breaking news
traffice jam
-
అపర్ణకు జనం సెల్యూట్!
తిరువనంతపురం: ఈ రోజుల్లో పోలీస్ డ్యూటీ అంటే కేవలం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదు.. మానవత్వానికి ప్రతిరూపంగా నిలవడం కూడా. తాజాగా కేరళకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారిణి అందుకు నిదర్శనంగా నిలిచారు. ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్కు దారి ఇచ్చేందుకు ప్రయత్నం చేయడమే కాదు.. రోడ్డు మధ్యలో పరుగెత్తుతూ వాహనాలను పక్కకు జరుపుతూ సంకేతాలు ఇచ్చారు. ఆమె చేసిన ఈ చర్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో ఆగస్టు 9న కేరళలోని త్రిసూర్ జిల్లాలో జరిగింది. త్రిసూర్ జిల్లాకు చెందిన ఓ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ అంబులెన్స్ జూబ్లీ మిషన్ ఆస్పత్రి వైపు వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో పోలీసు వాహనంలో వెళ్తున్న స్టేషనల్ హౌస్ ఆఫీసర్ అపర్ణా లవకుమార్ ఆ అంబులెన్స్ను గమనించారు. వెంటనే పోలీసు వాహనం నుంచి మెరుపు వేగంతో బయటకు వచ్చారు. అంబులెన్స్ ముందు పరుగెత్తుతూ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీంతో అంబులెన్స్ సకాలంలో ఆస్పత్రికి చేరడం,రోగికి చికిత్స అందడంపై అపర్ణా లవకుమార్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.అపర్ణా మానవత్వం చూపించిన ఘటనలో కోకొల్లలు. 2019లో త్రిసూర్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తుండగా ఐదోతరగతి చదువుతున్న చిన్నారి బాధడను చూడలేక ఆమె తన జుట్టును పూర్తిగా తీసేసి కేన్సర్ పేషెంట్ల కోసం దానం చేశారు. పోలీస్ శాఖ నియమాల ప్రకారం జుట్టు పూర్తిగా తీసేసుకోవడానికి అనుమతి అవసరం. ఆమె నిర్ణయాన్ని త్రిసూర్ రూరల్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ విజయ్ కుమార్ స్వాగతించారు.2008లో ఓ మృతదేహాన్ని విడుదల చేయించేందుకు ఆసుపత్రి బిల్లులు చెల్లించేందుకు తన బంగారు గాజులను ఇచ్చారు. ఇలా విధులు నిర్వహిస్తున్న అపర్ణా లవకుమార్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Big Salute to #Kerala police woman ASI Aparna Lavakumar. In Thrissur, she ran ahead of a stalled ambulance in heavy traffic, personally urging vehicles aside so that the emergency vehicle with the patient could proceed safely. Aparna was previously praised for pawning her gold… https://t.co/RoUqXSzwAv pic.twitter.com/mip2MMLO7k— Ashish (@KP_Aashish) August 11, 2025 -
Hyderabad: భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్: హైదరాబాద్లో గురువారం సాయంత్రం పలుచోట్ల కుండపోతగా వర్షం కురిసింది. అమీర్పేట్, మైత్రీవనం, ఎస్ఆర్ నగర్లో దాదాపు గంట పాటు వర్షం దంచికొట్టింది. దీంతో, పంజాగుట్ట నుంచి కూకట్ పల్లి మార్గంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్నగర్లో కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రోడ్లన్ని ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. మ్యాన్ హోల్లు పొంగిపోర్లుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలతో రోడ్లన్ని రద్దీగా మారాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై నీళ్లు ఆగకుండా చర్యలు చేపట్టారు. కాగా మరో గంటపాటు జంటనగరాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. టోలీచౌకిలో పలు కాలనీలు నీటమునిగాయి. రంగంలోకి జీహెచ్ఎమ్సీ డిజాస్టర్, మాన్సూన్ బృందాలు రంగంలోకి దిగాయి. జూబ్లీహిల్స్లో 10 సెం.మీ, ముసాపేట 9.6 సెం.మీ, మాదాపూర్ 8.7 సెం.మీ, సరూర్ నగర్ 8 సెం.మీ, యూసుఫ్గూడ 7.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చదవండి: తప్పిన ప్రమాదం.. రెయిలింగ్ను ఢీకొట్టిన బస్సు -
అవే బారులు.. అవే బాధలు
అనంతపురం నగరంలో పీటీసీ నుంచి కళ్యాణదుర్గం వెళ్లే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నిత్యం ట్రాఫిక్జామ్ అవుతోంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పాపు కిలోమీటర్పైగా వాహనాలు బారులు తీరుతుండడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. కిలోమీటర్ ఉన్న బ్రిడ్జిని దాటడానికి వాహనదారులకు గంటకు పైగా సమయం పడుతోంది. ట్రాఫిక్ సమస్యతో ఉదయం పూట విద్యార్థులు సరైన సమయానికి పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు బ్రిడ్జి మధ్యలో డివైడర్ను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షిస్తే సమస్య కొద్దిగైనా పరిష్కారం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -సాక్షి, ఫొటోగ్రాఫర్, అనంతపురం