రవిబాబు తెలిపారు. ఉపాధ్యాయుల సమష్టి కృషి, సమగ్ర బోధన, పక్కా పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల కఠోర శ్రమతో ఈ ఘన విజయం సాధించామని చెప్పారు. ఐసీఎస్ఈ పరీక్షల్లో కోడూరు పూర్ణహాసిని 99 శాతం, కోటిపల్లి హనీషా, కంచుసాయి సాత్విక్నాయుడు 98, ఎం.జాహ్నవి, క్రితిక, ఎ.జ్యోతిర్మయి, జ్యోత్స్న కల్యాణి 97 శాతం మార్కులతో తొలి ఐదు స్థానాలు సాధించారు. ఐఎస్సీలో వరుసగా శబ్ద్ జైన్ 98 శాతం, వెన్నల, లుక్రిత్ 95, ఈషాన్, వినిల్, సముద్విత, నమన్ జైన్ 94 శాతంతో తొలి ఐదుస్థానాలు సాధించారన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ రవిబాబు, చైర్పర్సన్ ఏలేటి విజయకుమారి, సీఈవో ఏలేటి రుద్రశ్రీమహశ్వి, డీన్ హర్షిణీదేవి, ప్రిన్సిపాల్ శేషగిరిధర్, ఉపాధ్యాయులు అభినందించారు.

ఐసీఎస్ఈ, ఐఎస్సీ ఫలితాల్లో ‘ఫ్యూచర్కిడ్స్ గ్లోబల్’