నాటుసారా తయారీదారులపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

నాటుసారా తయారీదారులపై చర్యలు

Jun 14 2025 7:47 AM | Updated on Jun 14 2025 7:47 AM

నాటుస

నాటుసారా తయారీదారులపై చర్యలు

మాచర్ల రూరల్‌: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా పోలీసు, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని హసనాబాద్‌ తండాలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తండాలో ప్రతి ఇంటిని తనిఖీ చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 8 మందిని అనుమానిత వ్యక్తులుగా గుర్తించారు. నాటుసారా తయారు చేసినా, విక్రయించినా చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ నసీబ్‌ బాషా, ఎకై ్సజ్‌ సీఐ ఎన్‌.వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నిందితులను మెజిస్ట్రేట్‌, తహసీల్దార్‌ బి.కిరణ్‌ కుమార్‌ సమక్షంలో హాజరుపరిచారు.

సత్తా చాటిన జిల్లా బీచ్‌ కబడ్డీ క్రీడాకారులు

సత్తెనపల్లి: మచిలీపట్నంలో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు జరిగిన 12వ జాతీయ స్థాయి బీచ్‌ కబడ్డీ మెన్‌ అండ్‌ ఉమెన్‌ పోటీలలో పల్నాడు జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. దేశంలోని 29 రాష్ట్రాల క్రీడాకారులు హాజరు కాగా, ఆంధ్రప్రదేశ్‌ జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఇండియా జట్టుకు పల్నాడు జిల్లా క్రీడాకారులు కృష్ణారెడ్డి, గోపి, హరీష్‌లు ఎంపికయ్యారు. వీరిని పల్నాడు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాబుహుస్సేన్‌, సీనియర్‌ వ్యాయామ ఉపాధ్యాయులు అచ్చిరెడ్డి, రియాజు, శేషయ్య, అనిల్‌, సభ్యులు సందీప్‌, సురేష్‌, ఆనంద్‌లు శుక్రవారం సత్కరించారు. మాబుహుస్సేన్‌ మాట్లాడుతూ ప్రతిభ చూపిన క్రీడాకారులను మరింతగా తీర్చిదిద్దుతానన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

సత్తెనపల్లి: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముప్పవరపు రమణయ్య (44) గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సత్తెనపల్లి వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. రమణయ్యకు భార్య అంజలి, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు వివాహమైంది. 2.70 ఎకరాలు గ్రామంలో పొలం కౌలుకు తీసుకొని పత్తి, పొగాకు సాగు చేస్తుండగా నష్టాలు రావడంతో ఆర్థిక సమస్యలు పెరిగి రమణయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు సత్తెనపల్లి రూరల్‌ పోలీసులకు తెలిపారు. కారు డ్రైవర్‌గా కూడా పనిచేస్తుంటాడని సమాచారం. తహసీల్దార్‌ కేఎస్‌ చక్రవర్తిని దీనిపై సంప్రదించగా.. త్రిమెన్‌ కమిటీ నిర్ధారించాల్సి ఉందని, కౌలు రైతు అయితే పూర్తి స్థాయిలో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు వివరాలను సేకరించాల్సి ఉంటుందన్నారు.

నాటుసారా తయారీదారులపై చర్యలు 1
1/3

నాటుసారా తయారీదారులపై చర్యలు

నాటుసారా తయారీదారులపై చర్యలు 2
2/3

నాటుసారా తయారీదారులపై చర్యలు

నాటుసారా తయారీదారులపై చర్యలు 3
3/3

నాటుసారా తయారీదారులపై చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement