నకిలీ విత్తన విక్రయాలపై నిఘా పెంచాలి | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తన విక్రయాలపై నిఘా పెంచాలి

May 26 2025 9:52 AM | Updated on May 26 2025 9:52 AM

నకిలీ విత్తన విక్రయాలపై  నిఘా పెంచాలి

నకిలీ విత్తన విక్రయాలపై నిఘా పెంచాలి

ఇచ్చోడ: గ్రామాల్లో అమాయక రైతులను ఆసరగా చేసుకొని నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్టు కింద కేసులు న మోదు చేయాలని రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు సంగెం బొర్రన్న డిమాండ్‌ చేశారు. ఆదివారం ఇచ్చోడలో రైతులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కొంత మంది వ్యాపారులు గ్రామాల్లో అమాయక రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నరని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, పోలీసు శాఖ లు గ్రామాల్లో మరింత నిఘా పెంచి తనిఖీ లు నిర్వహించాలన్నారు. ఆయన వెంట రైతులు అనిల్‌, మోహన్‌, మాణిక్‌రావు, సలీం తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement