breaking news
Steel acquisition
-
భారత్కు స్టీల్ దిగుమతుల ముప్పు
అమెరికా దిగుమతి సుంకాలతో అంతర్జాతీయ వాణిజ్యం మార్పులకు లోనుకానుందని సెయిల్ ఛైర్మన్ అమరేందు ప్రకాశ్ పేర్కొన్నారు. యూఎస్లో కీలకమైన స్టీల్ ఉత్పత్తుల తయారీ రాత్రికి రాత్రి సాధ్యపడదన్నారు. సుంకాల నేపథ్యంలో భారత్కు చౌక స్టీల్ దిగుమతుల ముప్పు ఎదురుకావొచ్చని చెప్పారు. అన్ని స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్లను యూఎస్ ఇప్పటికే అమలు చేస్తుండగా, ఈ నెల 2 నుంచి అన్ని రకాల దిగుమతులపైనా ప్రతీకార సుంకాల విధింపును ప్రకటించడం గమనార్హం.‘సంప్రదాయంగా స్టీల్ ఆసియా దేశాల నుంచి యూఎస్, యూరప్కు ఎగుమతి అవుతుంటుంది. కొంత స్టీల్ యూరప్ నుంచి యూఎస్కు వెళుతుంటుంది. ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తే ఆయా ఎగుమతులు లాభసాటి కావు. దాంతో యూరప్కు చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఎగుమతి చేసే స్టీల్ ప్రపంచ దేశాలను ముంచెత్తుతుంది. ఇది భారత్కు కూడా రావొచ్చు’ అని సెయిల్ ఛైర్మన్ తన అభిప్రాయాన్ని తెలిపారు. అమెరికాకు భారత్ స్టీల్ ఎగుమతులు పెద్దగా లేకపోవడంతో టారిఫ్ల ప్రభావం మనపై తక్కువే ఉంటుందన్నారు.ఇదీ చదవండి: భారత్లోకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు‘అమెరికాలో కీలకమైన స్టీల్ ఉత్పత్తుల తయారీ రాత్రికి రాత్రి సాధ్యపడదు. దీంతో తాము ఉత్పత్తి చేయలేని వాటి దిగుమతులను అమెరికా కొనసాగిస్తుంది. అక్కడ తయారీ యూనిట్ల ఏర్పాటుకు కొంత సమయం తీసుకుంటుంది’ అని వివరించారు. దేశీ స్టీల్ పరిశ్రమను చౌక దిగుమతుల నుంచి కాపాడేందుకు సుంకాల విధింపు అవసరమని అభిప్రాయపడ్డారు. స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై 12 శాతం సేఫ్గార్డ్ డ్యూటీని వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ గత నెలలో సిఫారసు చేయడం గమనార్హం. దీనిపై ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
టాప్ 5 దేశాలను వెనక్కి నెట్టిన భారత్!
ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తి చేసే టాప్ 5 దేశాలతో పోలిస్తే భారత్లోనే వృద్ధి నమోదైనట్లు ప్రపంచ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్ఏ) నివేదిక వెల్లడించింది. స్టీల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనా ఏప్రిల్ నెలలో 85.9 మిలియన్ టన్నులతో 7 శాతం క్షీణించినట్లు డబ్ల్యూఎస్ఏ తెలిపింది.డబ్ల్యూఎస్ఏ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు చైనా ఉక్కు ఉత్పత్తి 343.7 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2023తో పోలిస్తే 3% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ ఏప్రిల్లో 3.6% పెరుగుదలతో 12.1 మిలియన్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య 49.5 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి 8.5% వృద్ధి సాధించింది. జపాన్, అమెరికా, రష్యాలు మొదటి త్రైమాసికంలో 2-6% క్షీణించాయి. జనవరి-ఏప్రిల్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇండియా మినహా మిగతా నాలుగు అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశాల్లో ప్రొడక్షన్ తగ్గింది.ఇదీ చదవండి: ఏఐతో మరింత అందంగా: రిలయన్స్ఇండియాలో స్టీల్ను ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ ప్రపంచ డిమాండ్ ఇంకా కోలుకోలేదని డేటా సూచిస్తుంది. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ సెహుల్ భట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉక్కు వినియోగిస్తున్న రంగాల్లో డిమాండ్ తగ్గింది. 2023లో ఐరన్ఓర్(ముడి ఉక్కు) ఉత్పత్తిలో ఎలాంటి మార్పులులేవు. ఈ ట్రెండ్ 2024లోనూ కొనసాగుతుందని అంచనా. ఈ ధోరణి భారతీయ ఉక్కు తయారీదారుల మార్చి త్రైమాసిక ఆదాయాలపై ప్రభావం చూపింది. దేశంలో అధిక ఐరన్ఓర్ దిగుమతి కారణంగా ధరలు ప్రభావితమయ్యాయి’ అని చెప్పారు. -
శనివాడ.. తరలింపు పీడ
ముక్కలు చెక్కలైన చిన్న గ్రామం బంధుత్వాలు.. ఆస్తులు.. చెల్లాచెదురు.. 1993లో స్టీల్ప్లాంట్ కోసం సగం గ్రామం తరలింపు ఇప్పుడు హిందుజా ప్లాంట్ కోసం ఆ సగంలో సగానికి తరలింపు సెగమమ్మల్ని ఎన్నిసార్లు విడగొడతారని బాధితుల ఆగ్రహం అదో చిన్న ఊరు.. పేరు శనివాడ.. ఒకప్పుడు అక్కడ 136 గడపలు.. 514 జనాభా ఉండేది... కానీ ఇప్పుడక్కడ 56 గడపలే మిగిలాయి.. కారణం.. స్టీల్ప్లాంట్ భూసేకరణ పేరుతో 80 కుటుంబాలను తరలించారు.. చచ్చీ చెడీ ఈ కుటుంబాలు పునరావాస కాలనీలో స్థిరనివాసాలు ఏర్పరచుకున్నాయి.. ఇప్పుడు వీటిలో సగం కుటుంబాలకు మళ్లీ తరలింపు పీడ పట్టుకుంది.. పదేళ్లుగా వెంటాడుతూ.. భయపెడుతోంది.. హిందుజా పవర్ప్లాంట్కు రైల్వేట్రాక్ నిర్మాణం కోసం వీటిలో సగం ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. ఏమిటీ పీడ.. ఎన్నిసార్లు మమ్మల్ని తరలిస్తారు?.. ఇప్పటికే గ్రామం ముక్కలైంది.. బాంధవ్యాలు తెగిపోయాయి.. ఇప్పటికైనా మమ్మల్ని ఒకచోట ప్రశాంతంగా బతకనీయరా?.. అని నిర్వాసిత కాలనీ ప్రజలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. అగనంపూడి: విశాఖ స్టీల్ప్లాంట్ మలిదశ భూసేకరణలో భాగంగా 56వ వార్డు అగనంపూడికి సమీపంలోని శనివాడ గ్రామంలోని భూమలను అధికారులు సేకరించారు. అప్పట్లో గ్రామంలో 136 కుటుంబాలు.. 514 మంది ప్రజలు ఉండేవారు. వీటిలో 80 ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుటుంబాలు అతికష్టం మీద 1993లో సెక్టార్-3లో దిబ్బపాలెం రైల్వేట్రాక్ వద్ద పునరావాసం కల్పించారు. మిగిలిన కుటుంబాలు మాత్రం పాత శనివాడలోనే ఉంటున్నాయి. కాగా మలిదశ సేకరణ కారణంగా ఈ గ్రామ నిర్వాసితులు ఉద్యోగావకాశాలకు నోచుకోలేదు. ఎలాగోలా ఇళ్లు కట్టుకొని స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. హిందుజా పవర్ ప్లాంట్ నిర్మాణంతో వారిని మళ్లీ తరలింపు భయం వెంటాడుతోంది. ఈ ప్లాంట్కు అవసరమైన రైల్వ ట్రాక్ నిర్మాణానికి భూమి కోసం ఈ 80 కుటుంబాల్లోని 40 కుటుంబాలను వేరే ప్రాంతానికి తరలించే ప్రతిపాదన పదేళ్ల క్రితం తెరపైకి వచ్చింది. అధికారులు సర్వేలు, మార్కింగులు చేయడం కూడా ప్రారంభించడంతో కాలనీవాసులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో అప్పట్లో సర్వే ఆపేశారు. రెండేళ్ల నుంచి మళ్లీ భూసేకరణ సన్నాహాలు మొదలవడంతో కాలనీవాసుల్లో అలజడి రేగుతోంది. పది రోజుల క్రితం కూడా రైల్వే, హిందుజా సంస్థల అధికారులు వచ్చి సర్వే చేశారు. విశాఖ ఉక్కు కోసం ఒకసారి ఆస్తులు, ఇళ్లు త్యాగం చేశాం. ఇప్పుడు హిందుజా పవర్ ప్లాంట్ కోసం మళ్లీ త్యాగాలు చేయమంటే ఎలా?.. మేమేమైనా సంచార జీవులమా అని స్థానికులు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు. ఎన్నిసార్లు తరలిస్తారు.. ఎన్నిసార్లు విడగొడతారని అడుగుతున్నారు. ఇప్పటికే బతుకులు దయనీయం ఉన్న కొద్దో గొప్పో భూమి సాగు చేసుకొని రైతు బిడ్డలుగా ఠీవీగా బతికిన శనివాడ నిర్వాసితుల బతుకులు తరలింపు పుణ్యమా అని ఇప్పటికే దయనీయంగా మారాయి. విశాఖ స్టీల్ప్లాంట్కు భూములు ఇస్తే ఇళ్లతోపాటు ఉద్యోగం వస్తుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. నిర్వాసితుల్లో ఒకరిద్దరు మినహా ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. దీంతో కూలి పనులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఇళ్లలోని పురుషులు, మహిళలు దినసరి కూలీలుగా మారడం ఒక ఎత్తయితే.. కాలనీకి పది మీటర్ల దూరంలోనే ఎన్టీపీసీ కోసం ప్రత్యేకంగా వేసిన రైల్వే ట్రాక్ వారి జీవితాల్లో ప్రశాంతతను చెదరగొట్టింది. ఇళ్లను శిథిలం చేసింది. రైళ్ల రాకపోకల శబ్దాలతో పగలూ రాత్రి తేడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళల్లో కంటి మీద కనుకు కష్టంగా ఉంది. కొత్తవారెవరైనా వస్తే రెప్పవాలే పరిస్థితే లేదు. మరోవైపు రైళ్ల రాకపోకల ధాటికి దాదాపు అన్ని ఇళ్ల గోడలు బీటలు వారాయి. ప్రతి రెండేళ్లకోసారి వాటికి మరమ్మతులు చేయించడం, పుట్టీలు పెట్టించడంతోనే సరిపోతోంది. హిందుజాతో భయం హిందుజా ప్లాంట్కు రైల్వే ట్రాక్ నిర్మాణానికి అవసరమైన భూమి కోసం శనివాడ నిర్వాసిత, ఎస్సీ కాలనీకి చెందిన 40 ఇళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది. రెండున్నర దశాబ్దాల క్రితం గ్రామాన్ని, బంధువులను, ఆస్తులను వదిలి సగం మంది ఇక్కడికి రావడం.. అలా వచ్చిన వారిలో సగం మంది మళ్లీ ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లాల్సిన పరిస్థితి బాధితుల్లో అలజడి రేపుతోంది. ఎస్సీకాలనీలోనూ ఇదే పరిస్థితి ఉంది. తరలించడ తప్పనిసరైతే.. మొత్తం కాలనీని తరలించాలని, అలాగే తాము సూచించిన ప్రాంతంలో పునరావాసం కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తమ పరిస్థితి సంచార జీవుల్లా తయారైంది. భవిష్యత్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ ఒకేచోటుకు తరలించాలి లేదా తమ గ్రామం జోలికి రావద్దని వారు హెచ్చరిస్తున్నారు. కాలనీ మొత్తాన్ని తరలిస్తే అభ్యంతరం లేదు... పదేళ్ల క్రితం హైకోర్టును ఆశ్రయించడంతో ట్రాక్ నిర్మాణ పనులు ఆపేశారు. ఇప్పుడు మళ్లీ మాకు పని కల్పిస్తున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ వల్ల ఒకప్పుడు, హిందుజా సంస్థ వల్ల ఇప్పుడు నిర్వాసితులుగా మారే పరిస్థితి ఏర్పడింది. గతంలో గ్రామంలో సగం మందికే ఇక్కడ పునరావాసం కల్పించడంతో గ్రామానికి దూరమయ్యాం. ఇప్పుడు కూడా సగం గ్రామాన్ని సేకరిస్తే ఒప్పుకొనేది లేదు. మొత్తం కాలనీ అంతటిని తరలించాలి. -గొంతిన గోపి, నిర్వాసిత నాయకుడు రోజూ టెన్షనే... అప్పట్లో ట్రాక్ పక్కకు మమ్మల్ని తరలించారు. అప్పట్లో వద్దన్నా పట్టించుకోలేదు. 24 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఇళ్లు కట్టుకొని ఉంటున్నాం. నిత్యం శబ్దాల నడుమ నివసిస్తున్నాం. మళ్లీ పవర్ప్లాంట్ ట్రాక్ పేరుతో వేరే చోటుకి వెళ్లమంటే ఎలా. ఎన్నిసార్లు నిర్వాసితుల అవతారమెత్తాలి. -కరణం వెంకటేష్, శనివాడ కాలనీ ఎన్నిసార్లు అడుకుంటారు మా జీవితాలతో ఆడుకోవద్దు. అప్పుడు స్టీల్ప్లాంట్ నిరాశ్రయుల్ని చేసింది. ఇప్పుడు హిందుజా రోడ్డున పడేయాలని చూస్తోంది. సర్వేలతో ఇబ్బంది పెడుతున్నారు. గ్రామం మొత్తాన్ని మేం కోరుకున్న చోటుకి తరలిస్తామంటేనే అంగీకరిస్తాం. -గొంతిన రమణమ్మ, కాలనీ