
జాతీయ స్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
అనకాపల్లి టౌన్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శారదా యోగా శిక్షాలయ సారథ్యంలో ఆల్ ఇండియా యోగా కల్చర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల 35వ నేషనల్ ట్రెడిషనల్ యోగాసన చాంపియన్ షిప్–2025 పోటీలు జరిగాయి. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో 12 రాష్ట్రాల నుంచి 680 మంది తలపడ్డారు. తుమ్మపాల గ్రామం శ్రీకృష్ణ యోగా సెంటర్ గురువు బుదిరెడ్డి నరసింగరావు 55–65 సంవత్సరాల కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారు. 66–75 సంవత్సరాల కేటగిరీలో బుదిరెడ్డి నాగమణి ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటారు.