జ్యేష్ఠాభిషేకానికి అంకురార్పణ | - | Sakshi
Sakshi News home page

జ్యేష్ఠాభిషేకానికి అంకురార్పణ

Jun 11 2025 8:48 AM | Updated on Jun 11 2025 8:48 AM

జ్యేష

జ్యేష్ఠాభిషేకానికి అంకురార్పణ

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో బుధవారం జరగనున్న జ్యేష్ఠాభిషేకానికి మంగళవారం అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పవిత్ర గోదావరి నుంచి అర్చకులు తీర్థబిందె తీసుకొచ్చారు. జ్యేష్ఠ పౌర్ణమి (ఏరువాక పౌర్ణమి)ని పురస్కరించుకుని రామాలయంలో ప్రతీ ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు తెలిపారు. బేడా మండపంలో 81 కలశాలలో సమస్త నదీ జలాలను ఆవాహన చేసి స్వామివారికి అభిషేకం చేస్తామని, ఈ సందర్భంగా నిత్యకల్యాణం రద్దు చేశామని వివరించారు.

ఆరో బెటాలియన్‌ను

సందర్శించిన ఎస్పీ

కొత్తగూడెంఅర్బన్‌: లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఆరో బెటాలియన్‌ను ఎస్పీ రోహిత్‌రాజు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్‌లోని స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ వారి ఆధునాతన పరికరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎలాంటి విపత్తులు, ప్రమాదాలు ఎదురైనా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం తక్షణమే స్పందించి ప్రజలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో బెటాలియన్‌ కమాండెంట్‌ శివప్రసాద్‌రెడ్డి, అసిస్టెంట్‌ కమాండెంట్‌ డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్‌

మొక్కల పంపిణీ

అశ్వారావుపేటరూరల్‌: మండలంలోని నారంవారిగూడెం ఆయిల్‌ఫెడ్‌ డివిజన్‌ నర్సరీ నుంచి రైతులకు మంగళవారం అయిల్‌పామ్‌ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయిల్‌ఫెడ్‌ డివిజనల్‌ మేనేజర్‌ నాయుడు రాధాకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి 9,500 ఎకరాలకు సరిపడా మొక్కలు పంపిణీ చేయాలనేది లక్ష్యం కాగా, అంతకు మించి 9,556 ఎకరాలకు పంపిణీ చేశామని తెలిపారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో 11,500 ఎకరాలకు మొక్కల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 500 ఎకరాలకు అందించామని వివరించారు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ సరిపడా మొక్కలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

జ్యేష్ఠాభిషేకానికి  అంకురార్పణ1
1/2

జ్యేష్ఠాభిషేకానికి అంకురార్పణ

జ్యేష్ఠాభిషేకానికి  అంకురార్పణ2
2/2

జ్యేష్ఠాభిషేకానికి అంకురార్పణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement