-
‘అమ్మ’ శుభాలు కలుగచేస్తుంది
పోరుమామిళ్ల: గతంలో ఒకసారి ఇక్కడకు వచ్చాను, మళ్లీ ఇప్పుడు పోరుమామిళ్లకు రావడం చాలా ఆనందంగా ఉందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. పట్టణంలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించినా శ్రీ వాసవీకన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ పూజలు గత 5 రోజులుగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రోశయ్య శుక్రవారం పోరుమామిళ్ల వచ్చారు. నిర్ణీత సమయం కన్నా గంట ఆలస్యంగా 12–45గం’’ హెలికాఫ్టర్లో కళాశాల మైదానంలో దిగారు. హెలిప్యాడ్ వద్ద రోశయ్యకు మాజీ శాసనసభ్యులు డాక్టర్ శివరామకృష్ణారావు, ఏపీపీఎస్సి మాజీసభ్యులు, నూతన ఆలయ నిర్మాణప్రధానకర్త గుబ్బా చంద్రశేఖర్, యోగివేమన వర్శిటీ పాలకమండలి సభ్యురాలు విజయజ్యోతి, జిల్లాఎస్పీ పిహెచ్డి రామకృష్ణ, ఆర్డీఓ ప్రభాకర్పిళ్ళై తదితరులు స్వాగతం పలికారు. ఆయన నేరుగా పోలీస్స్టేషన్ అతిధిగృహానికి వెళ్లి, అక్కడ నుండి నేరుగా నూతన ఆలయానికి వచ్చారు. ఇక్కడ నిర్మించిన ఊంజలసేవ అద్దాలమందిరం, వన్యకాపరమేశ్వరి, రామాలయం, శివాలయాలతో పాటు నవగ్రహవేదికలను రోశయ్య సందర్శించారు. గుబ్బా చంద్రశేఖర్ ఆయన వెంట వుండి అన్ని వివరాలు చెప్పారు. ఆలయ నిర్మాణానికి రూ. 5 లక్షలు అంతకు పైబడి విరాళాలు ఇచ్చిన దాతలకు రోశయ్య జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆర్యవైశ్యకమిటీ పెద్దశ్రేష్ఠి, ధర్మకర్త, శాశ్వత గౌరవ అధ్యక్షులు రోశయ్యను సన్మానించారు. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన గుబ్బా చంద్రశేఖర్ను సన్మానించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ పోరుమామిళ్లలో వాసవీమాతకు ఇంతచక్కని ఆలయం నిర్మించడం సంతోçషంగా వుందన్నారు. ప్రొద్దుటూరులో వాసవిమాత ఆలయం ప్రసిద్ది చెందిందన్నారు. ఇప్పుడు పోరుమామిళ్ల ఆలయం ప్రొద్దుటూరుకు పోటీగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ శివరామకృష్ణారావు, ఆర్యవైశ్యసంఘం జిల్లా, మండల నాయకులు, ఆర్యవైశ్యమహిళలు, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రొద్దుటూరులో రోశయ్య
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement