ఏడాదిలో యువెత | - | Sakshi
Sakshi News home page

ఏడాదిలో యువెత

Jun 23 2025 6:08 AM | Updated on Jun 23 2025 6:08 AM

ఏడాది

ఏడాదిలో యువెత

కూటమి ప్రభుత్వంలో నిండా మోసం

విద్యార్థులకు అందని రీయింబర్స్‌మెంట్‌

నిరుద్యోగికి ఉపాధి లేదు.. భృతి అందదు

నేడు వైఎస్సార్‌ సీపీ విద్యార్థి..

యువత పోరు

అమలాపురం కలెక్టరేట్‌ వద్ద ధర్నా

సాక్షి, అమలాపురం: చంద్రబాబు అంటే అంతే. నమ్మిన వారిని నిలువునా ముంచేస్తారు. ఎన్నికలు ముగిసిన వెంటనే హామీలను మరిచిపోతారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కూడా అంతే.. చేసేది మూరెడు.. ప్రచారం బారెడు అన్నట్టు సాగిపోతోంది. ఏడాదిగా ఇటు విద్యార్థులు, అటు నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. ఊరించి ఊరించి ఇచ్చిన శ్రీతల్లికి వందనంశ్రీలో అర్హులకు కోత పెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యా, వసతి దీవెన ఊసేలేదు. పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు. ఇక నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి లేదు.. ఉద్యోగ, ఉపాధి కల్పించలేదు. పరిశ్రమల ఏర్పాటు.. కార్పొరేషన్‌ రుణాలు.. ఇలా అన్ని విషయాల్లోనూ యువతను ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది. ఏడాది పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసగించడంతో వైఎస్సార్‌ సీపీ సమర శంఖారావం పూరించింది. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌ వద్ద విద్యార్థి.. యువత పోరుకు సిద్ధమైంది.

ఎక్కడి పనులు అక్కడే..

ఫ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. పాఠశాలలు పునః ప్రారంభించే సమయానికి పూర్తి కావాల్సిన మనబడి మన భవిష్యత్తు రెండో దశ పనులు అక్కడివి అక్కడే అన్నట్లు ఉన్నాయి. మనబడి మన భవిష్యత్తు రెండో దశలో పాఠశాలల్లో నిరంతరం నీటి సరఫరాతో కూడిన టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, తాగునీటి సరఫరా, ఆకట్టుకునేలా పాఠశాలల ప్రహరీలపై పెయింటింగ్స్‌, భవనాల మరమ్మతులు, గ్రీన్‌చాక్‌ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండో దశ పనుల్లో భాగంగా 772 పాఠశాలలను రూ.257 కోట్లతో అభివృద్ధి చేయాల్సి ఉండగా, చాలా చోట్ల సిమెంట్‌, ఇసుక కొరతతో పనులు నిలిచిపోయాయి.

ఫ తల్లికి వందనం పథకాన్ని ఒక ఏడాది ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం రెండో ఏడాది లబ్ధిదారులకు భారీగా కోత పెట్టింది. జిల్లాలో 2.40 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, 1,70869 మందికి మాత్రమే తల్లికి వందనం పడింది. ఇంకా 63,191 మందికి సొమ్ము పడాలి. పలు నిబంధనల పేరుతో ఈ పథకాన్ని దూరం చేసింది.

ఫ జిల్లాలో నాడు – నేడు రెండో దశలో 761 పాఠశాలలను అభివృద్ధి చేయాలి. ఇందుకు రూ.249 కోట్లు మంజూరు కావాల్సి ఉండగా, రూ.86 కోట్లు రివాల్వింగ్‌ ఫండ్‌, రూ.61 కోట్లు సీపీఎం (సెంట్రల్లీ ప్రొక్యూర్డ్‌ మెటీరియల్‌)కు మంజూరయ్యాయి. మొత్తం రూ.147 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రివాల్వింగ్‌ ఫండ్‌, సీపీఎం రూపేణా రూ.102 కోట్లు విడుదల కావాలి. 267 అదనపు తరగతి గదులకు 223 పనులు వివిధ దశల్లో ఉండగా, 25 ఏసీఆర్‌లు ప్రారంభించ లేదు. 19 ఏసీఆర్‌లు పూర్తయ్యాయి. అధిక సంఖ్యలో పాఠశాలలకు సిమెంట్‌ రావాల్సి ఉంది.

ఫ పాఠశాలల్లో కొత్తగా 546 టాయిలెట్స్‌ నిర్మిస్తుండగా 278 వివిధ దశల్లో ఉన్నాయి. 267 చోట్ల పూర్తయ్యాయి. అలాగే 403 కిచెన్‌ షెడ్లు మంజూరు కాగా, 235 వివిధ దశల్లో ఉండగా, 167 పూర్తయ్యాయి. మేజర్‌, మైనర్‌ మరమ్మతులకు 1,012 పనులు మంజూరు కాగా 576 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 548 పాఠశాలల్లో విద్యుద్దీకరణ పనులు మంజూరు చేయగా, 162 పాఠశాలల్లో వివిధ దశల్లో ఉన్నాయి.

ఫ గత ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన కింద 8,824 మంది విద్యార్థులకు రూ.6.14 కోట్లు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దీని పేరు రీయింబర్స్‌మెంట్‌ ఆఫ్‌ ట్యూషన్‌ ఫీజు (ఆర్‌టీఎఫ్‌)గా మార్చి 2024–25 సంవత్సరానికి 7,210 మందికి రూ.8.33 కోట్లు విడుదల చేశారు. అలాగే వసతి దీవెన పథకం పేరును మెయింటెనెన్స్‌ ఆఫ్‌ ట్యూషన్‌ ఫీజు (ఎంటీఎఫ్‌)గా మార్చి రూ.1.39 కోట్లు మంజూరు చేశారు. తరువాత నుంచి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీనిపై ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి.

ఉన్న ఉద్యోగాలే పీకేశారు

కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. రీయింబర్స్‌మెంట్‌ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా అందించలేదు. యువతకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు, ఈ ఏడాదిలో నాలుగు లక్షల ఉద్యోగాలు పీకేశారు. వీటిపై నిరసన తెలిపేందుకు సోమవారం అమలాపురంలో కలెక్టరేట్‌ వద్ద విద్యార్థి, యువత పోరు నిర్వహిస్తున్నాం. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చేస్తున్న ఈ ఆందోళనలో విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలి.

–పిల్లి సూర్యప్రకాష్‌,

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం

జిల్లా అధ్యక్షుడు

22ఎఎంపీ05:

అప్పులు చేసి ఫీజులు

రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన, విద్యా దీవెన సొమ్ము సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు అప్పులు ఫీజులు చెల్లిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి 2004కు ముందు చూశాం. ఇప్పుడు మరోసారి చూస్తున్నాం. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఇచ్చినట్టు వసతి, విద్యా దీవెన క్రమం తప్పకుండా అందించాలి.

–మిండగుదిటి శిరీష్‌ నారాయణస్వామి, వైఎస్సార్‌ సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు

అన్నింటా దగా..

ఫ నిరుద్యోగ భృతిని కూటమి ప్రభుత్వం మరిచిపోయింది. 2014లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ ఇచ్చి కేవలం ఒక్క నెల మాత్రమే అప్పట్లో ఇచ్చింది. ఇప్పుడు టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకంలో దీనిని మళ్లీ ఓ హామీగా చేర్చింది. గెలిచి ఏడాది అవుతున్నా ఆ హామీ నెరవేర్చకుండా నిరుద్యోగ యువతను చంద్రబాబు ప్రభుత్వం రెండోసారి మోసం చేసింది. జిల్లాలో సుమారు 20 వేల మంది నిరుద్యోగ యువత ఉంటోందని అంచనా. వీరికి నెలకు రూ.మూడు వేల చొప్పున ఏడాదిలో రూ.36 వేలు వేయాల్సి ఉంది. మొత్తం మీద ఏడాదిలో సుమారు రూ.72 కోట్లకు ఎగనామం పెట్టింది.

ఫ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు తీసివేసి పలువురిని నిరుద్యోగులుగా మార్చింది. వలంటీర్‌ వ్యవస్థను మొత్తం ఎత్తేసింది. జిల్లాలో పట్టణ, గ్రామ స్థాయిలో సుమారు 9,900 మందిని తొలగించింది. ఇంటింటా రేషన్‌ అందించే ఎండీయూ వ్యవస్థను నిలిపివేసింది. జిల్లాలో 370 వాహనాలు నిలిపివేయడంతో 740 మంది ఉపాధికి గండి కొట్టింది.

ఫ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తొలి సంతకాల్లో ఒకటి మెగా డీఎస్పీ. తొలి సంతకం కార్యరూపం దాల్చడానికి ఏడాది సమయం పట్టింది. పరీక్షలైతే జరిగాయి. వెంటనే కొలువులు ఇస్తారనే నమ్మకం అభ్యర్థులకు కలగడం లేదు.

ఫ జిల్లాలో ఎస్సీ, బీసీ, కాపు, ఇతర సామాజిక వర్గాలకు అడిగిన వారికి అడిగిన అన్ని రుణాలిస్తామన్నారు. దీని ద్వారా లబ్ధి పొందేది ఎక్కువగా యువతే. కూటమి నేతల మాటలు నమ్మి, స్వయం ఉపాధి పొందవచ్చనే ఆశతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు కలిపి అన్ని కార్పొరేషన్ల నుంచి 120 యూనిట్లు కేటాయించారు. వీటి కోసం 1,500 నుంచి 2,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ అనుమతులు ఇవ్వలేదు.

ఏడాదిలో యువెత1
1/3

ఏడాదిలో యువెత

ఏడాదిలో యువెత2
2/3

ఏడాదిలో యువెత

ఏడాదిలో యువెత3
3/3

ఏడాదిలో యువెత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement