షియోమి చైనాలో అప్డేటెడ్ SU7 సెడాన్ను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ భద్రతా పరికరాలు, డ్రైవర్-అసిస్టెన్స్ హార్డ్వేర్, క్యాబిన్ ఫీచర్లు, ఛాసిస్ సెటప్లో చాలా మార్పులు పొందింది. దీని ధర 219,900 యువాన్ల (సుమారు రూ. 29.79 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది.
కొత్త SU7 ఎలక్ట్రిక్ కారు 73 kWh, 96.3 kWh LFP ప్యాక్లతో పాటు, 101.7 kWh టెర్నరీ లిథియం బ్యాటరీ కూడా పొందుతుంది. వెర్షన్ను బట్టి CLTC రేంజ్ 720 కి.మీ, 902 కి.మీ, 835 కి.మీ ఉంటుందని షియోమి పేర్కొంది. ఈ ప్లాట్ఫామ్ 752V నుంచి 897V పరిధిలో హై-వోల్టేజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగంలో, షియోమీ అప్డేటెడ్ మెటీరియల్స్ & ఇంటర్ఫేస్ డిజైన్తో క్యాబిన్ను సవరించింది. ఇందులో 16.1-అంగుళాల సెంట్రల్ డిస్ప్లే, 7.1-అంగుళాల రొటేటింగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్ప్లే ఉన్నాయి. ఇవన్నీ షియోమీ స్మార్ట్ కాక్పిట్ సిస్టమ్కు అనుసంధానమై ఉన్నాయి. ఈ సెటప్ వాయిస్ కంట్రోల్స్, మల్టీ-స్క్రీన్ ఇంటరాక్షన్కు సపోర్ట్ చేస్తుంది.


