breaking news
TYSRCP leaders
-
కరపత్రాన్ని అవిష్కరించిన టివైఎస్ఆర్సిపి
-
'టీఆర్ఎస్ కార్యకర్తలుగా ప్రభుత్వ అధికారులు'
హైదరాబాద్: గ్రేటర్ హైదారబాద్ పరిధిలోని ప్రభుత్వాధికారులు అధికార పార్టీ టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. టీవైఎస్ఆర్సీపీ నేతలు శివకుమార్, సురేష్ రెడ్డి, విజయ్ బుధవారం నాడు తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. గ్రేటర్ పరిధిలో వార్డుల విభజన ఇష్టారాజ్యంగా చేశారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్కు మా అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోలేదని ఈ విషయంపై స్పందించాలని టీవైఎస్ఆర్సీపీ నేతలు ఎలక్షన్ కమిషనర్ను కోరారు.