telugu entrepreneurs association
-
టీఈఏ మరో ముందడుగు
డల్లాస్: విద్యార్థి దశ నుంచే వ్యాపార రంగం వైపు ప్రోత్సహించే దిశగా తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (టీఈఏ) మరో ముందడుగు వేస్తోంది. వ్యాపార రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఓ చక్కటి వేదికను అందిస్తోంది. 70 హైస్కూల్స్కు సంబంధించిన (9వ-12వ గ్రేడ్స్) విద్యార్థులు ఆరువారాలపాటూ జరిగే టీఈఏ పోటీల్లో పాల్గొననున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, డల్లాస్ క్యాంపస్లో నవంబర్ 13న ఆదివారం మధ్యాహ్నం 1- 4గంటల వరకు తొలిసారి ఈ కార్యక్రమం జరుగనుంది. విద్యార్థులు వినూత్న బిజినెస్ ఐడియాలతో టీఈఏ పోటీల్లో పాల్గొనడమే కాకుండా టీఈఏ ప్యానెల్ జడ్జిలు, పెట్టుబడిదారులు వారికి సూచనలు కూడా ఇవ్వనున్నారు. ఒక్కో గ్రూప్లో నలుగురు విద్యార్థులు సభ్యులుగా ఉంటారు. ప్రతి గ్రూప్ ఒక్కో బిజినెస్ ఐడియాతో ఒక టీంగా పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఉత్తమమైన బిజినెస్ ఐడియాలకు అవార్డులతో పాటూ పోటీల్లో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లను టీఈఏ అందించనుంది. తండెం టెక్నాలజీస్ ఛైర్మన్ అబిద్ అబేడీ, జెంగిస్ గ్రిల్ చలక్ మిత్రా లైఫ్ సీఈఓ అల్ భక్త, ఎన్కోర్ ఎంటప్రైస్ చైర్మన్ భరత్ సంఘానీలు గెలుపొందిన తొలి మూడు అవార్డులకు స్పాన్సర్ చేస్తున్నారు. -
డాలస్లో టీఈఏ సదస్సు సక్సెస్
డాలస్: ఒత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించే దిశగా తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (టీఈఏ) డాలస్ చాప్టర్ నిర్వహించిన సదస్సు విజయవంతమైంది. 'పిచ్ యువర్ బిజినెస్ ఐడియా' పేరుతో టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్ నగరంలోని ఇన్స్ట్రుమెంట్ ఆడిటోరియంలో ఆగస్టులో నిర్వహించిన సదస్సుకు ఓత్సాహిక వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డాలస్ చాప్టర్ లో వ్యాపార విస్తరణ, అకురార్పణల కోసం తాము రూపొందించిన నూతన విధానాలను పలువురు తెలుగు ఔత్సాహిక వ్యాపారవేత్తలు సభికులకు వివరించారు. దాదాపు 250 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీఈఏ డాలస్ చాప్టర్ ప్రతినిధులు గుర్రం శ్రీనివాసరెడ్డి, సంధ్య పడాల, జాగ్స్ పోరండ్ల, పల్లవి తోటకూర, రత్నా పట్నాల, కల్యాణి తడిమెట్ల, రత్న కుమార్ వెనిగండ్ల, భువన, రవి తాండ్ర, వెంకట్ కోడూరి, రఘు గజ్జల, వెన్నెల గజ్జల, సురేశ్ ఉలవల, ప్రేమ్ గంగులకుంట, అనూప్ దేవిరెడ్డి, సంజీత రెడ్డి, సుమ గూడూరు, సునిత పూదోట, శ్రీలతా రెడ్డి, అనితా రెడ్డి పుప్పాల దయాకర్, ప్రియాక రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
జూన్ 26న టెక్సాస్లో టీఈఏ సమావేశం
టెక్సాస్: తెలుగు వారు వ్యాపార రంగంలో అభివృద్ధిచెందడానికి కావల్సిన విలువైన సమాచారం, మెలకువలు అందిచడానికి తెలుగు ఎంటర్ ప్రెన్యూర్స్ అసోసియేషన్(టీఈఏ) ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జూన్ 26న మధ్యాహ్నం 2 గంటన నుంచి 5 వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. టెక్సాస్లోని ఇర్వింగ్లో పశ్చిమ వాల్నట్ హిల్ లేన్లోని దేసీ ప్లాజా స్టుడియోలో మీట్ ఓల్డ్ ప్రెండ్స్ అండ్ మేక్ న్యూ ఫ్రేండ్స్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో లలిత్ తోట( మయూరి ఇండియన్ రెస్టారెంట్ ఓనర్, ఇర్వింగ్, టెక్సాస్), సిమన్ బోజాస్(గెంగిస్ గ్రిల్లో పార్ట్నర్), లిండా ఎల్ విలియమ్స్(ఎస్బీఏ, ఆర్థిక శాస్త్ర నిపుణులు), కెన్ సురి ( వన్ వరల్డ్ బ్యాంక్ వ్యవస్థాపకులు, ఛైర్మన్)లు పాల్గొని విలువైన సూచనలు ఇవ్వనున్నారు. రెస్టారెంట్లను ప్రారంభించి, విజయవంతంగా ఎలా నడాపాలి, ప్రాంచైజీ రంగంలో మెలకువలు, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం వంటి అంశాల మీద చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంట్రీ ఉచితం.