breaking news
subrahmanyam jayashanker
-
మోదీ నివాసానికి సుష్మా స్వరాజ్
-
మోదీ నివాసానికి సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. బుధవారం రాత్రి విదేశాంగ కార్యదర్శి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో కలిసి మోదీ నివాసానికి వెళ్లారు. పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి పాకిస్థాన్ తో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై వారు ప్రధానితో సమాలోచనలు జరపనున్నట్లు అధికార వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. దీంతోపాటు పాకిస్థాన్ తో విదేశాంగ కార్యదర్శుల సమావేశానికి పచ్చ జెండా ఉపాలా వద్దా అనే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన జైషే ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ ను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మోదీ, సుష్మా ల మధ్య జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.