ఒత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించే దిశగా తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (టీఈఏ) డాలస్ చాప్టర్ నిర్వహించిన సదస్సు విజయవంతమైంది.
డాలస్: ఒత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించే దిశగా తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (టీఈఏ) డాలస్ చాప్టర్ నిర్వహించిన సదస్సు విజయవంతమైంది. 'పిచ్ యువర్ బిజినెస్ ఐడియా' పేరుతో టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్ నగరంలోని ఇన్స్ట్రుమెంట్ ఆడిటోరియంలో ఆగస్టులో నిర్వహించిన సదస్సుకు ఓత్సాహిక వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
డాలస్ చాప్టర్ లో వ్యాపార విస్తరణ, అకురార్పణల కోసం తాము రూపొందించిన నూతన విధానాలను పలువురు తెలుగు ఔత్సాహిక వ్యాపారవేత్తలు సభికులకు వివరించారు. దాదాపు 250 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీఈఏ డాలస్ చాప్టర్ ప్రతినిధులు గుర్రం శ్రీనివాసరెడ్డి, సంధ్య పడాల, జాగ్స్ పోరండ్ల, పల్లవి తోటకూర, రత్నా పట్నాల, కల్యాణి తడిమెట్ల, రత్న కుమార్ వెనిగండ్ల, భువన, రవి తాండ్ర, వెంకట్ కోడూరి, రఘు గజ్జల, వెన్నెల గజ్జల, సురేశ్ ఉలవల, ప్రేమ్ గంగులకుంట, అనూప్ దేవిరెడ్డి, సంజీత రెడ్డి, సుమ గూడూరు, సునిత పూదోట, శ్రీలతా రెడ్డి, అనితా రెడ్డి పుప్పాల దయాకర్, ప్రియాక రెడ్డి తదితరులు హాజరయ్యారు.