
కొత్తరైలు మార్గంలో తొలిప్రయాణం!
రాజంపేట: హైదరాబాద్ నుంచి తిరుపతికి కొత్తమార్గంలో తొలి ప్రయాణం అందుబాటులోకి రానుంది. జూలై 4 నుంచి నాందేడ్–తిరుపతి మధ్య తిరిగే రైలును పిడుగురాళ్ల–శావల్యపురం మధ్య నూతనంగా నిర్మించిన మార్గం ద్వారా మార్కాపురం, నంద్యాల, కడప మీదుగా తిరుపతికి తొలిసారిగా నడపనున్నారు. నెమలిపురి, రొంపిచెర్ల రైలు కూత తొలిసారి వినపడనుంది. జూలై 11, 18, 25 తేదీల్లో తిరుపతికి, జూలై 6, 13, 20, 27 తేదీల్లో నాంధేడ్కు ఈ రైలు ప్రయాణిస్తుంది.
టైమింగ్స్ ఇలా..
నాందేడ్లో సాయంత్రం 4.30కి, బాసరకు 6గంటలకు, నిజమాబాద్కు 6.25కు చేరుకుంటుంది. కామారెడ్డి మీదుగా మేడ్చల్కు రాత్రి 8గంటలకు, చెర్లపల్లెకు 9.30గంటలకు వస్తుంది, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడిమీదుగా పిడుగురాళ్లకు రాత్రి 12.30గంటలకు చేరుకుంటుంది. దొనకొండ,మార్కాపుం రోడ్, కంభం, గిద్దలూరు మీదుగా నంద్యాల ఉదయం 5.30గంటలకు వస్తుంది. జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కడపకు 8.50కి చేరుకుంటుంది. నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మధ్యాహ్నాం 12.30 గంటలకు చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో తిరుపతిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరుతుంది. కడపకు 4.15కు, నంద్యాలకు 7,45గంటలకు చేరుకుంటుంది. నాంధేడ్కు మరుసటిరోజు ఉదయం 9.30గంటలకు బయలుదేరుతుంది.
తిరుపతి–నాందేడ్ మధ్య ప్రత్యేక రైలు
జిల్లా వాసులు బాసర, షిర్డీ వెళ్లేందుకు అనుకూలం