breaking news
vishalandra
-
ప్రముఖ సంపాదకుడు రాఘవాచారి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సంపాదకుడు, సాహితీవేత్త, కమ్యూనిస్టు నేత చక్రవర్తుల రాఘవాచారి (80) కన్నుమూశారు. కిడ్నీక్యాన్సర్తో ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో నెలక్రితం చికిత్సకోసం చేరారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు. ఉదయం 7గంటల సమయంలో ఆయన భౌతికకాయాన్ని హిమాయత్నగర్లోని మఖ్ధూం భవన్లో ఉంచారు. అక్కడ ఆత్మీయులు, ప్రముఖులు నివాళులర్పించిన అనంతరం విజయవాడకు తరలించారు. రాఘవాచారికి భార్య జ్యోత్న్స, కుమార్తె డాక్టర్ సి.అనుపమ ఉన్నారు. విశాలాంధ్ర సంపాదకునిగా 33 ఏళ్లు రాఘవాచారి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాంతాపురానికి చెందిన వరదాచారి, కనకమ్మ దంపతులకు 1939 సెప్టెంబర్ 10న జన్మించారు. నిబద్ధత, విలువలతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచారు.ప్రాథమిక, కళాశాల విద్యాభ్యాసం వరంగల్లోనే పూర్తి చేశారు. హైదరాబాద్లో లా చదివారు.ఆయనకు విజ్ఞాన నిఘంటువుగాను, మేధావిగాను ఎనలేని గుర్తింపు ఉంది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్ధి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. 33 ఏళ్ల పాటు విశాలాంధ్ర పత్రిక సంపాదకునిగా బాధ్యతలు నిర్వర్తించిన రాఘవాచారి..సీపీఐ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట కంట్రోల్ కమిషన్ చైర్మన్గా, జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యునిగా వ్యవహరించారు. 1972లో విశాలాంధ్ర ఎడిటర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2005 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఢిల్లీ నుంచి వెలువడే ‘పేట్రియట్’దినపత్రిక, లింక్ వార పత్రికలకు ఆయన హైదరాబాద్ పాత్రికేయునిగా పనిచేశారు. కొద్దికాలం ఢిల్లీలో కూడా పనిచేశారు. పార్టీ కార్యకలాపాల్లో పరిచయమైన విజయవాడకు చెందిన జ్యోత్స్నను ఆయన 1969లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. రాఘవాచారి భౌతికకాయం వద్ద విషణ్న వదనాలతో కుటుంబ సభ్యులు ఏడేళ్ల కిందటే కిడ్నీ క్యాన్సర్.. ఏడేళ్ల క్రితం రాఘవాచారి కిడ్నీ క్యాన్సర్తో అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అస్వస్థతలో ఉన్నప్పటికీ ఆయన సమకాలీన అంశాలపై పూర్తి అవగాహనతో ఉండేవారు. ఇటీవల కిడ్నీ క్యాన్సర్ తిరగబెట్టడంతో తన కుమార్తె అనుపమ వైద్యురాలిగా పనిచేస్తున్న ఆసుపత్రిలోనే చికిత్సకు చేరారు.అక్కడే తుదిశ్వాస విడిచారు. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి రాఘవాచారి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా, విలువలు కలిగిన సామాజిక కార్యకర్తగా ఆయన సాగించిన జీవితం ఆదర్శ ప్రాయమన్నారు.కుటుంబ సభ్యులు, సహచరులకు సానుభూతి తెలిపారు.అదేవిధంగా సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా, సీపీఐ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, ప్రముఖ పరిశోధకుడు, కవి జయధీర్ తిరుమలరావు రాఘవాచారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తపరిచారు. రాఘవాచారి సేవలు మరువలేనివి ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాఘవాచారి విలువల ఆధారిత జర్నలిజాన్ని విశ్వసించారని కొనియాడారు. తెలుగు పాత్రికేయ రంగంలో రాఘవాచారి చేసిన సేవలు మరువలేనివని శ్లాఘించారు. ఆయన రచనలు నేటి తరానికి ప్రేరణగా నిలుస్తాయరు. తెలుగు జర్నలిజంలో రాఘవాచారి ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాఘవాచారి భౌతికకాయాన్ని అంబులెన్స్లోకి తీసుకువెళ్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తదితరులు -
ఒకే పతాకం కిందకు వస్తారా?
హైదరాబాద్ మహాసభలకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ‘విలీనం అంశం’ ఈ సభల ఎజెండాలో లేదని ప్రకటించడం విచారకరం. ఇలాంటి మాటలు, ప్రకటనలు ఏవీ వ్యక్తిగతాలు కావు. కానీ ‘ప్రపంచ కార్మికులారా, ఏకంకండి!’ అన్న మార్క్స్ ప్రధాన నినాదాన్ని సీపీఎం ఎందుకు గుర్తించడం లేదు? ‘ప్రపంచ పీడితులారా, ఏకంకండి’ అన్న లెనిన్ నినాదాన్ని మరిచిపోయినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నది? వీటి గురించి హైదరాబాద్ సభలలో కనీస చర్చ జరిగిందా? అయితే ఆ దిశగా అసలు కదలికే లేదని కాదు. కానీ శత్రువు సునామీ వలె దూసుకువస్తున్న నేటి సమయంలో ఈ నత్తనడకలు ఏం సాధించగలవు? హైదరాబాద్లో జరిగిన సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు కార్యకర్తలలో, అభిమానులలో కొత్త ఆశలను చిగురింపచేశాయి. ఏ మహాసభ అయినా విజయవంతమైనదా, లేదా అని తేల్చుకోవడానికి పాల్గొన్న ప్రతినిధులు, చర్చల స్థాయి, చర్చించుకున్న అంశాల ప్రాముఖ్యం, తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం, తదుపరి మహాసభల వరకు ప్రధాన కార్యదర్శి సహా వివిధ స్థాయిలలో ఎన్నికైన కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో, వాటి పొందిక వంటి అంశాలను గమనిస్తాం. చివరిరోజు బహిరంగ సభ, అది ఇచ్చిన ఉత్సాహం, ప్రదర్శన తీరుతెన్నులు సామాన్య ప్రజానీకంలో, అభిమానులలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. ఆ విధంగా చూస్తే హైదరాబాద్ సభలు నిర్ణయాత్మకమైనవే. ఇందుకు తెలంగాణ నాయకత్వాన్ని అభినందించాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తీసుకున్న ‘సమైక్య’ నినాదం సీపీఎంను ప్రజలకు దూరం చేసింది. ఫలితం ఏదైనా, సిద్ధాంతపరంగా పార్టీ వ్యవహరించిందని నాయకత్వం జబ్బులు చరుచుకోవచ్చు. కానీ ఆపరేషన్ విజయవంతమైనా, రోగి దక్కలేదన్న చందంగా తెలంగాణలో పార్టీ పరిస్థితి తయారైంది. కానీ పార్టీ ఆ∙నినాదానికైనా కట్టుబడి ఆంధ్రలో, హైదరాబాద్ పరిసరాలలో జన సమీకరణ కూడా చేయలేదు. ఒక నినాదం ఇచ్చి ఆపై ఇంత నిష్క్రియాత్వంతో పార్టీ వ్యవహరించడం ఇదే మొదటిసారి. పైగా సుందరయ్యగారి ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’నినాదాన్ని సమైక్య ఆంధ్ర వాదనకు పునాదిగా చూపడం మరీ చిత్రం. సుందరయ్యగారిది అప్పటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ (1946) వైఖరి. తెలుగు ప్రజలంతా కలసి నూతన ప్రజాస్వామిక (ప్రజా) రాజ్యం ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. సుందరయ్యగారి చివరిదశలో వెంట ఉండి కొన్ని అంశాలను నేరుగా వారి నుంచే గ్రహించే అవకాశం నాకు దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత, ఇచ్చిన వాగ్దానాల మేరకు తెలంగాణకు మేలు జరగలేదు. ప్రాజెక్టులు, ఉపాధి, పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలలో ఆ ప్రాంతం వెనుకబడిపోవడం ఆయనను బాధించింది. మద్రాస్ అపోలో ఆస్పత్రిలో ఉండగా కలుసుకోవడానికి వచ్చిన తెలంగాణ నేతలతో ఆ ప్రాంత వెనుకబాటు తనం మీద పోరాడాలని సూచించారు. అంతటి దయనీయ స్థితి నుంచి అక్కడి సీపీఎం శాఖ కోలుకోవడమే కాదు, కమ్యూనిస్టు ఉద్యమం పునరుజ్జీవం పొందగలదన్న విశ్వాసం కూడా మహా సభల ద్వారా కల్పించారు. ఇందుకు పార్టీ విభాగం, కార్యదర్శి వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యులు చేసిన కృషి ప్రశంసనీయమైనది. మనం చెప్పేది నాయకత్వం వినిపించుకోదని భావిస్తూ పార్టీ పట్ల నిరాశా నిస్పృహలతో ఉన్న మేధావులను కలసి చర్చించారు. త్యాగనిరతిలో, ప్రజలకు రక్షణగా కార్యకర్తలు ఎలా ఉండాలో మీకు తెలుసు. లోపాలు ఉంటే చెప్పండి. పొరపాట్లు ఉంటే చెప్పండి. సాధ్యమైనంతవరకు సరిదిద్దుకుందాం అని చెప్పారు. ఆ పార్టీ నేత చేపట్టిన విస్తృత మహాజన పాదయాత్ర ఫలితంగా ప్రస్తుతం టీమాస్ (తెలంగాణ ప్రజాసంఘాల వేదిక), బీఎల్ఎఫ్ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్) వంటి రాజకీయ నిర్మాణాల ద్వారా ప్రజలను సంఘటితం చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇది కమ్యూనిస్టుల జైత్రయాత్రకు బాటలు వేస్తుందనీ, పార్టీని మళ్లీ ప్రజల వద్దకి చేరుస్తుందనీ విశ్వసిద్దాం. లాల్–నీల్ నినాదం వేళ్లూనుకుంటుందని ఆశిద్దాం. మీడియాలో వచ్చిన మేరకు మహాసభల చర్చల ధోరణి ఇలా ఉంది. లాల్–నీల్ ఐక్యత ఆవశ్యకత గురించి ప్రతినిధుల మధ్య కొంత చర్చ జరిగింది. అంతకంటే ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో ఒప్పందం చేసుకోవచ్చునా, చేసుకోకూడదా? లేదా ఈ రెండు పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయంగా మరొక సంఘటనను ప్రజాస్వామిక, లౌకిక శక్తులతో కలసి ఏర్పాటు చేయాలా? లేదా? అనే అంశంపైనే చర్చ జరిగింది. ఈ అంశం మీదే ప్రస్తుత, మాజీ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్ల మధ్య పోటీ వచ్చిందనీ, బలాబలాలు గత ఆరుమాసాలుగా మారుతున్నాయనీ మీడియా ప్రచారం చేసింది. ఓటింగ్ జరుగుతుందని, ప్రధాన కార్యదర్శి మార్పు కూడా ఉండవచ్చునని కూడా కథనాలు వెలువడినాయి. మీడియాకు ఇలాంటి అంశాల మీద ఉన్న దృష్టి వాస్తవికతపై ఉండకపోవచ్చు. నిజానికి ఇలాంటి ప్రశ్న నాలుగు దశాబ్దాల క్రితమే తలెత్తింది. అత్యవసర పరిస్థితిని విధించి, నియంతృత్వంతో పాలించిన ఇందిరా గాంధీనీ, ఆమె పార్టీనీ ఓడిం చేందుకు అనుసరించవలసిన విధానం గురించి సీపీఎం అఖిల భారత వ్యవస్థాపక కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య చొరవ, దూరదృష్టి కారణంగా జలం ధర్ మహాసభలో తీవ్ర చర్చ జరిగింది. మతతత్వ బీజేపీతో ఎన్నికల అవగాహనకు కూడా రావాలని మిగిలిన పొలిట్బ్యూరో భావించింది. చివరకు ఏకీకృత ప్రతిపాదన ద్వారా అవగాహనకు వచ్చి పదో మహాసభ పార్టీ ఐక్యతను కాపాడుకుంది. నాలుగు దశాబ్దాల తరువాత కూడా ఈ 22వ మహాసభలు చర్చ తీవ్ర స్థాయిలోనే జరిగి, తుదకు మతతత్వం, నేటి మోదీ–షా దుష్టపాలనను అంతం చేయడమే అత్యంత కీలకమన్న విషయంలో ప్రతి నిధుల విజ్ఞత పుణ్యమా అని ఏకీకృత అంగీకారానికి నాయకత్వం రాగలిగింది. అలాగే ఎన్నికలలో అనుసరించవలసిన విధానం గురించి కూడా. కాంగ్రెస్తో అవగాహన, వివిధ రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులను గమనించుకుంటూ కీలక కర్తవ్యాన్ని నిర్వహించి ఎన్నికల తదుపరి నిర్ణయం తీసుకునేందుకు అంగీకారం కుదిరింది. ఇది కూడా అభినందనీయమే. నేడు దేశంలో దాదాపు మూడు డజన్లుగా చీలి పోయిన కమ్యూనిస్టు ఉద్యమ సంస్థల గురించి మహాసభలు లోతుగా చర్చించి ఉండవలసింది. కమ్యూనిస్టుల ఐక్యత ఎందుకు సాధ్యం కావడం లేదో, కనీసం పార్లమెంటరీయేతర పోరాటాలను సమన్వయం చేసుకుని పురోగమించాలన్న అవగాహనతో విభేదాలు అంతగా లేని సీపీఐ, సీపీఎంలు విలీనం దిశగా ఎందుకు ముందడుగు వేయలేక పోతున్నాయో వామపక్ష మేధావులకు సైతం అంతుపట్టడం లేదు. దశాబ్దం క్రితమే నల్లగొండలో నాటి సీపీఐ రాష్ట్ర మహాసభలలో సౌహార్ద్ర సందేశం ఇచ్చిన నేటి సీపీఎం కార్యదర్శి బీవీ రాఘవులు ‘సీపీఎం, సీపీఐలు విడివిడిగా జరుపుకునే మహాసభలు ఇవే. వచ్చే రాష్ట్ర మహాసభలు ఒకే మహాసభగా జరుగుతాయ’ని ప్రతినిధుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించినట్టు గుర్తు. కానీ హైదరాబాద్ మహాసభలకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ‘విలీనం అంశం’ ఈ సభల ఎజెండాలో లేదని ప్రకటించడం విచారకరం. ఇలాంటి మాటలు, ప్రకటనలు ఏవీ వ్యక్తిగతాలు కావు. కానీ ‘ప్రపంచ కార్మికులారా, ఏకంకండి!’ అన్న మార్క్స్ ప్రధాన నినాదాన్ని సీపీఎం ఎందుకు గుర్తించడం లేదు? ‘ప్రపంచ పీడితులారా, ఏకంకండి’అన్న లెనిన్ నినాదాన్ని మరిచిపోయినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నది? వీటి గురించి హైదరాబాద్ సభలలో కనీస చర్చ జరిగిందా? అయితే ఆ దిశగా అసలు కదలికే లేదని కాదు. కానీ శత్రువు సునామీ వలె దూసుకువస్తున్న నేటి సమయంలో ఈ నత్తనడకలు ఏం సాధించగలవు? మరొక ప్రధాన అంశం ప్రస్తావించడం కూడా అవసరం. సుందరయ్యగారు కార్యదర్శిగా ఉండగా నాటి కార్యదర్శి వర్గ సభ్యులు లావు బాలగంగాధరరావును సహాయ కార్యదర్శిగా నియమించాలని ఒక సూచన వచ్చింది. అది అనవసరమని, సుందరయ్య కార్యదర్శిగా ఉండగా కార్యదర్శివర్గంలోని వారంతా సహకరించగలరని ఉద్దరాజు రామం వాదించారు. కానీ సుందరయ్యగారే, సహాయ కార్యదర్శి అని పేరు పెట్టడంలో తదుపరి కార్యదర్శి ఆయనే అనీ కాదు. ఆయననే కార్యదర్శిగా చేయకూడదని కూడా కాదు అని చెప్పారు. ఎల్బీజీ తరువాత కార్యదర్శి అయ్యారు (అప్పటికి సుందరయ్య కన్నుమూశారు). ఆ తరువాత అఖిల భారత మహాసభ సందర్భంగా పొలిట్బ్యూరోలోకి ఎల్బీజీనే తీసుకున్నారు. ఎల్బీజీ కంటే మోటూరి హనుమంతరావు అన్ని విధాలా అర్హుడనీ, ఆయనను కాదని ఎల్బీజీని ఎందుకు తీసుకున్నారని నేను పొలిట్బ్యూరోకి లేఖ రాశాను. ‘ఎల్బీజీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి. పొలిట్బ్యూరో సాధికారితకోసం తీసుకున్నాం’అని నాకు సమాధానం వచ్చింది. 22వ మహాసభల అనంతరం కూడా సీపీఎంను అలాగే అడగవలసి ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాజధాని హైదరాబాద్లో సభలు దిగ్విజయంగా జరిగాయి. అలాంటి విభాగానికి పొలిట్బ్యూరోలో సాధికారతకు సభ్యత్వం ఇచ్చి ఉంటే బాగుం డేది. బీవీ రాఘవులు ఆంధ్రప్రదేశ్ తరఫున పొలిట్బ్యూరోలో ఉన్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర సాధికార ప్రతినిధి కాలేడు కదా! పైగా వీరభద్రం కూడా అందుకు అర్హుడే! పార్టీ నిర్మాణం, కార్యక్రమాల సక్రమ నిర్వహణ సాఫీగా సాగేందుకు ఇలాంటి సున్నిత అంశాలను కూడా పార్టీ దృష్టిలో ఉంచుకోవడం అవసరం. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
కంటితుడుపేనా?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘మాది అలనాటి రాజధాని.. విశాల హృదయంతో విశాలాంధ్ర కోసం రాజధానిని త్యాగం చేసిన చరిత్ర మాది. రాజధాని వైభవాన్ని పూర్తిగా అనుభవించక ముందే హైదరాబాద్కు తరలించి తెలుగుజాతి ఐక్యతను చాటిచెప్పిన ఔదార్యం మాది. అలాంటి జిల్లాకు శివరాకృష్ణన్ కమిటీ రాష్ట్ర విభజన జరిగిన వెంటనే రావలసింది. కానీ కంటి తుడుపు చర్యగా కర్నూలుకు రావటం మా దురదృష్టం’ అని జిల్లాకు చెందిన మేధావులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయమని శివరామకృష్ణన్ కమిటీని కోరటం ఎడారిలో కేక పెట్టటమే తప్ప మరొక ప్రయోజనం కనిపించటం లేదంటున్నారు. అందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే విజయవాడ- గుంటూరు మధ్యే రాజధానిని ఏర్పాటు చేయనున్నట్లు పత్రికలు, టీవీల్లో వెలువడిన ప్రకటనలే నిదర్శనమంటున్నారు. ఇదే విషయంపై పలువురు మేధావులు కమిటీ ముందే అనుమానం వ్యక్తం చేశారు. కేవలం రాయలసీమ ప్రజలను మభ్యపెట్టేందుకే శివరామకృష్ణన్ కమిటీ తీరిగ్గా నెల రోజుల తరువాత పర్యటించటాన్ని జనం తప్పుపడుతున్నారు. అంతేకాకుండా అనారోగ్యంతో శివరామకృష్ణన్ కర్నూలుకు రాలేదు. కేవలం నలుగురు సభ్యులు మాత్రమే రావడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకునేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా జిల్లాలో పర్యటించింది. తెలంగాణ జిల్లాల కంటే కర్నూలు జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని కమిటీ సభ్యులు గుర్తించి, ఆ మేరకు నివేదిక ఇచ్చారు. ఆ కమిటీ రాకతో సీమకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారు. నిద్రాహారాలు మాని సమైక్యాంధ్ర కోసం రేయింబవళ్లు ఉద్యమం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. శ్రీకృష్ణ కమిటీ పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని ఆ తర్వాతి పరిణామాలు తేల్చేశాయి. ఇక రాజధాని ఎంపిక పరిశీలన కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ పరిస్థితీ అంతే అని జనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రాజధానిగా కర్నూలు నుంచి తీసుకెళ్లి అన్యాయం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత తిరిగి కర్నూలును రాజధానిని చేస్తారని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ చర్యలు చూస్తుంటే కర్నూలుకు రాజధాని నీటి మూటలేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీకృష్ణ కమిటీలాగానే.. శివరామకృష్ణన్ కమిటీ కూడా ఉంటుందని జిల్లా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అడుగడుగునా అధికారుల వైఫల్యాలు: శివరామకృష్ణన్ కమిటీ కోస్తాంధ్రలో పర్యటించి నివేదిక ఇచ్చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే సీమ ప్రజలు ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు నెల రోజుల తరువాత తీరిగ్గా కమిటీ పర్యటిస్తోందని పలువురు మేధావులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చీ రాగానే కారులో కర్నూలు నగరంలో పర్యటించారు. రాజధాని కోసం ఎదురుచూస్తున్న కర్నూలు ప్రజలు కమిటీకి వారి ఆవేదనను వివరించే అవకాశాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేయలేకపోయారు. కనీసం జిల్లాలోని ఎమ్మెల్యేలకూ కమిటీ పర్యటన విషయాన్ని తెలియజేయకపోవటం గమనార్హం. అదే విధంగా అనేక మంది కమిటీకి నివేదించేందుకు ఎదురుచూస్తున్న సమయంలో కలెక్టర్ సమావేశ మందిరంలో చర్చావేదికను ఏర్పాటు చేయటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతసేపు గందరగోళం నెలకొంది. శివరామకృష్ణన్ కమిటీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చివరకు జేసీ కన్నబాబు కలుగజేసుకుని సునయన ఆడిటోరియంలోకి చర్చా వేదికను మార్చారు. సీమకు మళ్లీ అన్యాయం తప్పదు: రాయలసీమకు మరోసారి అన్యాయం తప్పదని పలువురు కమిటీ ముందు స్పష్టం చేశారు. 50 ఏళ్లకు ముందు రాజధానిని తరలించుకెళ్లి అభివృద్ధిలో కర్నూలును వెనక్కు నెట్టేశారు. మళ్లీ ఇప్పుడు కోస్తాంధ్రలో రాజధానిని ఏర్పాటు చేయడానికి సిద్ధమై సీమకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారని శర్మ అనే వృద్దుడు ఆందోళన వ్యక్తం చేశారు. ‘జిల్లాలో రాళ్లు, నీరు, మట్టి, ఘనులు, నల్లమల అడవులు సమృద్ధిగా ఉన్నాయి. రాజధాని ఏర్పాటుకు అవసరమైనవన్నీ పుష్కలంగా ఉన్నాయి. అయితే రిచ్ పీపుల్స్ చెప్పుచేతల్లో రాజధాని ఏర్పాటు ఆధారపడి ఉంది. ఆ రిచ్ పీపుల్స్ అంతా కోస్తాంధ్రలో ఉన్నారు. అందుకే వారు చెప్పిన దానికి ప్రభుత్వం తలూపుతోంది. కార్పొరేట్ వ్యాపారుల చేతుల్లో రాజధాని నిర్ణయం ఆధారపడి ఉండటం అన్యాయం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణాలోను సమైక్యవాదులు ఉన్నారు