
భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి
వీరబల్లి : దళిత, గిరిజనుల భూములు ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో శనివారం డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యుడు సిద్దిగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ గడికోట గ్రామ పరిధిలోని వేల్పుల మిట్ట హరిజనవాడ, గిరిజనులలు వాడల్లో ఉన్న వారికి సర్వే నెంబరు. 1128/7, 1128/9లో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా ఒక్కొక్కరికి ఎకరా చొప్పున పంపిణీ చేశారన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆ భూములను జేసీబీల ద్వారా చదును చేసే ప్రయత్నం చేస్తూ దళిత, గిరిజనుల కుటుంబాలను భయపెడుతున్నారన్నారు. అధికారులు స్పందించి దళితులకు న్యాయం చేయాలని కోరారు.