
వాతావరణం
అధ్వాన రోడ్లతో అవస్థలు
గతంలో కురిసిన వర్షాలకు గ్రామీణ రహదారులు, వంతెనలు కోతకు గురయ్యాయి. తాత్కాలిక వంతెనలు, రహదారులు నిర్మించగా ఇటీవలి వర్షాలకు కొట్టుకుపోయాయి.
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా వర్షం కురుస్తుంది.
సెలవులు ముగిసినా బడి తెరువలే..
పోడు.. తీరని గోడు!
అటవీ భూముల సాగుపై వివాదం ఆగడం లేదు. ఏటా వానాకాలం విత్తనాలు వేసే వేళ అటవీ అధికారులు, ఆక్రమణదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
సుంకిడిలో శిథిల‘బడి’
ఆదిలాబాద్టౌన్: సర్కారు బడుల్లో విద్యార్థులు స మస్యలతో సతమతమవుతున్నారు. జిల్లాలోని ప లు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులున్న చోట సరి పడా ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులున్నచో ట విద్యార్థులు బడికి రారు. సరిపడా తరగతి గదులు లేక పలు పాఠశాలల్లో రెండు, మూడు తరగతు ల విద్యార్థులను ఒకేచోట కూర్చోబెట్టి బోధిస్తున్నా రు. జిల్లాలో 25 పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉండగా, 54 పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే ఉ పాధ్యాయులు లేరు. విద్యార్థులు లేక ఇప్పటికే 11 పాఠశాలలు మూతబడ్డాయి. గురువారం ‘సాక్షి’ జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలను విజిట్ చేయగా, వివిధ సమస్యలు వెలుగుచూశాయి.
పెండింగ్లోనే పనులు
జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. మన ఊరు–మనబడి ద్వారా 2021–22లో 237 పాఠశాలల్లో పనులు చేపట్టారు. వీటికోసం రూ.51కోట్లు అంచనా వేశారు. ఈ నిధులతో అదనపు తరగతి గదులు, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్, తాగునీటి వసతి తదితర పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈజీఎస్ కంపోనెంట్ కింద రూ.43.62 కోట్ల పనులకు అంచనా వేశారు. ఈ నిధుల ద్వారా మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీలు నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేశారు. జిల్లాలో 141 ప్రాథమిక పాఠశాలలు, 36 యూపీఎస్, 60 ఉన్నత పాఠశాలల్లో పనులకు అంచనాలు వేశారు. అయితే 200 పాఠశాలల్లో రూ.30 లక్షల్లోపు పనులు, 37 పాఠశాలల్లో రూ.30లక్షలకు పైగా ప నులకు అంచనా వేశారు. రూ.30లక్షల లోపు వాటి ని ఎస్ఎంసీ కమిటీలు, రూ.30లక్షలు పైబడిన ప నులను కాంట్రాక్టర్లు చేపట్టారు. 2023 జూన్ 23 వరకు చేపట్టిన పనులకు రూ.23.58 కోట్ల బిల్లులు వచ్చాయి. మిగతా వాటికి బిల్లులు పెండింగ్లో ఉండగా పనులు నిలిచిపోయాయి. దాదాపు కాంట్రాక్టర్లకు రూ.7.61 కోట్లు రావాల్సి ఉంది. దీంతో తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. గత విద్యాసంవత్సరంలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 649 పాఠశాలల్లో ప నులు చేపట్టారు. మైనర్ రిపేర్లు, తాగునీరు, మరుగుదొడ్ల మరమ్మతులు, విద్యుద్ధీకరణ, బాలికల మరుగుదొడ్ల పనులు చేపట్టారు. వీటికోసం రూ.30 కోట్ల అంచనా వేశారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వా రా చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణా లు, ఇతర పనులు పెండింగ్లో ఉన్నాయి.
మావల జెడ్పీఎస్ఎస్లో అసంపూర్తి భవనంలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు
జల్దా బడి.. సమస్యల ఒడి
సమస్యల్లో సర్కారు స్కూళ్లు
పిల్లలున్నచోట టీచర్లు లేరు
సార్లుంటే విద్యార్థులు రారు
చాలాచోట్ల వసతులు కరువు
సమస్యల మధ్యే చదువులు
ఇంద్రవెల్లి: మండలంలోని తుమ్మగూడ, గోపాల్సింగ్తండా, కేస్లాగూడ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి నల్లాలు నిరుపయోగమయ్యాయి. విద్యార్థులు ఇళ్ల నుంచే బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. మరుగుదొడ్లు మరమ్మతుకు నోచుకోవడం లేదు. వడగామ్ పంచాయతీ పరిధి లింగపూర్ టీడబ్ల్యూపీఎస్లో 18 మంది విద్యార్థులుండగా ఉపాధ్యాయుడు లేక సెలవుల తర్వాత పాఠశాల ఇంకా తెరుచుకోలేదు. విద్యార్థులు ఆడుతూ కనిపించారు. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో మరో ఉపాధ్యాయుడిని నియమించలేదు.
తలమడుగు: మండలంలోని సుంకిడి జెడ్పీహెచ్ఎస్ పురాతన భవనం శిథిలావస్థకు చేరింది. విద్యార్థులు భయాందోళనకు గురవుతుండగా అధికారులు 8, 9, 10 తరగతులను ప్రాథమిక పాఠశాల ఆవరణలోని తరగతి గదిలోకి మార్చారు. శిథిల భవనాన్ని తొలగించి నూతన భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు: 3,067
పనిచేస్తున్నవారు : 2,667
ఖాళీలు : 400
డీఈవో పరిధి పాఠశాలలు : 739
విద్యార్థుల సంఖ్య : 65వేలు
ఇచ్చోడ: మండలంలోని జల్దా ప్రాథమిక పాఠశాలను సందర్శించగా సమస్యలు వెలుగుచూశాయి. పాఠశాల ప్రధాన ద్వారం తలుపులు పగిలిపోయాయి. మరుగుదొడ్డి, మూత్రశాలలు నిరుపయోగమయ్యాయి. ప్రహరీ లేక ఆవరణలోకి పశువులు సంచరిస్తున్నాయి. 28 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులుండగా గురువారం 15మంది విద్యార్థులే హాజరు కావడం గమనార్హం.

వాతావరణం

వాతావరణం

వాతావరణం

వాతావరణం