
జాండ్లవారిపల్లె సర్పంచ్ ఆత్మహత్య
రొంపిచెర్ల: రొంపిచెర్ల మండలం, జాండ్లవారిపల్లె పంచాయతీ సర్పంచ్ నాగిరెడ్డి (67) ఆత్మహత్యకు పాల్పడారు. ఈ మేరకు మృతుని కుమారుడు డీ.కిరణ్కుమార్రెడ్డి రొంపిచెర్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 24న సర్పంచ్ దేవులపల్లె నాగిరెడ్డి తన కారులో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ పని ముగించుకుని ఇంటికి బయలుదేరారు. జాండ్లవారిపల్లె సమీపంలో వెళ్తుండగా ఫోన్ వచ్చింది. గ్రామానికి అర కిలో మీటరు దూరంలో కారు దిగేశారు. బుధవారం కూడా ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆందోళన చెందారు. శనివారం ఉదయం గ్రామానికి సమీపంలోని ఒట్టిగుట్ట దగ్గర వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన నాగిరెడ్డి శవాన్ని గుర్తించారు. తన తండ్రికి అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తుందని, దాని బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నాగిరెడ్డి మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటు
సర్పంచ్ దేవులపల్లె నాగిరెడ్డి మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మృతుడు నాగిరెడ్డి దహనక్రియలకు హాజరయ్యారు. నాగిరెడ్డి కుటుంబానికి తాను అండగా ఉంటానని తెలిపారు. ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, జెడ్పీటీసీ రెడ్డిశ్వర్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కరీముల్లా, ప్రేమానందం, రవీంద్ర, సూర్యనారాయణరెడ్డి, యుగంధర్ రెడ్డి, కోటా వెంకటరమణ, లక్ష్మీప్రసాద్రెడ్డి, అశోక్రెడ్డి, విజయశేఖర్ పాల్గొన్నారు.

జాండ్లవారిపల్లె సర్పంచ్ ఆత్మహత్య