సస్పెన్షన్‌లో ఉన్న ఏఎస్‌ఐ అనుమానాస్పద మృతి | Suspended ASI Dies Under Suspicious Circumstances | Sakshi
Sakshi News home page

సస్పెన్షన్‌లో ఉన్న ఏఎస్‌ఐ అనుమానాస్పద మృతి

Mar 19 2026 4:58 AM | Updated on Mar 19 2026 4:58 AM

Suspended ASI Dies Under Suspicious Circumstances

పెదపులిపాక కట్ట సమీపంలో ఘటన  

పెనమలూరు: విజయవాడ పటమట పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ ఏఎస్‌ఐగా పని చేస్తూ ఇటీవల సస్పెన్షన్‌కు గురైన వీరవల్లి గోపి వెంకటదుర్గాప్రసాద్‌ (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...దుర్గాప్రసాద్‌ (58) పటమట లంకలో భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. 

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు స్టేషన్లలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఏఎస్‌ఐగా పటమట పోలీస్‌ స్టేషన్‌లో క్రైం విభాగంలో పని చేస్తున్న సమయంలో ఆయనపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన బుధవారం పెదపులిపాక చిన్నకట్ట రోడ్డులో ఓ గేదెల షెడ్డు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండగా, స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.   

పోలీసు వర్గాల్లో కలకలం  
విధుల నుంచి సస్పెన్షన్‌కు గురైన దుర్గాప్రసాద్‌ అనుమానాస్పద స్థితిలో మరణించడం పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. ఏఎస్‌ఐపై ఒత్తిడి పెరగడంతోనే మృతి చెందాడని చర్చించుకుంటున్నారు. ఇటీవల పటమట పంట కాలువ రోడ్డులో అర్ధరాత్రి ఓ షాపు తెరిచి ఉండగా నైట్‌ రౌండ్స్‌లో ఉన్న ఏఎస్‌ఐ షాపు యజమానిని మందలించిన ఘటనపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయని చెబుతున్నారు. 

కాగా విజయవాడ పటమట లంకలో ఉంటున్న ఏఎస్‌ఐ పెదపులిపాక కట్ట సమీపంలోని గేదెల షెడ్డు వద్దకు ఎందుకు వచ్చాడన్నది మిస్టరీగా ఉంది. మరోవైపు తన తండ్రి బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని మృతుని కుమారుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement