breaking news
Strike effect
-
బ్యాంకు సేవలకు అంతరాయం
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ల విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇవ్వడంతో బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. వారం రోజుల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టడం ఇది రెండవ సారి కావడం గమనార్హం. ఈనెల 21 బ్యాంకు ఆఫీసర్ల యూనియన్ వేతన పరిష్కారం కోరుతూ విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే సమ్మెకు సంబంధించి కస్టమర్లకు సమాచారం చేరవేశాయి. ఇక ప్రైవేట్ బ్యాంకులు యథాతథంగా పనిచేయనున్నాయి. కాగా బ్యాంకు ఆఫీసర్లు, ఉద్యోగుల సంఘాలతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెకు పిలుపు ఇచ్చింది. అదనపు చీఫ్ లేబర్ కమిషనర్తో జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో తాజా సమ్మెకు పిలుపు ఇచ్చామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం వెల్లడించారు. ఈ భేటీలో విలీన ప్రక్రియపై ముందుకు వెళ్లమని ప్రభుత్వం లేదా సంబంధిత బ్యాంకులు ఎలాంటి వివరణ ఇవ్వలేదని చెప్పారు. -
నిలిచిన ఇంధన సరఫరా
రామగుండం : కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా కుందనపల్లి సమీపంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ డిపోలలో శుక్రవారం ఉదయం నుంచి ఇంధన సరఫరా నిలిపివేశారు. సమ్మె నేపథ్యంలో ఇంధన సరఫరాలో కొరత రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో సమ్మె రోజు బంక్లలో బంద్ ప్రభావం కనిపించలేదు. సింగరేణిలో బంద్ సంపూర్ణంగా జరగడంతో ఇంధన వినియోగం కూడా తగ్గిందని ఆయిల్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. పట్టణంలోని బ్యాంకులు, పోస్టాఫీసులు మూసేయడంతో ఖాతాదారులు ఇబ్బందులకు గురయ్యారు. -
సరుకుల్లేవ్
ఏలూరు/నల్లజర్ల రూరల్, న్యూస్లైన్:రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటుకు చేరుతున్న నేపథ్యంలో ఏపీ ఎన్జీవోల పిలుపు మేరకు ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభా వం చూపుతోంది. రేషన్ డిపోలకు సరుకు ల్ని విడుదల చేసే ప్రక్రియలో కీలకపాత్ర పోషించే రెవెన్యూ అధికారులు సమ్మెలో ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. స్టాక్ రిలీజ్ ఆర్డర్స్ (సరుకుల విడుదల పత్రాలు) ప్రజా పంపిణీ గోదాములకు రావటం లేదు. రేషన్ సరుకులకు సంబంధించి డీల ర్లు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో సొమ్ము చె ల్లిస్తే.. వాటిని సివిల్ సప్లైస్ డెప్యూటీ తహసిల్దార్లు (సీఎస్డీటీ) పరిశీలించి తహసిల్దార్ల ద్వారా సరుకుల విడుదల పత్రాలు జారీ చేస్తారు. ఈ పత్రాలను మీ-సేవా కేంద్రాల్లో తీసుకునే వెసులుబాటు ఉన్నా ఇందుకు తహసిల్దార్ల నుంచి అనుమతి అవసరం. తహసిల్దార్ నుంచి నాలుగో తరగతి ఉద్యోగి వరకూ సమ్మెలో ఉండటంతో స్టాక్ రిలీజ్ ఆర్డర్లు ఇవ్వడం లేదు. దీనివల్ల డీలర్లు డీడీలు తీసినా ప్రయోజనం లేకపోతోంది. చాలావరకు ఈనెలకు సంబంధించిన బియ్యం పంపిణీ పూర్తయినా అమ్మహస్తం సరుకులు మాత్రం రేషన్ డిపోలకు చేరలేదు. సమ్మె మరికొంత కాలం కొనసాగే పరిస్థితి ఉండటంతో ఈనెల 20 వరకు సరుకులు డిపోలకు చేరు అవకాశం లేదంటున్నారు. గోడౌన్లకు చేరని సరుకులు జిల్లాలో 2,228 రేషన్ డిపోలున్నాయి. వాటిద్వారా 11 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులపై అమ్మహస్తం సరుకులతోపాటు కిలో రూపారుు బియ్యూన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతినెలా 5వ తేదీ నాటికి అమ్మహస్తం సరుకులు జిల్లాలోని 16 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డిపోలకు సరఫరా కావాల్సి ఉంది. ఇప్పటికే సరుకులు విడిపించుకోవడానికి 90 శాతం మంది డీలర్లు డీడీలు కట్టారు. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి పంచ దార, కాకినాడ , రాజమండ్రి నగరాల నుంచి పామాయిల్, ఛత్తీస్గఢ్ నుంచి చింతపండు ప్యాకింగ్ చేసి జిల్లాకు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ సరుకులేవీ గోడౌన్లకు చేరలేదని సమాచారం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం : డీఎస్వో అమ్మహస్తం సరుకులు రేషన్ డిపోలకు చేరని విషయమై డీఎస్వో శివశంకరరెడ్డిని ‘న్యూస్లైన్’ వివరణ కోరగా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టామని చెప్పారు. స్టాక్ రిలీజ్ ఆర్డర్లు రాసే బాధ్యతను గోడౌన్ ఇన్చార్జిలకు అప్పగిస్తున్నామన్నారు. డిపోలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారి ద్వారా సర్పంచ్లను కోరామన్నారు. వీఆర్ఏల సాయంతో సరుకుల్ని డిపోలకు చేరవేస్తామని తెలిపారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కిరోసిన్ సరఫరాకు 10 రోజులు పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. డిపోలకు సరుకులు చేరక పోతే తమ దృష్టికి తీసుకు రావాలని డీలర్లకు సూచించారు.