-
దిగివచ్చిన మద్యం సిండికేట్..
మోర్తాడ్(బాల్కొండ): అక్టోబర్ నెల కోసం ప్రత్యేక ధరను అమలు చేసిన మద్యం సిండికేట్ దిగివచ్చింది. ఒక్కో సీసాపై రూ.10 ధర పెంచగా ఆ ధరను ఎత్తివేసి పాత పద్దతిలోనే ఎంఆర్పీ ధరకు మద్యంను విక్రయిస్తున్నారు. గడచిన సెప్టెంబర్ 30తోనే మద్యం దుకాణాల లైసెన్స్కు గడువు ముగిసిపోయింది. అయితే కొత్త మద్యం పాలసీ అమలు కావడానికి కొంత సమయం పట్టడంతో అక్టోబర్ నెల కోసం లైసెన్స్లను రెన్యూవల్ చేశారు. లైసెన్స్ ఫీజు ఎక్కువ చెల్లించడం, తమకు లాభం తగ్గిపోవడంతో రూ.10 ధర అదనంగా విక్రయించడానికి మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఎక్కువ ధరలకు మద్యం విక్రయించడంపై ఫిర్యాదులు అందినా స్థానిక ఎక్సైజ్ అధికారులు పట్టించుకోక పోవడంతో కొందరు హైదరాబాద్లోని టాస్క్ఫోర్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించి ఆ అధికారులు మద్యం అమ్మకాలపై నిఘా ఉంచి రెండు దుకాణాల నిర్వాహకులకు రూ.2లక్షల వరకు జరిమానా విధించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఉన్నతాధికారులు హెచ్చరించడంతో మద్యం సిండికేట్ దిగివచ్చింది. మొదట్లో ప్రత్యేక ధరను అమలు చేసినా కేసులకు జడిసి పాత పద్దతిలోనే మద్యం విక్రయాలకు ఓకే చెప్పారు. మద్యం సిండికేట్ దిగివచ్చి ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయిస్తుండటంతో మందు బాబుల జేబులకు చిల్లు పడటం ఆగిపోయింది. -
బేరం కుదిరింది!
► మద్యం మాఫియా, ► ఎక్సైజ్ అధికారుల మధ్య ఒప్పందం ► సయోధ్య కుదిర్చిన అధికార పార్టీ నేత ► పెరిగిన మద్యం ధరలు ► సాక్షి-సాక్షి టీవీ జాయింట్ ఆపరేషన్లో వెల్లడి సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మద్యం సిండికేట్ హవా మళ్లీ మొదలైంది. ఉన్నతాధికారుల మధ్య విభేదాలు సద్దుమణగడంతో బాటిల్ ధర పెరిగింది. బాటిల్పై రూ.5 పెంచుకునేందుకు గ్రీన్సిగ్నల్ లభించింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అటు మద్యం సిండికేట్కు, ఇటు అధికారులకు మధ్య అంగీకారం నేపథ్యంలోనూ బాటిల్ ధర పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్యం షాపుల యజమానులు అందరూ కలిసి ధర పెంచినట్టు స్వయంగా షాపులో పనిచేసే సిబ్బందే చెబుతున్నారు. సాక్షి- సాక్షి టీవీ నిఘాలో ఈ అంశం స్పష్టంగా వెల్లడయ్యింది. మొన్నటివరకు ధర పెంచుకునేందుకు అధికారుల మధ్య నెలకొన్న విభేదాలు అడ్డొచ్చాయి. అధికార పార్టీ నేతలు సర్దిచెప్పడంతో బేరం కుదిరి... బాటిల్ ధర పెరిగింది. జిల్లావ్యాప్తంగానూ ఇదే తీరు జిల్లావ్యాప్తంగా మద్యం సిండికేట్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్లలో ఏకంగా బాటిల్పై రూ. 10 పెంచి మరీ విక్రయిస్తున్నారు. అక్కడి అధికార పార్టీ నేతల అండదండలతో దీనికి అడ్డులేకుండా పోయింది. తాజాగా కర్నూలులో బాటిల్పై రూ. 5 పెంచుకునేందుకు మొదట్లో జరిగిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇద్దరు అధికారుల మధ్య నెలకొన్న విభేదాలతో రచ్చ అయ్యింది. ఏకంగా ఒక షాపును మరో అధికారి పట్టించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యనేత సోదరుడు రంగప్రవేశం చేసి..సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా బాటిల్పై రూ.5 పెరిగింది. ఎంఆర్పీ ఉల్లంఘన షురూ అయ్యింది. మరోవైపు సీజ్ అయిన షాపునకు వేసిన పెనాల్టీని..మద్యం సిండికేట్లు అందరూ కలిసి కట్టినట్టు సమాచారం. ఫలితంగా ప్రధాన కార్యాలయం నుంచి వచ్చి షాపును సీజ్ చేసినప్పటికీ కేవలం పెనాల్టీతో సరిపుచ్చుకుని.. షాపు యథావిధిగాా ప్రారంభమయ్యింది. విచిత్రమేమిటంటే.. ఈ షాపులో కూడా యథావిధిగా ఎంఆర్పీ ఉల్లంఘన జరగడం. సాక్షి నిఘాతో బట్టబయలు మద్యం సిండికేట్ల వ్యవహారాన్ని బయటపెట్టేందుకు సాక్షి-సాక్షి టీవీ నిఘా పెట్టింది. జిల్లాలో పలు షాపులను బుధవారం రాత్రి సాక్షి బృందం స్వయంగా వెళ్లి బాటిల్ ధర ఎంత అంటూ వాకబు చేసింది. ఈ సందర్భంగా యజమానులందరూ కలిసి ధర పెంచారని షాపులో పనిచేస్తున్న సిబ్బంది కుండబద్దలు కొట్టారు. ఒక షాపులో పనిచేసే సిబ్బంది ఏకంగా ధరలు పెంచకపోతే ఓనర్ కథ ముగుస్తుందంటూ మాట్లాడటం గమనార్హం. ‘సాక్షి’ టీంకు, మద్యం షాపు సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణ ఇదీ.. షాపు నెంబరు 1: సాక్షి: రాయల్ స్టాగ్ క్వార్టర్ ఎంత అన్న? షాపు బాయ్: రూ. 155 అన్న. సాక్షి: ఎంఆర్పీ ఎంత అన్న బాయ్: రూ. 150. సాక్షి: ఎందుకు రూ. 5 ఎక్కువన్న. ఎవరు డిసైడ్ చేశారు. బాయ్: ఎక్సైజ్ వాళ్లు, సిండికేట్ వాళ్లు....వైన్షాపు ఓనర్స్ అందరూ మాట్లాడుకుని బాటిల్పై రూ.5 పెంచినారు. షాపు నెంబరు 2: సాక్షి: రాయల్ స్టాగ్ హాఫ్ ఎంత? బాయ్: రూ. 310 అన్న. ఎంఆర్పీ కన్న ఎక్కువ. సాక్షి: ధర ఎవరు పెంచారు. బాయ్: ప్రభుత్వమే ఎక్కువ చేసింది. మాదేమీ ఇది సొంత షాపు కాదు. మేం పనిచేసే వాళ్లమే. ఏదైనా రూ. 5 ఎక్కువే. -
మద్యం ధరలకు రెక్కలు
కర్నూలు: బెల్టు దుకాణాల నిర్మూలన వ్యాపారుల రాబడిపై ప్రభావం చూపనుండటంతో వారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. కొత్త మద్యం విధానం ప్రారంభమై వారం రోజులు కూడా గడవకముందే గరిష్ట చిల్లర ధరకు మంగళం పాడారు. ఫలితంగా మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. లాభాల కోసం వ్యాపారులు ఎక్కడికక్కడ సిండికేట్గా ఏర్పడి అంతర్గత ఒప్ప ందం ప్రకారం పది శాతానికి అధికంగా సరు కు విక్రయించేలా తీర్మానించుకున్నట్లు సమాచారం. జిల్లాలో 194 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో 180 దుకాణాలకు లెసైన్సులున్నాయి. 36 బార్లు నడుస్తున్నాయి. అందులో సగానికి పైగా రాజకీయ నాయకులు, వారి అనుచరుల ఆధ్వర్యంలో నడుస్తున్నవే. పార్టీలు వేరైనా మద్యం వ్యాపారంలో మాత్రం అన్ని పార్టీల నేతలు పరోక్షంగా పాత్రధారులుగా ఉన్నారు. లక్కీడ్రాలో దుకాణాలు దక్కించుకున్నవారికి, ఎక్సైజ్ అధికారులకు మధ్య తాత్కాలిక ఒప్పందంలో భాగంగా ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. పెట్టిన పెట్టుబడులపై లాభాలను రాబట్టేందుకు ప్రతి క్వాటర్ సీసాపై గరిష్ట చిల్లర ధరకు అదనంగా రూ.10 పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా మద్యం సామ్రాజ్యాన్ని గుప్పిట్లో పెట్టుకున్న కర్నూలు సిండికేట్ మద్యం వ్యాపారులకు అండగా నిలిచింది. అధికార పార్టీ బలంతో మద్యం వ్యాపారులనంతా ఏకతాటిపైకి తీసుకొచ్చి ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇందుకోసం స్టేషనరీ ఖర్చు పేరుతో వచ్చిన ఆదాయంలో పది శాతం ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు రూపంలో ముట్టజెప్పే విధంగా ఒప్పందం కుదిరినట్లు వినికిడి. ఎంఆర్పీకే మద్యం విక్రయాలు జరపాలని నిబంధన ఉన్నా మందు బాబుల నుంచి అదనంగా గుంజడానికి వ్యాపారులు ఎక్కడికక్కడ సిండికేట్గా ఏర్పడ్డారు. కర్నూలు నగరంతో పాటు గూడూరు, కోడుమూరు, సి.బెళగల్, డోన్ ప్రాంతాల్లో గరిష్ట చిల్లర ధరపై(ఎంఆర్పీ) క్వాటర్ బాటిల్ రూ.10 అదనంగా విక్రయాలు జరుపుతున్నారు. ఫుల్బాటిల్ రూ.40 నుంచి రూ.60 వరకు ఎక్కువ ధరతో విక్రయాలు జరుపుతున్నారు. సామాన్యులు సేవించే చీఫ్ లిక్కర్, బ్యాగ్పైపర్, రాయల్ తదితర మద్యం క్వాటర్ బాటిల్ ధర రూ.75 ఉండగా రూ.85కు విక్రయిస్తున్నారు. అలాగే ఎంసీ విస్కీ, ఇంపీరియల్ బ్లూ, మాన్షన్ హౌస్ గరిష్ట చిల్లర ధర రూ.110 ఉండగా రూ.120 నుం చి రూ.130 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. బ్రాండెడ్కు బదులుగా కమిషన్ ఎక్కువగా ఇచ్చే కంపెనీలకు సంబంధిం చిన మద్యాన్ని మాత్రమే అందుబాటు లో ఉంచి లాభాలు పొందుతున్నారు. జిల్లాలో అన్ని దుకాణాల ద్వారా సగటున రోజుకు రూ.2 కోట్లపైనే వి క్రయాలు జరుగుతున్నాయి. కొత్త మద్యం విధా నం ఈ నెల 1న అమల్లోకి వచ్చింది. ఐదు రోజుల వ్యవధిలో రూ.18.87 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్లోని ప్రశ్నలకు ఇట్టే సమాధానం
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరు భారతీయుల పాస్ పోర్టులు సీజ్
హైదరాబాద్: వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
ఆమెతో బ్రేకప్కు కారణం అదే.. హీరామండి నటుడు!
TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్టికెట్లు విడుదల..
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement