breaking news
yeleru river
-
విజయవాడ తరహాలోనే ఏలేరు వరద కూడా మ్యాన్ మేడ్ ఫ్లడ్సే అన్న జగన్
-
కాకినాడ జిల్లాను ముంచెత్తిన ఏలేరు
-
కాలు జారితే అంతే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
అడ్డతీగల(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రత్యామ్నాయం లేకపోవడంతో గత్యంతరం లేక అడ్డతీగల మండలంలోని పింజరికొండ గ్రామస్తులు అంత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఏలేరు వాగులో గల గోడపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 400 మంది జనాభా ఉన్న ఈ గ్రామం వాగుకు అవతలి వైపు ఉంది. 2010 వరకూ వాగులో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునే వారు. వాగుకు సమీపంలో చిన్నతరహా జలవిద్యుత్ కేంద్రం నిర్మించారు. అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం నీటిని మళ్లించడానికి వాగుకు అడ్డంగా వియర్(అడ్డుగోడ) నిర్మించారు. ఇప్పుడా గోడమీద నుంచి పింజరికొండ గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం నీటి ప్రవాహం ఉండడంతో గోడ నాచుపట్టి ఉంటుంది. ప్రవాహ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గోడపై నుంచి రాకపోకలు సాగించవలసి వస్తోంది. ఈ క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. పలువురు మృత్యువాత పడ్డారు. వాగు దాటితే గాని బాహ్యప్రపంచానికి రాలేని పరిస్థితి వారిది. వాగు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో గల పాపంపేట చేరుకుంటేగాని వారికి వాహన సదుపాయం అందుబాటులోకి రాదు. ఏలేరు వాగుపై రోప్ బ్రిడ్జి అయినా నిర్మించాలని పింజిరికొండ వాసులు సంవత్సరాల తరబడి కోరుతూనే ఉన్నారు. (క్లిక్ చేయండి: పాపికొండలు.. షికారుకు సిద్ధం) -
తాండవకు ఏలేరు నీరు..
ఏలేరు నీటిని తాండవ జలాశయానికి అనుసంధానం చేసేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రూ.500 కోట్లతో జరిగే ఈ బృహత్కార్యక్రమానికి త్వరలో ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. తాండవ జలాశయం స్థిరీకరణతో ఆయకట్టు మరింత సస్యశ్యామలమవుతుంది. ఏలేరు, తాండవ జలాశయం కలయిక రెండు జిల్లాల రైతులకు వరం. సాక్షి, నర్సీపట్నం: తూర్పు కనుమల నుంచి వస్తున్న నీటికి 1959లో తాండవ వద్ద అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రిజర్వాయరుకు శంకుస్థాపన చేయగా పదేళ్ల కాలంలో ఇది పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుని విశాఖ, తూర్పుగోదావరి జిల్లా లోని 52 వేల ఎకరాలకు సాగునీరందించే దిశగా రూపుదిద్దుకుంది. తరువాత వచ్చిన పాలకులు దీన్ని పట్టించుకోకపోవటంతో రిజర్వాయరుతో పాటు కాలువల్లో పూడిక పేరుకు పోయి ఏటా ఆయకట్టు తగ్గుతూ వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయకట్టును పూర్తిస్థాయిలో స్థిరీకరించేందుకు కాలువ లైనింగ్ పనులు పూర్తి చేశారు. ఆయకట్టు భూములకు నీరు అందే పరిస్థితి ఉన్నా వరుణ దేవుడు కరుణిస్తే తప్ప రైతులు నాట్లు వేసే అవకాశం లేదు. ఈ సమస్య నుంచి పూర్తిస్థాయిలో గట్టెక్కించేందుకు నాడు తండ్రి మాదిరిగానే నేడు తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఈ రెండు జిల్లాల్లో ఆయకట్టు రైతులు ప్రతికూల వాతావరణంలో సైతం సుభిక్షంగా ఉండేందుకు ఏలేరు నీటిని తాండవకు అనుసంధానం చేసి మరింత ఆయకట్టు పెంచి స్థిరీకరణ చేసేందుకు నిర్ణయించారు. తాండవతో అనుసంధానించే ఏలేరు కాలువ వాస్తవ పరిస్థితి విశాఖ జిల్లాలోనే ఏకైక మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు. ఈ జలాశయం కింద విశాఖ జిల్లాల్లోని నాతవరం, నర్సీపట్నం, కోటవురట్ల, పాయకరావుపేట, నక్కపల్లి మండలాలకు చెందిన 32,689 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లా చెందిన కోటనందూరు, తుని, రౌతులపూడి మండలాలకు చెందిన 18,776 ఎకరాల ఆయకట్టు ఉంది. రిజర్వా యరు నిర్మాణం ప్రారంభంలో చివరి ఆయకట్టు వరకు నీరందేది. క్రమేణా కాలువల్లో పూడిక పేరుకుపోయి కుదించుకుపోవడంతో ఆయకట్టు విస్తీర్ణం ఏటా తగ్గుతూ వచ్చింది. చివరి భూములకు నీరు అందడం గగనంగా మారింది. వైఎస్సా ర్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువ లైనింగ్తో పాటు రిజర్వాయరు పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు పూర్తికావడంతో రిజర్వాయరు నిండితే చివరి ఆయట్టు వరకు సాగు నీరందిందేందుకు వీలు కలిగింది. కాలువలు బాగున్నా, వాతావరణం అనుకూలంగా లేక రిజర్వాయరులో నీరు లేని సమయాల్లో ఆయకట్టు రైతులు నాట్లు వేసే పరిస్థితి ఉండేది కాదు. జగన్ ప్రభుత్వంలో.. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి నర్సీపట్నం, తుని, పాయకరావుపేట, పత్తిపాడు ఎమ్మెల్యేలు ఉమాశంకర్ గణేష్, దాడిశెట్టి రాజా, గొల్ల బాబూరావు, పూర్ణచంద్రప్రసాద్, సినీ నటుడు, తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడికి చెందిన ఆర్.నారాయణమూర్తి వివరించారు. ఏలేరు నీటిని అనుసంధానం చేస్తే అధిక శాతం మెట్ట రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. దీంతో ఏలేరు కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యం పెంచడంతో పాటు ఈ నీటిని తాండవకు అనుసంధానం చేసేందుకు అవ సరమైన రూ.500 కోట్ల నిధులను మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. పనులు జరిగేది ఇలా.. గతంలో 1,200 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యంతో నిర్మాణం చేసిన ఏలేరు కాలువ ప్రస్తుతం 200 టీఎంసీల స్థాయికి చేరింది. దీనిని మళ్లీ పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రూ. 250 కోట్లు కేటాయించింది. పనులు పూర్తయిన తరువాత దీనిగుండా ప్రవహించే నీటిని తాండవ రిజర్వాయరుతో పాటు కాలువల్లో పలు చోట్ల లిఫ్ట్ ద్వారా వేసి వాటిని పూర్తిస్థాయిలో రైతాంగానికి అందించేందుకు నిర్ణ యం తీసుకున్నారు. ఈ పనులకు మరో రూ.250 కోట్లు కేటాయించారు. లిఫ్ట్ పనులు ఇలా.. నాతవరం మండలం, శరభవరం ఏలేరు కాలువ నుంచి పైపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి, గాంధీ నగరం వద్ద ఉన్న తాండవ ఎడమ కాల్వకు అందించేందుకు నిర్ణయించారు. దీనివల్ల బలిఘట్టం మేజరు భీమవరపు కోట మేజర్ల నుంచి కోటవురట్ల మండలాలకు పూర్తిస్థాయిలో సాగు నీరందుతుంది. చిన గొలుగొండపేట వద్ద పైన తాండవ కింద ఏలేరు ప్రవహించే అక్విడెక్టు ప్రాంతంలో లిఫ్ట్ ద్వారా రిజర్వాయరు కుడి కాల్వలో నీరు వేసేందుకు నిర్ణయించారు. తద్వారా కోటనందూరు మండలంలో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందుతుంది. ఇదే ప్రాంతం నుంచి ఏలేరు నీటిని తీసు కొని లిఫ్ట్ ద్వారా నాతవరం మండలం వెదురుపల్లి వద్ద తాండవ కుడికాలువకు అందించేందుకు నిర్ణయించారు. దీంతో కోటనందూరు మేజరుకు చెందిన పీకే గూడెం, రౌతులపూడి మండలాల్లో చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు అవకాశం కలుగుతుంది. ఇక్కడి నుంచి ఏలేరు నీటిని లిఫ్ట్ ద్వారా ఎగువన ఉన్న తాండవ రిజర్వాయరుకు తరలిస్తారు. ఈ విధంగా సమకూరిన నీటితో మధ్యస్థలంలో మిగిలి ఉన్న ఎడమ, కుడి కాల్వల మిగులు భూములకు నీరందించేందు కు అవకాశం ఏర్పడుతుంది. తాండవకు ఏలేరుతో అనుసంధానం చేసి ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగునీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇలా ఏటా సమృద్ధిగా నీరందితే మరికొంత అదనంగా ఆయకట్టు విస్తీర్ణం పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలా..నాడు వైఎస్సార్, నేడు జగన్మోహన్రెడ్డి తాండవ ఆయకట్టు రైతాంగంపై కరుణ చూపటం పట్ల విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించిన మెట్ట రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఆమోదం తెలిపారు ఏలేరు నీటిని తాండవ జలాశయానికి అనుసంధానం చేయడంతో నర్సీపట్నం నియోజకవర్గంతో పాటు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల రైతుల పొలాలకు పుష్కలంగా నీరు వస్తుంది. ఈ అనుసంధానానికి సీఎం జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. రూ. 500 కోట్లు ఈ పనులకు కేటాయిస్తామని సీఎం మాట ఇచ్చారు. తాండవ జలాశయం స్థిరీకరణతో ఆయకట్టు మరింత సస్యశ్యామం అవుతుంది. – పెట్ల ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్యే, నర్సీపట్నం ఆయకట్టు సస్యశ్యామలం ఏలేరు కాలువ, తాండవ జలాశయం అనుసంధానంతో జలాశయం కింద ఉన్న ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. మేజర్ ప్రాజెక్టు అయినప్పటికీ శివారు ఆయకట్టుకు నీరందడంలేదు. అనుసంధానంతో శివారు ఆయకట్టుకు నీరు అందడంతో పాటు రెండు పంటలు పండించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. – తాతాజీ, రైతు, మెట్టపాలెం -
ఏలేరు.. కానరాని జోరు!
ఆధునికీకరణపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి వైఎస్ హయాంలో శంకుస్థాపన మొదటి విడతగా రూ.138 కోట్ల కేటాయింపు ఆయన మరణానంతరం నిధులివ్వని సీఎంలు మొక్కుబడిగా తొలిదశ పనులు {పతిపాదనలకే పరిమితమైన రెండో దశ జగ్గంపేట : జిల్లాలోని మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంలో కీలక భూమిక పోషిస్తున్న ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. 24 టీఎంసీల సామర్థ్యమున్న ఏలేరు జలాశయం కింద ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో 67 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నుంచి శివారు ఆయకట్టుకు సక్రమంగా నీరందడం లేదు. దీంతో నీటి ఎద్దడి సమయంలో శివారు రైతులు నష్టపోతున్నారు. ఇదే సమయంలో వరదలు వచ్చినప్పుడు ముంపు బారిన పడి నష్టం చవిచూస్తున్నారు. వాస్తవానికి ఏలేరు కింద ప్రస్తుతం 53 వేల ఎకరాలే సాగవుతోంది. వీరవరం, వేలంక, సింహద్రిపురం, జగపతినగరం తదితర గ్రామాల్లో శివారు ప్రాంతాలకు నీరందడం లేదు. దీంతో శివారు ఆయకట్టు రైతులు బోర్లపై ఆధారపడుతున్నారు. పూడుకుపోయిన కాలువలు, ఎత్తుపల్లాలు, దెబ్బతిన్న స్లూయిజ్లు, బెడ్ రెగ్యులేటర్లవంటివాటితో ఏలేరు నీటిపారుదల వ్యవస్థ దెబ్బ తింది. దీంతో ఆధునికీకరణ అంశం తెరపైకి వచ్చింది. ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి ఈ ప్రాంత రైతులు ఏలేరు ఆధునికీకరణ అంశాన్ని తీసుకువచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత ఏలేరు ఆధునికీరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. 2009 ఫిబ్రవరిలో ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద రూ.138 కోట్లతో ఏలేరు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన రెండోసారి అధికారంలోకి రావడంతో ఏలేరు పనులు పూర్తవుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆయన హఠాన్మరణం చెందడంతో.. తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ఏలేరు ఆధునికీకరణకు నిధుల విడుదలలో జాప్యం చేస్తువచ్చారు. కిరణ్కుమార్రెడ్డి హయాంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, తోట సుబ్బారావునాయుడు, చలమలశెట్టి సునీల్ తదితరులు ఏలేశ్వరం నుంచి పిఠాపురం వరకూ పాదయాత్ర చేయడంతో నిధులు మంజూరయ్యాయి. వైఎస్ ఇచ్చిన జీఓ ప్రకారం రూ.138 కోట్లు కేటాయించగా.. వీటిలో ప్రాజెక్టు హెడ్వర్క్సకు రూ.7 కోట్లు, తిమ్మరాజుచెరువుకు రూ.3 కోట్లు కేటాయించారు. మిగిలిన రూ.127.54 కోట్లలో భూసేకరణకు సుమారు రూ.20 కోట్లు, వ్యాట్, సెస్వంటివాటికి రూ.10 కోట్లు పోను మిగిలిన రూ.97 కోట్లతో తొలి దశ పనులు చేపట్టాల్సి ఉంది. తొలిదశ కాంట్రాక్టును హైదరాబాద్కు చెందిన గాయత్రీ ప్రాజెక్టు సంస్థ పొందింది. తొలిదశ ప్రతిపాదిత పనులివే.. తొలిదశలో ఏలేరు ఇరిగేషన్ కాలువకు 16 బెడ్ రెగ్యులేటర్ల నిర్మాణం, డబ్బకాల్వ, యర్రకాల్వ, గొర్రిఖండి, వీరవరం కాల్వలు వెడల్పు చేసి ఆధునికీకరించడం చేపట్టాల్సి ఉంది. ఇందుకు 182 ఎకరాల భూము లు సేకరించాలి. ఈ ప్రతిపాదనలను ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే కలెక్టర్కు పంపారు. భూసేకరణ పూర్తయితేనే పనులు జరుగుతాయి. అలాగే ఎస్.తిమ్మాపురం వద్ద బెడ్ రెగ్యులేటర్ నిర్మించాల్సి ఉంది. దివిలివద్ద బెడ్ రెగ్యులేటర్ పనులు మాత్రం మొక్కుబడిగా చేపట్టారు. రెండో దశలో రూ.167 కోట్లతో ప్రతిపాదనలు ఏలేరు రెండో విడత ఆధునికీకరణకు ఇరిగేషన్ అధికారులు రూ.167 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సుమారు 75 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలిసేలా ఎస్.తిమ్మాపురంవద్ద బెడ్ రెగ్యులేటర్ నుంచి గొర్రిఖండి, సుద్దగెడ్డ మీదుగా యు.కొత్తపల్లి వరకూ ఒకవైపు, కాండ్రకోటవైపు దబ్బ కాలువ, నగరం ఖండిల మీదుగా రెండోవైపు కాలువలను ఆధునికీకరించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు కమిటీకి సవాల్గా మారిన ఆధునికీకరణ ఏలేరుకు తొలిసారిగా ప్రాజెక్టు కమిటీని నియమించారు. దానిముందు ఆధునికీకరణ అంశం సవాల్గా ఉంది. సర్కారు నాన్చుడు ధోరణి నేపథ్యంలో ఈ కమిటీ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. ప్రాజెక్టులో రబీకి సరిపడే నీరు లేనందున పనులు చేపట్టే ఆలోచనలో ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. అయితే రబీకి నీరవ్వకపోతే నష్టపోతామని రైతులు అంటున్నారు. దీనిపై కమిటీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.