breaking news
trs corporator
-
హద్దులు దాటిన ఆక్రమణ.. 136 కోట్ల సర్కార్ భూమికి ఎసరు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన ప్రజాప్రతినిధులే వాటి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండీఏ ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భూమిని ప్లాట్లుగా మార్చి.. హద్దురాళ్లు నాటి అమ్మకానికి పెట్టారు. అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త ఈ భూ ఆక్రమణలో ప్రధాన పాత్రదారుగా ఉండటంతో స్థానిక మున్సిపాలిటీ టౌన్ప్లానింగ్ అధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు కిమ్మనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.156 కోట్ల భూమిపై కన్ను రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కుర్మల్గూడ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 80/1లో 5.32 ఎకరాలు, సర్వే నం. 80/2లో 7.07 ఎకరాలు సర్కారు భూమిగా నమోదైంది. దీనిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 80/3లోని 4.23 ఎకరాల భూమి ప్రభుత్వం మోడల్ గ్రేవీ యార్డ్ (క్రిస్టియన్ శ్మశాన వాటిక)కు, సర్వే నం. 80/19లోని 10.27 ఎకరాల భూమిని మోడల్ గ్రేవీ యార్డ్ (ముస్లిం శ్మశాన వాటిక)గా నమోదై ఉంది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ వెబ్సైట్లోనూ ఇదే స్పష్టం చేస్తోంది. బహిరంగ మార్కెట్లో ఈ 13 ఎకరాల విలువ రూ.156 కోట్ల పైమాటే. విలువైన ఈ ప్రభుత్వ భూములపై బడంగ్పేట్ నగరపాలక సంస్థ పరిధిలోని అధికార పారీ్టకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త కన్నేశారు. వీటిపై తమకే హక్కులు ఉన్నాయని పేర్కొంటూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సర్వే నం. 80/1లోని కొంత భూమిని ఆక్రమించారు. ఆ భూమిని చదును చేశారు. ప్లాట్లుగా చేసి అమ్మకానికి రంగం సిద్ధం చేశారు. మూడు ఎకరాలు గుర్తించాం ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సర్వే నం. 80/1, 80/2లోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు కూడా అందింది. గురువారం ఉదయం ఆర్ఐ సహా ఇతర సిబ్బంది క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించి, ఆ మేరకు జేసీబీతో నాటిన హద్దు రాళ్లను కూడా తొలగించాం. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఓ బోర్డును కూడా నాటించాం. ఈ భూములను ఎవరు ఆక్రమించారనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. వచి్చన వెంటనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – జనార్దన్, తహసీల్దార్, బాలాపూర్ -
కాంగ్రెస్లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి
-
టీఆర్ఎస్ కు బై బై.. కాంగ్రెస్ కు హయ్ హయ్..!!
-
ఎల్బీనగర్ లో టిఆర్ఎస్ -బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
-
కాచిగూడ కార్పొరేటర్పై అనర్హత వేటు
సాక్షి, హైదరాబాద్ : అధికారంలో కొనసాగాలని నిజాన్ని దాచిపెట్టిన టీఆర్ఎస్కు చెందిన ఓ కార్పొరేటర్పై వేటుపడింది. కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల కన్నాచైతన్య ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు సంతానం కలిగి ఉన్నారని బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉమాదేవీ భర్త రమేష్యాదవ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు విచారణలో కన్నాచైతన్య తనకు ముగ్గురు సంతానం ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టినట్టు తేలింది. దీంతో ఆమెపై అనర్హత వేటువేస్తూ నాంపల్లి కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. రెండోస్థానంలో ఉన్న ఉమాదేవీ రమేశ్యాదవ్ను కార్పొరేటర్గా కొనసాగించాలని కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో ఉమా రమేశ్ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరిన రమేశ్యాదవ్.. ఎన్నికల అనంతరం ఆయన తిరిగి బీజేపీలో చేరడం గమనార్హం. -
టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ
-
కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ..!
సాక్షి, ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్లో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్తపై ఓ మహిళ తిరగబడ్డారు. తమ ఇంటి ప్రహారీ గోడను కూల్చివేయడంతో ఆగ్రహించిన ఆమె.. ఎందుకు గోడను కూల్చేశారంటూ.. కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టారు. కార్పొరేషన్ అధికారులు చేపట్టాల్సిన పనిలో ‘నీకేమి పని ఉంటూ’ అని ఆమె అతన్ని నిలదీశారు. నగరంలోని ఐదో డివిజన్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఐదో డివిజన్లో మల్సూరు సుజాత దంపతులకు నివాస భూమి ఉంది. ఈ భూమిపై కన్నేసిన నలుగురు కార్నొరేటర్లు కొంతకాలంగా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉదయం మల్సూరు దంపతుల ఇంటికి వెళ్లిన 23వ డివిజన్ కార్పొరేటర్ పొట్ల శశికళ భర్త వీరెందర్ దౌర్జన్యానికి దిగినట్టు తెలుస్తోంది. సుజాత దంపతుల నివాసానికి సంబంధించిన ప్రహారీ గోడను అతను కూల్చివేయించడంతో మల్సూరు సుజాత కార్పొరేటర్ భర్తపై తిరగబడ్డారు. ఎలా తన ఇంటి గోడను కూల్చేస్తారంటూ.. అతనికి చెప్పుతో దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతను ఆమెను కిందపడేసి.. తప్పించుకునేందుకు ప్రయత్నించారు. -
నడిరోడ్డుపై టీఆర్ఎస్ కార్పొరేటర్ డ్యాన్స్
-
టీఆర్ఎస్ నేత డ్యాన్స్.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: ఆయన గ్రేటర్లో కార్పొరేటర్.. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ.. సమస్యలపై స్పందిస్తూ అందరి మన్ననలు పొందారు. పౌరుల సమస్యలపై విభిన్నంగా స్పందించే ఆయన అందరికీ ఆదర్శమంటూ గతంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రశంసించారు. అయితే సదరు కార్పొరేటర్కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. హయత్నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి.. స్నేహితులు, అనుచరులతో కలిసి రెండురోజుల క్రితం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లారు. అక్కడ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ హైవేపై ఆగి అనుచరులతో కలిసి తీన్మార్ ఆడారు. ఇరువైపులా వాహనాలు వస్తున్నా పట్టించుకోకుండా.. కారులో పాటలు పెట్టుకుని నడిరోడ్డుపై చిందులేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన అనుచరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇపుడు వైరల్గా మారింది. ఓ ప్రజాప్రతినిధి రోడ్డుపై కారు ఆపి ఇలా డ్యాన్సులు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. సమాజానికి, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులే ఇలా ప్రవర్తించడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. -
చైతన్యపురిలో టీఆర్ఎస్ కార్పొరేటర్ హంగామ
-
చైతన్యపురిలో టీఆర్ఎస్ కార్పొరేటర్ హంగామ
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నేత ఒకరు నానా హంగామా చేశారు. ఇల్లుకట్టుకోవాలంటే డబ్బు ఇవ్వాలంటూ చైతన్యపురిలో టీఆర్ఎస్ కార్పొరేటర్ విఠల్రెడ్డి హల్చల్ చేశారు. ఓ ఇంటి యజమాని ఇల్లు కట్టుకోవాలనుకోగా అలా చేయాలంటే తనకు రూ.10లక్షలు ఇవ్వాలంటూ ఇంటి యజమానిపై కార్పొరేటర్ విఠల్ రెడ్డి గత కొంతకాలంగా ఒత్తిడి చేశారు. అందుకు అతడు నిరాకరించి డబ్బు ఇవ్వకపోవడంతో అతడి ఇంటిపై దాడి చేశారు. ఇంటి నిర్మాణం కోసం వచ్చిన కార్మికులపై 30మంది అనుచరులతో కలిసి విఠల్ రెడ్డి దాడి చేశారు.