
భూగర్భ శివాలయ దర్శనం అద్భుతం
● సినీ రచయిత, దర్శకుడు జె.కె.భారవి
నాతవరం: భూగర్భ శివాలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలుగు సినీ రచయిత, దర్శకుడు జె.కె.భారవి అన్నారు. గుమ్మడిగొండ పంచాయతీ శివారు చిక్కుడుపాలెం గ్రామంలో వెలసిన శివశక్తి క్షేత్రాన్ని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఆలయ ధర్మకర్త కె.ఎస్.ఎస్.శర్మ ఆయనకు వివరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత భారవి విలేకరులతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో చూడచక్కని విధంగా శివశక్తి క్షేత్రంలో అనేక రకాల శివలింగాలు ప్రతిిష్టించడం చాలా ఆనందాయకమన్నారు. ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాలు ఎంతో అద్భుతంగా దర్శనమిస్తున్నాయన్నారు. ఈ ఆలయ విశిష్టత గురించి ప్రచార మాధ్యమాల్లో చూసి ఇక్కడకు వచ్చానన్నారు. దూరప్రాంతమైనా ఇక్కడకు వచ్చిన తర్వాత, శివశక్తి క్షేత్రంలో ప్రతిష్టించిన పలు రకాల శివలింగాలను దర్శించుకున్న అనంతరం ఎంతో చక్కని అనుభూతి కలిగిందన్నారు. దైవ సంకల్పంతో కూడిన ఏదో తెలియని మహా శక్తి ఉంటే తప్ప ఇక్కడ భూగర్భ శివాలయ నిర్మాణం జరగదన్నారు.