వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Jun 24 2025 4:09 AM | Updated on Jun 24 2025 4:09 AM

వాతావ

వాతావరణం

ఆకాశం మేఘావృతమై ఉంటుంది.పలుచోట్ల ఓ మోస్తరు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.

8లోu

మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్‌ శ్రీ 2025

క్రీడల అభివృద్ధికి కృషి

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో క్రీడల అభివృద్ధికి త న వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఒలింపిక్‌ డే రన్‌ కార్యక్రమాన్ని ట్రెయినీ కలెక్టర్‌ సలోనితోకలిసి సోమవారం ప్రారంభించారు. క్రీడా జ్యోతి వెలిగించి అనంతరం క్రీడాకారులతో కలిసి రన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడారంగానికి ఖేలో ఇండియా ద్వారా మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఇందులో డీవైఎస్‌వో శ్రీనివాస్‌, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి,ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి,రాష్ట్రపాల్‌పాల్గొన్నారు.

మొదలైన ‘స్థానిక’ సందడి

సన్నద్ధమవుతున్న ప్రధాన పార్టీలు

శ్రేణులను అప్రమత్తం చేస్తున్న అధిష్టానాలు

పావులు కదుపుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌

అధికార కాంగ్రెస్‌కు జిల్లాలో సవాలే

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. జిల్లాలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పూర్తి స్థాయి నియోజకవర్గాలైన ఆదిలాబాద్‌లో బీజేపీ, బోథ్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక జిల్లాలో పాక్షికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఖానాపూర్‌ పరంగా కాంగ్రెస్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌కు ప్రత్యర్థుల నియోజకవర్గాలో స్థానిక పోరులో విజయం సాధించాలంటే ఆషామాషీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు సంబంధించి క్యాడర్‌ బలంగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార కాంగ్రెస్‌ను పరిశీలిస్తే ఇటీవల రైతు భరోసా విడుదల చేయడం, మరో పక్క ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికాసం, భూభారతి అమలు ద్వారా హస్తం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుందనే సంకేతాలు ఇస్తుంది. బీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన తర్వాతే ఎన్నికలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూనే తాము ఎన్నికలకు మాత్రం సిద్ధమేనని పేర్కొంటుంది. కమలం పార్టీ సైతం ఎన్నికలకు సమాయత్తమవుతుంది. తలమడుగు మండలం సుంకిడిలో ఆదివారం బోథ్‌ నియోజకవర్గ పార్టీ శ్రే ణులతో ఎంపీ గోడం నగేశ్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ సమావేశం అయ్యారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు సూచించారు.

బలాబలాలు..

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ ప్రభావం చూపాలని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నారు. పార్టీకి సంబంధించి ఈనెలలో గ్రామ, మండల, బ్లాక్‌ కమిటీలు నియమించనున్నారు. డీసీసీ అధ్యక్షుడిని కూడా ఇదే నెల చివరిలో నియమించేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్‌ఎస్‌ పరంగా పరిశీ లిస్తే.. బోథ్‌,ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, క్యాడర్‌ను బలోపేతం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో ఆ పార్టీకి మాజీ మంత్రి జోగు రామన్న ఉండటం, జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండడంతో పాటు గతం నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న ద్వితీయశ్రేణి గణాన్ని కోల్పోలేదు. ఈ నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్‌కే బీఆర్‌ఎస్‌ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఇక బీజేపీ పరంగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో ఆ పార్టీకి ఎంపీ గోడం నగేష్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు. బోథ్‌ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పతంగే బ్రహ్మానంద్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ పోరు ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కమలం పార్టీకి సంబంధించి శుక్రవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునిల్‌ బన్సాల్‌, రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించినట్లు తెలిసింది.

‘కాళేశ్వరం’పై సీబీఐ విచారణ చేపట్టాలి

ఆదిలాబాద్‌టౌన్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన వి లేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్‌ కుమార్‌తో పాటు బీజేపీ కేంద్ర, రాష్ట్ర నా యకత్వాలు ఒకే స్టాండ్‌పై ఉన్నాయని పేర్కొన్నారు. విషయాన్ని వక్రీకరించి మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఇతర నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాళేశ్వరంపై అవినీతి జరి గిందని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ప్రకటిస్తున్నా లోతైన విచారణ మాత్రం జరగ డం లేదన్నారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో అక్రమార్కులపై పోలీస్‌ బాస్‌ కొరడా ఝళిపిస్తున్నారు. ఎస్పీ అఖిల్‌ మహా జన్‌ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు వారి గుండెల్లో గుబులు రేపుతోంది. నిరంతరం నిఘాతో రౌడీలు, బ్లాక్‌మెయిలర్లు, దళారులు, వడ్డీ వ్యాపారులు, భూకబ్జాదారులువణికిపోతున్నారు. వీడీసీలు, ఇసు కాసురుల ఆగడాలకు ఇప్పటికే చెక్‌ పడింది. దాబా ల్లో మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. వాహనా లకు మోడిఫైడ్‌ సైలెన్సర్లు కనిపించకుండా పోయా యి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, సోషల్‌ మీడియాలో రెచ్చగొ ట్టేలా పోస్టులు పెట్టేవారిపై నిఘా పెంచడంతో అవి తగ్గుముఖం పట్టాయి. రోడ్లపై ఫ్లెక్సీలు, బ్యానర్లు క నిపించకుండా పోయాయి. బెల్టుషాపులను స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. షీటీమ్‌ ద్వారా పోకిరీలకు అడ్డుకట్ట వేస్తున్నారు. మట్కా, గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి.పోలీసుల ప్రవర్తనపైనా ఫోక స్‌ పెట్టారు. విధులు విస్మరించిన పలువురిపై సస్పెన్షన్‌ వేటు కూడావేశారు.ఎస్పీ విధుల్లోచేరిన మూడు నెలల్లోనే నేరాల అదుపునకు చర్యలు చేపట్టారు.

ఎస్పీ ప్రత్యేక చొరవ ఇలా..

● జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌చౌక్‌, గాంధీచౌక్‌, శివాజీచౌక్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు.

● ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించి బాధితుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు.

● భూకబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక వింగ్‌ ఏర్పాటు చేశారు.

● ఇప్పటివరకు 20 మంది భూకబ్జాదారులను అరె స్టు చేశారు. డాక్యుమెంట్‌ రైటర్లతో పాటు సహకరించిన అధికారులపై సైతం కేసులు పెట్టారు.

● ఆపరేషన్‌ చబుత్రాలో భాగంగా రాత్రి 11 గంటలు దాటిందంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అర్ధరాత్రి అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని స్టేషన్‌కు తరలించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అలాగే రౌడీమేళా నిర్వహించి వార్నింగ్‌ ఇచ్చారు. డీజే చప్పుళ్లు, మైక్‌ల హోరు తగ్గింది. రోడ్లపై, జంక్షన్లలో బర్త్‌డే కేక్‌ కటింగ్‌లు, ఫ్లెక్సీలు కనిపించకుండా పోయాయి.

● జిల్లా కేంద్రంలోని ముఖ్య కూడళ్లలో పోలీస్‌ కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. బ్యాంకుల వద్ద పోలీసుల నిఘా పెంచారు.

● అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరా లు, వేసవిలో క్రీడా శిబిరాలను ఏర్పాటు చేశారు.

● ప్రయాణికుల భద్రతే పరమావధిగా అభయ–మై టాక్సీ ఈస్‌ సేఫ్‌ కార్యక్రమానికి తాజాగా శ్రీకారం చుట్టారు.

● ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే దృష్టికి తీసుకువచ్చేలా మెసేజ్‌ యువర్‌ ఎస్పీ కా ర్యక్రమాన్ని చేపట్టారు. నేరుగా ఎస్పీకి వాట్సాప్‌ నంబర్‌ 8712659973 ద్వారా తెలియజేసేందు కు వీలు కల్పించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు.

9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

కైలాస్‌నగర్‌: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలనే డిమాండ్లతో వచ్చే నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్‌ తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి రమేశ్‌ను సోమవారం కలిసి సమ్మె నోటీసుఅందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మిక సంఘం యూనియన్‌ నాయకులు కిరణ్‌, శంకర్‌ శ్రీని వాస్‌, గంగారాం,తదితరులు పాల్గొన్నారు .

విలేజ్‌ పోలీస్‌ కార్యక్రమంలో భాగంగా నార్నూర్‌లో గిరిజనులతో కలిసి భోజనం చేస్తున్న ఎస్పీ (ఫైల్‌)

మోడిఫైడ్‌ సైలెన్సర్లను రోడ్‌రోలర్‌తో తొక్కిస్తున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ (ఫైల్‌)

27న 5కే రన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో ఈనెల 27న 5కే రన్‌ నిర్వహించనున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ప్ర కటనలో తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ నుంచి ఉదయం 6 గంటలకు 5కే రన్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఆసక్తి గలవారు https:// forms. gle/ UR2 iPE6 PYP9 AkdoA7 లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరారు.

న్యూస్‌రీల్‌

ఇద్దరు ఆర్‌ఐలపై సస్పెన్షన్‌ వేటు

జాతీయ శిక్షణకు ఎన్‌సీడీ అధికారి

ఆదిలాబాద్‌టౌన్‌: భారత ఆహార భద్రత ప్రమాణా ల సంస్థ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి త్వశాఖ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆధ్వర్యంలో కేరళలోని కొచ్చిలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో జిల్లా ఆహార భద్రత, ఎన్‌సీడీ అధికారి డాక్టర్‌ శ్రీధర్‌ మెట్‌పెల్లివార్‌ సోమవారం పాల్గొన్నారు. తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్‌, మేఘాలయ రాష్ట్రాల నుంచి ఆహార భద్రత అధికారులు హాజరవగా.. సాంకేతిక పరిజ్ఞానం అమలు నైపుణ్యాలు, నియంత్రణ సామర్థ్యాలు అంశంపై శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 27 వరకు కార్యక్రమం కొనసాగనున్నట్లు తెలిపారు.

ప్రజలతో మేమకం అవుతూ.. అక్రమార్కులపై కొరడా ఝళిపిస్తూ అసాంఘిక కార్యకలాపాలపై పోలీస్‌బాస్‌ ఉక్కుపాదం జిల్లాలో వినూత్న కార్యక్రమాలకు ఎస్పీ శ్రీకారం మూడు నెలల్లో నేరాల అదుపునకు చర్యలు

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాయి. ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ముందు కు సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ‘పరిషత్‌’ సందడి మొదలైంది. ఈ ఎన్నికలు అధికార పార్టీకి సవాలుగా మా రుతుండగా.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ సైతం తమదైన శైలిలో పావులు కదుపుతున్నాయి.

– సాక్షి,ఆదిలాబాద్‌

ఎస్పీ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు..

మెస్సేజ్‌ యువర్‌ ఎస్పీ

ఆపరేషన్‌ చబుత్రా

పోలీసులు మీకోసం

హోమ్‌గార్డు సిబ్బందికి ఆరోగ్య భద్రత

పిల్లలకు సమ్మర్‌ క్యాంప్‌

యాంటీ డ్రగ్‌ కమిటీ

అభయ– మై టాక్సీ ఈస్‌ సేఫ్‌

పటిష్టంగా కమ్యూనిటీ పోలీసింగ్‌

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తి గా రూపుమాపుతున్నాం. కమ్యూనిటీ పోలీ సింగ్‌ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నాం. గంజాయి, మట్కా, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అడ్డుకట్ట వేస్తున్నాం. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నాం. బ్యాంకుల వద్ద దళారీలపై ఇటీవల కేసులు నమోదు చేశాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కేసులు నమోదుతో పాటు శిక్ష పడేలా చూస్తున్నాం. మెసేజ్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమానికి మంచి స్పందన ఉంది.

– అఖిల్‌ మహాజన్‌, ఎస్పీ

వాతావరణం
1
1/2

వాతావరణం

వాతావరణం
2
2/2

వాతావరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement