ప్రణబ్ ముఖర్జీ సతీమణి కన్నుమూత
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి శుభ్రా ముఖర్జీ (74) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మంగళవారం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. శుభ్రా ముఖర్జీ గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు ఉదయం 10.51 నిమిషాలకు ఆమె మృతి చెందారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ కార్యాలయ వర్గాలు అధికారికంగా ద్రువీకరించారు.