breaking news
Waived agricultural loans
-
లీకులిస్తే జాగ్రత్త!
మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ హెచ్చరిక ప్రభుత్వ నిర్ణయాలు ముందే మీడియాకు తెలిస్తే ఎలాగని ఆగ్రహం రుణ మాఫీపై మెలికలు పెట్టరాదని కేబినెట్ భేటీలో నిర్ణయం హైదరాబాద్: రుణ మాఫీపై రాష్ర్ట స్థాయి బ్యాంకర్లతో జరిగిన చర్చల వివరాలు మీడియాలో రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నో సమస్యలుంటాయని, వాటిపై అంతర్గతంగా జరిగే చర్చలను బయటకు పొక్కనీయొద్దని హితవు పలికారు. కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలోని సి-బ్లాక్లో ఆదివారం రాత్రి 8 గంటలకు కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు రెండుగంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో రుణ మాఫీపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. లక్ష రూపాయల్లోపు పంట రుణాలను ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తిగా మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం స్థూలంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఎలాంటి మెలికలు పెట్టినా తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి ఉంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణాలను మాఫీ చేయడమే మంచిదని ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ విషయంలో ఆర్బీఐ మార్గదర్శకాలు, సాంకేతికాంశాలను తెలుసుకుని ఆ మేరకు వ్యవహరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, రైతుల రుణమాఫీ విషయంలో గత ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తింపజేస్తామంటూ మీడియాలో వచ్చిన వార్తలకు కారణం ఎవరంటూ సీఎం ఈ సందర్భంగా అందరినీ నిలదీసినట్టు సమాచారం. అయితే ప్రభుత్వ సలహాదారుల్లోనే ఒకరు ఈ లీకులు చేశారని ఓ మంత్రి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇకపై కేబినెట్ సమావేశాలకు సంబంధించి ఎలాంటి లీకులు వచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేసీఆర్ హెచ్చరించారు. ఎవరు లీకులు ఇస్తారో, ఎవరికి ఇస్తున్నారో, ఎలా ఇస్తున్నారో తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. లీకులు ఎవరు ఇచ్చినా సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోకుంటే జాగ్రత్త అని తీవ్ర స్వరంతో అన్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయాలను అధికారికంగా చెప్పేదాకా ఆగకుండా బయట పెడితే రుణమాఫీపై తలెత్తిన పరిస్థితులే ఎదురవుతాయని కేసీఆర్ వివరించారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే మీడియాలో జరిగిన ప్రచారంతో ఆత్మహత్యలు, ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. నిర్ణయం ఏదైనా తీసుకోవడానికి ముందుగా ఎన్నో చర్చలు జరుగుతాయని, అవన్నీ మీడియాలో ఎందుకు రావాలని కేసీఆర్ తన సహచరులను ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా, రాష్ర్ట అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ చేయాల్సిన ప్రసంగ పాఠాన్ని మంత్రివర్గం ఆమోదించింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను, ప్రభుత్వ ప్రాధాన్యతలను, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల అమలుపై వేయబోయే అడుగులు వంటి వాటికి గవర్నర్ ప్రసంగంలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల భర్తీతో పాటు అసెంబ్లీకి నామినేట్ చేయాల్సిన ఆంగ్లో ఇండియన్పైనా ఈ సందర్భంగా కేబినెట్ చర్చించింది. ఇక తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్థులు, ఉద్యమకారులపై పెట్టిన కేసుల ఎత్తివేత, అమరుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా తదితర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ భేటీలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులతో పాటు సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం పేషీ అధికారులు పాల్గొన్నారు. కాగా, తల్లి కర్మకాండల కోసం స్వగ్రామంలోనే ఉన్న విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి మాత్రం దీనికి హాజరుకాలేదు. హిమాచల్ ఘటనపై కేబినెట్ దిగ్భ్రాంతి విజ్ఞాన, విహారయాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్ వెళ్లిన రాష్ర్ట విద్యార్థులు అక్కడి బియాస్ నదిలో గల్లంతవడంపై రాష్ట్ర మంత్రివర్గం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. -
ఆ 1,27,000కోట్ల రూపాయల ఊసెత్తరేం?
ఫుల్పేజీ రాసి.. రుణాల మొత్తం ఎంతో చెప్పరేం రామోజీ? అధికారంలో ఉండగా బాబు రుణాలు కాదు కదా...కనీసం వడ్డీ అయినా మాఫీ చేశారా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకున్నారా? ఎన్నాళ్లిలా జనాన్ని మీ రాతలతో మోసం చేస్తారు? యథాప్రకారం జగన్పై సోమవారం నాలుగు పేజీల నిండా విషం కక్కిన ‘ఈనాడు’ ఒక పేజీ నిండా మాత్రం చంద్రబాబు ఇచ్చిన వ్యవసాయ రుణాల మాఫీ హామీని ఊదరగొట్టేసింది. అధికారంలో ఉండగా కరవుతో అల్లాడి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు రుణం కదు కదా... కనీసం వడ్డీని కూడా మాఫీ చేయలేదు. అలాంటి బాబు ఇప్పుడు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాననటం, దానికి ‘ఈనాడు’ తందాన పలకటం. ఇంతా చేసి... ఆ రుణాల మొత్తం ఎంతన్న సంగతి ఎక్కడైనా రామోజీ చెబితే ఒట్టు. నిజానికి రుణాలకు సంబంధించి ప్రతి ఏటా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశం జరుగుతుంది. దీన్లో అన్ని బ్యాంకులూ కలసి ఏ రుణాలు ఎంత ఉన్నాయనే విషయాన్ని చెబుతాయి. పెపైచ్చు ఆ ఏడాది ఎంత రుణాలివ్వాలనుకుంటున్నారు... అనే విషయాలను కూడా వెల్లడిస్తాయి. ఇటీవలే జరిగిన 182వ ఎస్ఎల్బీసీ సమావేశం ప్రకారం వ్యవసాయ రంగంలో నిరర్ధక ఆస్తులు, రావాల్సిన బకాయిలు కలిపి ఏకంగా రూ.1,27,546 కోట్లు... అక్షరాలా లక్షా ఇరవైఏడు వేల ఐదువందల నలభై ఆరు కోట్లున్నాయి. ఇవన్నీ వ్యవసాయ రుణాలే. మరి మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు... ఈ రూ.1.27 లక్షల కోట్ల రుణాలను ఎలా మాఫీ చేస్తారు? దీనిపై ఎన్నికల కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసినా సమాధానం ఇవ్వలేదెందుకు? అయినా ఈసీ కన్నా ముందు రైతులకు ఆ వివరణ చెప్పాలిగా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వయం సహాయక సంఘాల్లో మహిళల రుణాల్ని మాఫీ చేస్తానని హామీ ఇవ్వటమే కాక... ఆ మొత్తం ఎంత ఉందో, దాన్ని ఎలా అమలు చేయాలనుకుంటున్నది సమగ్రంగా వివరించింది. మరి బాబు దీనిపై మొహం చాటేస్తున్నారెందుకు? అసలు మన బడ్జెట్ ఎంత? హామీ ఇస్తున్న మొత్తమెంత? ఎలా దీన్ని అమలు చేస్తాం? అనే కాసింత జ్ఞానమైనా చంద్రబాబుకు గానీ, రామోజీరావుకు గానీ ఉందా? జగన్ హామీలు ఆచరణలో అసాధ్యమంటూ రోజూ పేజీలకు పేజీలు రాస్తున్న రామోజీరావు... వాస్తవాలకు వీసమెత్తు కూడా విలువివ్వటం లేదెందుకు? ఎన్ని అబద్ధాలు చెప్పి అయినా తన చంద్రబాబును గెలిపించుకోవాలన్న ఆయన బాధ చూస్తుంటే ఎవరికైనా జాలి కలగటం ఖాయం. ఎందుకంటే ఈ సమాజం పిచ్చివాళ్లపై ఎన్నడూ ఆగ్రహం చూపించదు. సానుభూతి మాత్రమే వ్యక్తం చేస్తుంది.