
టీఈఏ మరో ముందడుగు
విద్యార్థి దశ నుంచే వ్యాపార రంగం వైపు ప్రోత్సహించే దిశగా తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (టీఈఏ) మరో ముందడుగు వేస్తోంది.
డల్లాస్: విద్యార్థి దశ నుంచే వ్యాపార రంగం వైపు ప్రోత్సహించే దిశగా తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (టీఈఏ) మరో ముందడుగు వేస్తోంది. వ్యాపార రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఓ చక్కటి వేదికను అందిస్తోంది. 70 హైస్కూల్స్కు సంబంధించిన (9వ-12వ గ్రేడ్స్) విద్యార్థులు ఆరువారాలపాటూ జరిగే టీఈఏ పోటీల్లో పాల్గొననున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, డల్లాస్ క్యాంపస్లో నవంబర్ 13న ఆదివారం మధ్యాహ్నం 1- 4గంటల వరకు తొలిసారి ఈ కార్యక్రమం జరుగనుంది. విద్యార్థులు వినూత్న బిజినెస్ ఐడియాలతో టీఈఏ పోటీల్లో పాల్గొనడమే కాకుండా టీఈఏ ప్యానెల్ జడ్జిలు, పెట్టుబడిదారులు వారికి సూచనలు కూడా ఇవ్వనున్నారు.
ఒక్కో గ్రూప్లో నలుగురు విద్యార్థులు సభ్యులుగా ఉంటారు. ప్రతి గ్రూప్ ఒక్కో బిజినెస్ ఐడియాతో ఒక టీంగా పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఉత్తమమైన బిజినెస్ ఐడియాలకు అవార్డులతో పాటూ పోటీల్లో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లను టీఈఏ అందించనుంది. తండెం టెక్నాలజీస్ ఛైర్మన్ అబిద్ అబేడీ, జెంగిస్ గ్రిల్ చలక్ మిత్రా లైఫ్ సీఈఓ అల్ భక్త, ఎన్కోర్ ఎంటప్రైస్ చైర్మన్ భరత్ సంఘానీలు గెలుపొందిన తొలి మూడు అవార్డులకు స్పాన్సర్ చేస్తున్నారు.