రాయితీ సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

రాయితీ సద్వినియోగం చేసుకోండి

Apr 24 2025 12:27 AM | Updated on Apr 24 2025 12:27 AM

రాయితీ సద్వినియోగం చేసుకోండి

రాయితీ సద్వినియోగం చేసుకోండి

కై లాస్‌నగర్‌: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించేవారికి 5శాతం రాయితీ కల్పించినట్లు ము న్సిపల్‌ కమిషనర్‌ సీవీఎన్‌ రాజు తెలిపారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఎర్లీబర్డ్‌ పథకం అమలు తీరుపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేటాయించిన వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వీలైనంత మేర పన్ను వసూలు చేసేలా శ్రద్ధ వహించాలన్నారు. ఈ నెల 30 వరకు గడువు ఉందని, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో ఆర్‌వో స్వామి, ఆర్‌ఐలు వెంకటేశ్‌, హన్మంతు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement