breaking news
temperament
-
'సచిన్ కంటే కోహ్లీయే బెటర్'
కొన్ని కొన్ని కీలక సమయాల్లో సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ చాలా బెటరని పాకిస్థాన్ మాజీ స్టార్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించాడు. క్రికెట్కు ఎప్పుడూ చెవులున్నాయని అంటూ... 1980లలో వివ్ రిచర్డ్స్, బ్రయాన్ లారా, సచిన్ టెండూల్కర్.. వీళ్లంతా ఆడేవారని, కానీ వీళ్లందరి కంటే కూడా తాను చూసినవాళ్లలో కోహ్లీ సంపూర్ణ ఆటగాడని ఇమ్రాన్ చెప్పాడు. అతడు రెండు కాళ్లతోనూ, మైదానంలో అన్నివైపులా ఆడతాడని ప్రశంసలు కురిపించాడు. అతడి టాలెంట్, టెక్నిక్ లాంటి అంశాలను పక్కన పెడితే.. కోహ్లీకి చాలా మంచి టెంపర్మెంట్ ఉందని, సచిన్ కంటే అతడి టెంపర్మెంట్ బాగుంటుందని అన్నాడు. ఇటీవల భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్కి ఇమ్రాన్ ఖాన్ కూడా హాజరయ్యాడు. అయితే.. ఈ మ్యాచ్లో కోహ్లీ 37 బంతుల్లో 55 పరుగులతో వీరవిహారం చేయడంతో పాక్ ఓడిపోయింది. పాక్ ఓటమి చూస్తుంటే చాలా బాధ అనిపించిందని, అయితే కోహ్లీ మాత్రం చాలా బాగా ఆడాడని ఇమ్రాన్ అన్నాడు. తాను ఒక బౌలర్గా బ్యాట్స్మన్ను చూస్తానని, వాళ్లను ఎలా ఔట్ చేయాలా అనే ఆలోచిస్తానని చెప్పాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో కోహ్లీ ఎలా ఆడతాడో చూస్తే.. ఇతరుల కంటే చాలా బాగా ఆడతాడని అన్నాడు. అంతర్జాతీయంగా అతడే అత్యుత్తమమైన ఆటగాడని ప్రశంసించాడు. భారత్లో పర్యటించిన సమయంలో ప్రధాని నరేంద్రమోదీని కలిసి, భారత్ - పాక్ల మధ్య క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించాలని కోరాడు. -
జర్మనీ, భారత్ ‘సౌర’బంధం
-
జర్మనీ, భారత్ ‘సౌర’బంధం
భారత్లో ప్రాజెక్టులకు రూ.7,300 కోట్లు ♦ సాగు, రైల్వేల్లో సహకారం ♦ జర్మనీతో 18 ఒప్పందాలు ♦ మోదీ-మెర్కెల్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ♦ మహిషాసుర మర్దిని విగ్రహం భారత్కు అప్పగింత న్యూఢిల్లీ: భారత్తో వ్యాపార బంధం బలోపేతం చేసుకునే దిశగా జర్మనీ కీలకమైన ముందడుగు వేసింది. ప్రధానంగా సౌర ఇంధన రంగంలో పెద్ద ఎత్తున భారత్కు సహకరించటానికి జర్మనీ ముందుకొచ్చింది. రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సుదీర్ఘంగా మూడు గంటల పాటు జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో 18 ఒప్పందాలు కుదుర్చుకోవటంతో పాటు.. వ్యూహాత్మక రంగాల్లో పరస్పర సహకారంపై అవగాహనకు వచ్చారు. 28 మంది ప్రతినిధులతో భారత్కు వచ్చిన మెర్కెల్ బృందం మోదీ నేతృత్వంలోని భారత బృందంతో పలు అంశాలపై చర్చలు జరిపింది. రక్షణ, భద్రత, నిఘా, రైల్వేలు, పెట్టుబడులు, స్వచ్ఛ ఇంధనం వంటి వివిధ కీలకమైన రంగాలపై ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ‘‘భారత ఆర్థిక పునర్వికాసంలో జర్మనీ సహజ భాగస్వామిగా ఉంటుంది. మా దృష్టి ప్రధానంగా ఆర్థిక సంబంధాలపై ఉన్నా.. ఇరు దేశాలూ సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని నిర్ణయించాం’’ అని చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ అన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టే జర్మనీ కంపెనీలకు వేగంగా అనుమతులివ్వటంతో పాటు, సౌర ఇంధన నిధికి వచ్చే ఐదేళ్లలో రూ. 7,300 కోట్ల ఆర్థిక సహాయాన్ని జర్మనీ ప్రకటించింది. అయితే నేర వ్యవహారాల్లో పరస్పర సహకారానికి భారత నేర శిక్షాస్మృతిలోని ఉరిశిక్ష ప్రధాన అడ్డంకిగా మారింది. ఇరు దేశాల మధ్య నేర వ్యవహారాల్లో పరస్పర న్యాయ సహాయ ఒప్పందంపై 2007 నుంచి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం జరిగిన చర్చల్లోనూ భారత్లో ఉరిశిక్ష అమల్లో ఉండటం వల్ల ఒప్పందం కుదరలేదు. పర్యటనలోని మరికొన్ని ముఖ్యాంశాలు స ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని మోదీ మెర్కెల్కు సంప్రదాయ స్వాగతం పలికారు. భారత సైనిక వందనాన్ని మెర్కెల్ స్వీకరించారు. స మహాత్మాగాంధీ సమాధి వద్ద మెర్కెల్ నివాళులు అర్పించారు. స ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో 18 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. స వంకాయ, పొట్లకాయ, కాకరకాయ, ఆల్ఫాన్సో మామిడిపై యురోపియన్ యూనియన్ నిషేధం ఎత్తివేతకు సాయం చేయాలని జర్మనీని భారత్ కోరింది. స వ్యవసాయంలో అభివృద్ధికి భారత వ్యవసాయ నైపుణ్య మండలితో జర్మనీ వ్యవసాయ వ్యాపార కూటమి సహకారం. స భారత్లో సౌర ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి రూ. 7,300 కోట్ల జర్మనీ ఆర్థిక సాయం స వాతావరణ మార్పునకు సంబంధించి పారిస్ ఒప్పందంలోని ముఖ్యభాగాన్ని అమలు చేసేందుకు జర్మనీ నిర్ణయం. 2020 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో హరిత పరిజ్ఞానం, పరిశుభ్రమైన వాతావరణం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు రూ. 6 వేల కోట్ల ఆర్థిక సాయం. స భారత్లో జర్మన్ భాషకు, జర్మనీలో.., సంస్కృతంతో సహా భారత ఆధునిక భాషలకు విదేశీ భాషలుగా ప్రాచుర్యం కల్పించాలని ఒప్పందం. స ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని కలసి కట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయం. స {పపంచంలో అణ్వస్త్ర నిరోధక చర్యలను పటిష్టం చేసే ప్రయత్నాలను బలోపేతం చేయాలని నిర్ణయం. స కశ్మీర్లో దొంగతనం జరిగిన 10వ శతాబ్దం నాటి మహిషాసుర మర్దిని విగ్రహం భారత్కు అప్పగింత. స దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు పెరగటంపై ఆందోళన. స జర్మన్ కంపెనీల కోసం ఫాస్ట్ట్రాక్ సిస్టమ్ 2016 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం. స పెట్టుబడుల ఆకర్షణకు మార్కెట్ ద్వారాలు తెరిచిపెట్టాలని నిర్ణయం. స స్మార్ట్ సిటీలు, గంగ శుద్ధి కార్యక్రమాలకు జర్మనీ సాయం. స ఆహార భద్రత, పౌరవిమానయానం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, రైల్వేలు వంటి రంగాల్లో పరస్పర సహకారం.