
అప్రమత్తత అవసరం
దేశవాళీ రకం పసుపు పైరుపై మచ్చలు కనిపించిన వెంటనే రైతులు అప్రమత్తం కావాలి. ప్రారంభంలోనే సస్యరక్షణ చేపడితే వ్యాప్తిని వెంటనే నివారించవచ్చు. ఒక శాతం బోర్డో మిశ్రమం/ ఒక లీటరు నీటికి ఒక మిల్లీలీటర్ ప్రోపికోనజోల్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్కు 0.5 ఎంఎల్ సబ్బునీరు కలిపి 15 రోజుల వ్యవధిలో సెప్టెంబరు నుంచి 3 నుంచి 4 సార్లు పిచికారి చేయాలి. పైరు విత్తుకునే సమయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా నివారించవచ్చు. ఆరోగ్యకరమైన విత్తనాన్ని ఎంచుకుని విత్తనశుద్ధి చేయడం వల్ల తెగుళ్లను నివారించవచ్చు.
– శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త, ఉద్యానవన పరిశోధన స్థానం, చింతపల్లి