breaking news
Tbsp
-
గడీల పాలనను గద్దె దింపుతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గడీల పాలనను గద్దె దింపేవరకు రాత్రింబవళ్లు పనిచేస్తానని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. దొరల పాలన అంతా దోపిడీమయంగా సాగుతోం దని.. దళితులు, గిరిజనులు, బహుజనులు నష్టపోతున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. 13 వందల మంది త్యాగా లతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కొందరి చేతుల్లో బందీ అయిందని, అన్నివర్గాలకు న్యాయం దక్కాలంటే దొరల పాలనకు మంగళం పాడాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ప్రవీణ్కుమార్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అభినందన సభ జరిగింది. దీనికి ముందు బీఎస్పీ రాష్ట్ర ఇన్చార్జ్ రాంజీ గౌతమ్తో కలిసి ప్రవీణ్కుమార్ మీడియాతో మాట్లాడారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేశారని, ఉద్యో గులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని మండి పడ్డారు. సంపత అంతా కొందరి వద్దే ఉండిపోయిందని, అన్ని వర్గాల ప్రజలు ఆప దలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన న్యాయం జరగాలంటే బీఎస్పీకి రాజ్యా ధికారం అప్పగించాలని పిలుపు నిచ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు, రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కారు అగ్రకులా లకే ప్రాధా న్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. తాను చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశా రు. రాబోయే ఎన్నికల్లో గెలిచి ఏనుగు మీద ప్రగతిభవన్కు వెళ్తామన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడాలని, గ్రామాలకు తరలివెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అందరి పార్టీ బీఎస్పీ.. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల్లో కేవలం అగ్రవర్ణాలకే పదవులు దక్కుతాయని, వారికి మాత్రమే ప్రాధాన్యత దక్కు తుందని ప్రవీణ్కుమార్ విమర్శించారు. బీఎస్పీ దళిత, గిరిజన, బహుజనులతోపాటు అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత దక్కుతుందని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 52శాతం ఉన్న బీసీలకు తమ పార్టీ 70 సీట్లు కేటాయిస్తుం దని ప్రకటించారు. అనంతరం బీఎస్పీ రాష్ట్ర ఇన్చార్జి, ఎంపీ రాంజీ గౌతమ్ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బీఎస్పీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని, వాటిని అదుపులో పెట్టేందుకు సమర్థుడైన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పేదల విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తా మని.. ప్రతి పౌరుడికి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిం చేందుకు బీఎస్పీ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. -
సమ్మర్@ 5
బ్యూటిప్స్ ప్యాక్ కప్పు పెరుగులో టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ నిమ్మరసం క లపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే ట్యాన్ (ఎండ వల్ల ఏర్పడిన నలుపు) తగ్గడమే కాకుండా చర్మకాంతి పెరుగుతుంది. బాత్ అరకప్పు గులాబీ రేకులను పేస్ట్ చేసి అందులో టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ పేస్ట్ను గోరువెచ్చని నీటిలో కలిపి, స్నానం చేయాలి. గులాబీల సుగంధం ఎండ వల్ల కలిగే ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందేలా చేస్తుంది. కొబ్బరిపాలు చర్మానికి మంచి మాయిశ్చరైజర్ని అందిస్తాయి. హెయిర్ గోరువెచ్చని గ్రీన్ టీని మాడుకు, శిరోజాలకు పట్టించి ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో తలంతా శుభ్రపరుచుకోవాలి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, కండిషనర్ ఎండ వల్ల కలిగే హానిని నివారించి, జుట్టు ఊడటాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలోని పోషకాలు శిరోజాలను పెంచడానికి దోహదం చేస్తాయి. మసాజ్ చెరకురసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసి, వేళ్లతో మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో ఒకసారి, వెచ్చని నీటితో ఒకసారి ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా రోజూ చేస్తే ఎండ కారణంగా పొడిబారిన చర్మం తేమని పుంజుకుని ఆరోగ్యంగా తయారవుతుంది. యాక్నె వెనిగర్లో ఉప్పు కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని యాక్నె(చిన్న చిన్న మొటిమల గడ్డలు) మీద రాసి, మృదువుగా రబ్ చేయాలి. ఇరవై నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తే జిడ్డు తొలగడంతోపాటు మొటిమలు, యాక్నె, మచ్చలు తగ్గుతాయి.