breaking news
Srirangam kamesh
-
HYD: ట్యాక్స్ ఎగ్గొట్టే యత్నం.. పట్టించిన ఏఐ
స్థిరాస్తి విక్రయాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ (ఎల్టీసీజీ) ట్యాక్స్ ఎగవేయాలని పథకం వేసిన హైదరాబాద్ వ్యాపారి కొన్ని నకిలీ బిల్లులు సృష్టించారు. రూ.21.6 లక్షలు చెల్లించాల్సిన చోట రూ.7200 చెల్లిస్తే చాలన్నట్లు తయారు చేశారు. ఓ బిల్లులోని ఫాంట్పై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు ఏఐ టూల్ వినియోగించారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లుపై ఉన్న తేదీ నాటికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఆ ఫాంట్ లేదని నివేదిక వచ్చింది. దీని ఆధారంగా ఐటీ అధికారులు సదరు వ్యాపారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. గత్యంతరం పరిస్థితుల్లో సదరు వ్యాపారి రూ.21.6 లక్షలు చెల్లించి కేసు నుంచి బయటపడాల్సి వచ్చింది.హైదరాబాద్లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం పూర్వాపరాలు ఇలా... ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఎల్టీసీజీ ద్వారా వచ్చే లాభంలో 30 శాతం పన్నుగా చెల్లించాలి. అయితే ఈ మొత్తాన్ని మరో స్థిరాస్తి పైన లేదా దాని అభివృద్ధి కోసం వెచ్చిస్తే ఆ మొత్తానికి మినహాయింపు పొందవచ్చు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి 2000కు ముందు రూ.68 లక్షలు వెచ్చించి శివార్లలో ఉన్న ఓ పాత ఇంటిని ఖరీదు చేశారు. దీనికి మరమ్మతులు చేసి అదనపు హంగులు చేర్చారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా రూ.1.4 కోట్లకు విక్రయించారు. ఇలా సదరు స్థిరాస్తి విక్రయం ద్వారా 2002లో రూ.72 లక్షలు లాభం పొందారు. దీనిపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్గా రూ.21.6 లక్షలు చెల్లించాల్సి ఉంది.అయితే 2002–08 మధ్య తనకు చెందిన మరో ఇంటి అభివృద్ధి కోసం రూ.71 లక్షలకు పైగా వెచ్చించినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు. వీటిని ఆదాయపు పన్ను శాఖకు సమర్పిస్తూ చేస్తూ తనకు క్యాపిటల్ గెయిన్గా కేవలం రూ.24 వేలు మిగిలినట్లు చూపించారు. ఇందులో 30 శాతం యడం ద్వారా ఆ మేరకు మినహాయింపు పొంది మిగిలిన రూ.7200 చెల్లించారు. ఈ వ్యవహారాన్ని సందేహించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సదరు వ్యాపారికి నోటీసులు జారీ చేస్తుండగా దానికి ఆయన నుంచి సమాధానాలు వెళ్తున్నాయి. ఇలా దాదాపు 16 ఏళ్లుగా వీరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి.ఈ బిల్లుల్లోని లోటుపాట్లను గుర్తించడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏఐ టూల్ వినియోగించారు. వ్యాపారి సమర్పించిన బిల్లుల్లో 2002 జూలై 6 తేదీతో రూ.7.6 లక్షలది కూడా ఉంది. దీన్ని విశ్లేషించిన ఏఐ టూల్ అందులోని ఫాంట్లో ఉన్న లోపాన్ని ఎత్తి చూపింది. ఆ బిల్లు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోని కాలిబ్రి అనే ఫాంట్తో ముద్రించి ఉంది. డిజిటల్ సాన్స్–సెరిఫ్ టైప్ ఫేస్ ఫాంట్ అని గుర్తించిన ఏఐ టూల్ మరికొన్ని కీలకాంశాలను బయటపెట్టింది.దీన్ని 2002–2004 మధ్య డచ్ డిజైనర్ లూకాస్ డి గ్రూట్ రూపొందించారని, 2006లో విండోస్ విస్టాతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తేల్చింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఆ ఫాంట్ 2007 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. వర్డ్లో టైమ్స్ న్యూ రోమన్ని, పవర్పాయింట్, ఎక్సెల్, ఔట్లుక్ల్లో ఏరియల్న ఫాంట్కి బదులు ఇది అందుబాటులోకి వచ్చినట్లు ఆ టూల్ నివేదించింది. కంప్యూటర్ ప్రపంచంలోకి 2006లో అందుబాటులోకి వచ్చిన ఫాంట్తో 2002లో బిల్లు ముద్రితం కావడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా ఐటీ అధికారులు సదరు వ్యాపారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో గత్యంతరం లేక ఆ వ్యాపారి మొత్తం రూ.21.6 లక్షలు చెల్లించిన అధికారులకు క్షమాపణ చెప్పి వెళ్లారు.- శ్రీరంగం కామేష్ -
ధర్మస్థళలో ఏం జరిగింది?
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థళ. ఇప్పటి వరకు ఇది మంజునాథుడి ఆలయం నుంచి ఆధ్యాత్మిక ప్రాంతంగానే సుపరిచితం. ఈ నెల 3న ఓ న్యాయవాదితో కలిసి అక్కడి పోలీసుస్టేషన్కు వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన తాను దాదాపు 20 ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టానని బాంబు పేల్చాడు. హతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరిపై అత్యాచారం జరిగినట్లు, మరికొందరిపై యాసిడ్ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని అంతా ఉలిక్కిపడేలా చేశాడు. ప్రస్తుతం మానవహక్కుల, మహిళ సంఘాలు నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.ధర్మస్థళ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి మంజునాథ స్వామి ఆలయం ఏళ్లుగా లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయాన్ని నడిపే ట్రస్ట్ కర్ణాటకలోని అత్యంత శక్తిమంతమైన హెగ్డే కుటుంబం నేతృత్వంలో పని చేస్తుంటుంది. అత్యంత సంప్రదాయకమైన ఈ కుటుంబం కేవలం దక్షిణ కన్నడ జిల్లాలోనే కాకుండా ఆ రాష్ట్రంలోనే సామాజిక, రాజకీయంగా శక్తిమంతమైంది. అలాంటి ధర్మస్థళ దేవాలయం సూపర్వైజర్లు, నిర్వాహకులపై మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు కేసు నమోదైంది. ఇందులోని నిజానిజాలు గుర్తించే పనిలో ధర్మస్థళ పోలీసులు ఉండగా... సుజాత భట్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు విభాగం మొత్తం అప్రమత్తమైంది. ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ‘తాను దళితుడినని, 1995 నుంచి 2014 డిసెంబర్ దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని’ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనేక కీలకాంశాలు పొందుపరిచాడు. అంతా ఉలిక్కిపడేలా చేసిన ఆ వివరాలివి....‘‘ఉద్యోగంలో చేరిన తొలినాళ్లల్లో ధర్మస్థళ ఆలయానికి సమీపంలో ఉన్న నేత్రావతి నది వద్ద విధులు నిర్వర్తించా. ఆ పరిసరాలను శుభ్రం చేసే డ్యూటీ నుంచి సూపర్వైజర్ల ఆదేశాల మేరకు హఠాత్తుగా హేయమైన, దారుణ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేసే పని చేయాల్సి వచ్చింది. పురుషులతో పాటు మహిళలు, బాలికలు, చిన్నారుల మృతదేహాలను తీసుకువెళ్లి సమీపంలో ఉన్న అడవిలోని వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టేలా సూపర్వైజర్లు ఆదేశించారు. మొదట్లో ఇవన్నీ నేత్రావతి నదితో పాటు ధర్మస్థళ ప్రాంతానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించినవి భావించా. అయితే కొన్నాళ్లకు ఆ మృతదేహాలను ఉన్న గాయాలు, ఇతర గుర్తులను చూసి అనుమానించాం. దీంతో ఆ మృతదేహాలు ఏమిటి? అంటూ ఆ బాధ్యతలు అప్పగించిన సూపర్వైజర్లను ప్రశ్నించా. పోలీసులకు చెప్పకుండా ఇలా మృతదేహాలను మాయం చేయకూడదని, అసలు విషయం చెప్పకపోతే ఆ పని చేయనని స్పష్టం చేశా. ఆగ్రహానికి గురైన వాళ్లు నన్ను తీవ్రంగా కొట్టారు. తాము చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానంటూ బెదిరించారు. ‘ముక్కలుగా నరికేస్తాం’, ’మీ మృతదేహాన్ని మిగిలిన వాటిలాగే పాతిపెడతాం’, ’మీ కుటుంబాన్ని కూడా ఉండనీయం’ అంటూ వాళ్లు భయపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని కొనసాగించా.కొన్నిసార్లు ఆయా మృతదేహాలపై అత్యాచారం, తీవ్రమైన హింసకు సంబంధించి ఆనవాళ్లు కనిపించాయి. మహిళల మృతదేహాల్లో అనేకం వస్త్రాలు లేకుండా లో దుస్తులు లేకుండా ఉండేవి. వారి శరీరాలపై లైంగికదాడులకు సంబంధించి గుర్తులు, గాయాలు కనిపించేవి. కొన్ని మృతదేహాలకు ఏకంగా గొంతులు కోసి, తీవ్రరక్తస్రావమై ఉండేవి. 1994 నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు ఎన్నో మృతదేహాలను తీసుకువెళ్లి ధర్మస్థళ చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టా. వాటిలో 2010లో పూడ్చిన బాలిక మృతదేహం స్కూల్ యూనిఫాంతో ఉంది. ఆ రోజు సూపర్వైజర్లు నన్ను నేత్రావది నది సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్కు అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రదేశానికి పంపారు. అక్కడే నాకు ఆ బాలిక మృతదేహం కనిపించింది. అప్పట్లో ఆమె వయస్సు 12 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండచ్చు. ఆమె శరీరంగా లైంగిక దాడికి సంబంధించిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి.యాసిడ్ దాడిలో ముఖం, చేతులు కాలిపోయి ఉన్న మహిళలవి, గొంతు పిసికి చంపిన పురుషుల మృతదేహాలు కూడా తీసుకువెళ్లి పాతిపెట్టి వచ్చా. నా సమక్షంలోనూ కొందరిని చంపిన సూపర్వైజర్లు ఆ శవాలను మారుమూల అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టించారు. 1998లో వారికి ఎదురు తిరగడంతో తీవ్రంగా కొట్టారు. నా ప్రాణంతో పాటు నా కుటుంబ ప్రాణాల కోసం 2014 వరకు ఈ పని చేశా. ఆ ఏడాది డిసెంబర్లో సూపర్వైజర్ల సంబంధీకుడు నా కుటుంబానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో నా ఉద్యోగంతో పాటు ధర్మస్థళ వదిలి కుటుంబంతో సహా పారిపోయా. ఇతర రాష్ట్రంలో తలదాచుకున్నా... నాకు, నా కుటుంబానికి హాని తప్పదనే భయం నిత్యం వెంటాడుతూనే ఉంది. అప్పట్లో జరిగిన దారుణాలను బయటకు చెప్పాలని ఇటీవల తిరిగి వచ్చా’’ అని పేర్కొన్నాడు.ధర్మస్థళకు వచ్చిన వెంటనే తాను అప్పట్లో ఓ శవాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్లానని పోలీసుల దృష్టికి తెచ్చాడు. అక్కడ తవ్వి కొన్నేళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని తవ్వి తీశానంటూ కొన్ని ఫొటోలను తన ఫిర్యాదుతో జత చేసి ధర్మస్థళ పోలీసులకు అందించాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ ఇవ్వాలని కోరాడు. పోలీసులు తనతో వస్తే తాను మృతదేహాలను పాతిపెట్టిన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్తాననీ పేర్కొన్నాడు. ఆ మృతదేహాలను బయటకు తీసి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేయాలని ఆశిస్తున్నానని, అలా చేస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, తనలో ఉన అపరాధ భావం పోతుందని సదరు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు. అప్పట్లో మృతదేహాలను మాయం చేయాలని ఆదేశించిన వారిలో సూపర్వైజర్లతో పాటు ఆలయ పాలకమండలి సభ్యులూ ఉన్నట్లు వివరించాడు. ప్రాణభయంతోనే వారి పేర్లు చెప్పలేదని, పలుకుబడి ఉన్న వారి నుంచి తనకు రక్షణ కావాలని కోరాడు. పోలీసుల ఆ భరోసా ఇస్తే అన్ని పేర్లు చెప్తానని అన్నాడు. ఈ ఫిర్యాదును కోర్టుకు నివేదించిన ధర్మస్థళ పోలీసులు న్యాయమూర్తి అనుమతితో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.- శ్రీరంగం కామేష్త్వరలో మరిన్ని వివరాలు.. -
IAF Combined Graduation Parade: ఈ పైలట్లు ఫైటర్లు
పోరాటాలంటే మక్కువ ఉన్నవారు ఏ సవాల్నైనా ఇట్టే అధిగమిస్తారు. ఫైటర్ జెట్ పైలెట్గా ఎంపికైన మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్లను చూస్తే ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజం అంటారు. 22 మంది మహిళల్లో ఫైటర్లుగా ఎంపికైన వీరి ప్రతిభ, కృషి నవతరానికి స్ఫూర్తి. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ఫోర్స్ అకాడెమీలో (ఏఎఫ్ఏ) జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ అది. వాయుసేనలో ఉన్న ఖాళీలు, శిక్షణ సమయంలో అభ్యర్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా వారిని ఫైటర్లుగా ఎంపిక చేస్తారు. మొత్తం 164 మంది శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ ఆఫీసర్లు పట్టాలు పొందారు. వీరిలో 22 మంది మహిళలు ఉండగా మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్లు ఫైటర్ జెట్ పైలట్లుగా నిలిచారు. మైత్రేయ నిగమ్ ఆమె కుటుంబంలో మూడో తరం ఫైటర్. వదలని కృషి గ్రూప్ కెప్టెన్గా పదవీ విరమణ పొందిన పీకే నిగమ్ ప్రస్తుతం ఏవియేషన్ డొమైన్ సంస్థలో పని చేస్తుండగా, ఆయన కుమారుడు అమిత్ నిగమ్ వింగ్ కమాండర్ హోదాలో రిటైర్ అయి ఇండిగో విమానయాన సంస్థలో సీనియర్ కెప్టెన్గా పని చేస్తున్నారు. మైత్రేయ నిగమ్ ఢిల్లీలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో విద్యనభ్యసించారు. అహ్మదాబాద్లోని ముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో (మికా) ఎంబీఏ కోర్సులో చేరారు. అదే సమయంలో తనకు ఆసక్తి ఉన్న వైమానిక దళంలోకి ఎంపికయ్యారు. ‘మా తాత, తండ్రిని చూసి స్ఫూర్తి పొందాను. ఫైటర్ జెట్ పైలట్ కావాలనే ఆశయంతో కృషి చేశా. తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎవరైనా అనునిత్యం శ్రమించాల్సిందే. వెంట వెంటనే విజయాలు లభించవు. కల నెరవేరాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. కానీ, ఆగిపోవద్దు. కృషిని మధ్యలోనే వదిలేయకుండా కష్టపడితే విజయం తథ్యం’ అని చెబుతోంది మైత్రేయ. పోరాటాలంటే ఇష్టం ఢిల్లీకి చెందిన మెహర్ జీత్ కౌర్ బీఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేశారు. ఆది నుంచీ మెహర్కి మిలటరీ బలగాలు చేసే పోరాటాలంటే మక్కువ. దీంతో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్... ఏదో ఒకదాంట్లో చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏఎఫ్ఏలో శిక్షణలో ప్రతిభ చూపించి ఫైటర్ జెట్ పైలట్గా ఎంపికయ్యారు. ‘జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వెనక్కు రాకూడదు. మహిళలు ఈ విషయంలో మరింత పట్టుదలతో ఉండాలి. ఏ సాయుధ బలగంలో అయినా అతివలు దూసుకుపోగలరని గుర్తుంచుకోండి. బీదర్ లో అదనపు శిక్షణ అనంతరం విధుల్లో చేరుతా’ అని పేర్కొన్నారు. నావిగేటర్.. మా నాన్న గుర్దీప్ సింగ్ గుర్దాస్పూర్ సిటీ పోలీసు విభాగంలో అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. తాత గురుబచన్ సింగ్ ఆర్మీలో పని చేసి పదవీ విరమణ పొందారు. వారు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఈ స్థాయికి చేర్చింది. పంజాబ్లోని గుర్దాస్పూర్ నుంచే పన్నెండో తరగతి పూర్తి చేశాను. 2016లో భారత వాయుసేనలోకి ముగ్గురు మహిళా ఫైటర్లు తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన వార్త చూసి వారి బాటలోనే నడవాలనుకున్నాను. ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లి ఏఎఫ్ఏలో శిక్షణ పూర్తి చేసుకుని, నావిగేటర్గా ఎంపికయ్యాను. – కోమల్ ప్రీత్ కౌర్, పంజాబ్ కఠినమైన శిక్షణ ఎయిర్ఫోర్స్ అకాడెమీలో శిక్షణ ఎంతో కఠినంగా ఉంటుంది. ఇక్కడ శిక్షణ పొందే ప్రతి ఒక్కరూ నెవర్ గివిట్ అప్ ధోరణిలోనే ఉంటారు. స్త్రీ, పురుష తేడాలు ఉండవు. ప్రతి ఒక్కరూ విధుల్లో ఉన్నట్టుగానే శిక్షణలో పాల్గొనాలి. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, త్యాగాల కారణంగానే ఈ స్థాయికి చేరా. 12వ తరగతి వరకు సైన్స్ చదివినా డిగ్రీ మాత్రం ఆర్ట్స్లో పూర్తి చేశాను. నా తండ్రి రణ్బీర్ సింగ్ ఢిల్లీ కేంద్రంగా టెరిటోరియర్ ఆర్మీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత హోదా అయిన సుబేదార్ మేజర్గా పని చేస్తున్నారు. ఆర్మీ జీవితాన్ని వారి ద్వారా ఇప్పటికే చూశాను. అందుకే వైమానిక దళాన్ని ఎంపిక చేసుకున్నా. ఎదగాలి, ఎగరాలనే కోరిక బలంగా ఉంది. – సహజ్ప్రీత్ కౌర్, అమృత్సర్ ఈ శిక్షణలో పాల్గొన్న కోమల్ప్రీత్కౌర్, సహజ్ప్రీత్కౌర్లు కూడా తమ శిక్షణ అనుభవాలను పంచుకున్నారు. – శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో, హైదరాబాద్ -
ట్రాఫిక్ పోలీసులకు మీరెంత బాకీ..?
ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న చిరునామాలో మీరు ఎప్పుడూ ఉండకపోవచ్చు. దీంతో మీ వాహనానికి సంబంధించి ట్రాఫిక్ ఉల్లంఘనలపై జారీ అయిన ఈ - చలాన్ మీకు చేరకపోవచ్చు. ఇలా పెండింగ్ చలాన్లు పెరిగి ట్రాఫిక్ పోలీసులకు చిక్కడమో.. న్యాయస్థానానికి వెళ్లాల్సిన పరిస్థితి రావడమో జరగొచ్చు. దీనికి పరిష్కారమే ‘ట్రాఫిక్ ఈ-చలాన్ తెలంగాణ’ యాప్. మీకెన్ని చలాన్లున్నాయో తెలుసుకోవాలంటే మీ మొబైల్లో ఈ యాప్ని డౌన్ లోడ్ చేసుకోండి. - శ్రీరంగం కామేష్ నో రిజిస్ట్రేషన్.. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేరుగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇతర యాప్స్ మాదిరిగా ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. యాప్లోకి ప్రవేశించగానే ‘ఎంటర్ వెహికిల్ నంబర్’ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీ వాహనం నంబర్ ఎంటర్ చేస్తే మీ పెండింగ్ ఈ-చలాన్ల వివరాలు డిస్ప్లే అవుతాయి. ‘వైలేషన్’ అనే కాలమ్లో ఉన్న మార్కు నొక్కితే ఎంత చెల్లించాలి తదితర పూర్తి వివరాలు ఫొటోతో సహా కనిపిస్తాయి. మీ వాహనం నంబర్ ఎంటర్ చేసేటప్పుడు కచ్చితంగా క్యాపిటల్ లెటర్స్ ఉండేలా చూసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ సౌకర్యం... అప్పటికప్పుడు యాప్ ద్వారా చెల్లింపులు చేయడానికి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ మాత్రం సెల్ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ నమోదు చేయాలి. తర్వాత చలాన్ను సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ‘మేక్ పేమెంట్’ ఆప్షన్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోగానే నేరుగా నెట్ బ్యాంకింగ్కు కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం 32 బ్యాంకులతో ట్రాఫిక్ పోలీసు విభాగానికి ఒప్పందం ఉంది. డౌన్లోడ్ ఇలా.. గూగుల్ ప్లేస్టోర్లో ‘ట్రాఫిక్ ఈ-చలాన్ తెలంగాణ’ అని టైప్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పేరుతో సారూప్యత కలిగిన యాప్స్ మరికొన్ని ఉంటాయి. కచ్చితంగా (Traffic EChallan Telangana)నే డౌన్లోడ్ చేసుకోవాలి. -
జీవిత ధీమా!
జీవితంలో సక్సెస్ అంటే ఏమిటి? ఇంగ్లిష్ మీడియంలతో గట్టెక్కడమా? ఇంజనీరింగ్ పట్టాలతో ఒడ్డెక్కడమా? సెక్యూర్ జాబ్ని దక్కించుకోవడమా? కానీ సక్సెస్ అంటే ఇవి మాత్రమే కాదంటున్నారు వెంకటేశ్వరరావు. పుట్టిపెరిగింది పల్లెటూరైనా... చదువులు చెట్టెక్కిపోయినా... తాను ఉట్టికెగరలేనేమోనని నిరాశపడని నిత్య ఆశావాదంతో ఏకంగా భూతల స్వర్గం అనుకునే అమెరికాకు ఎగిరారు. అక్కడి క్లయింట్లను కూడా అవలీలగా ఆకట్టుకున్నారు. లక్ష క్లయింట్లను లక్ష్యంగా పెట్టుకున్న ఈయన కోట్ల కమీషన్తో ఫోర్బ్స్ మ్యాగజీన్లో స్థానం పొందారు. కోటీశ్వరుల సరసన తానూ ధీమాగా నిలబడ్డారు. ఆ పాలసీ బీముడి వాస్తవ కథ... ఆ జీవితభీముడి విజయగాథ... నేటి ప్రజాంశంలో... రెండు వేల మంది క్లయింట్స్... 40 దేశాల్లో కార్యకలాపాలు... ఏటా కోట్లరూపాయల ఆదాయం... రాష్ట్ర రాజధానిలోని నాలుగు ప్రాంతాల్లో ఇళ్లు... 1.89 కోట్లు ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్... ఇవన్నీ ఉన్నాయంటే అతనొక బిజినెస్ టైకూనో, బడాబడా సంస్థ సీఈఓనో అనుకుంటున్నారా! కానే కాదు... ఆయన ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. యథాలాపంగా ఎల్ఐసీ ఏజెన్సీ తీసుకుని... ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. గడిచిన ఏడాది 2 కోట్ల రూపాయలకు పైగా కమీషన్ పొందారు. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫోర్బ్స్ మ్యాగజీన్లో గతనెల (నవంబర్) స్థానం సంపాదించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని మాదాపూర్లో నివసిస్తున్న ఎల్ఐసీ ఏజెంట్ వాకలపూడి వెంకటేశ్వరరావును ఈ సందర్భంగా కలిసినప్పుడు తన విజయప్రస్థానాన్ని ఇలా వివరించారు. అది ఆయన మాటల్లోనే... ఇంగ్లిష్ మీడియంలో చదవలేక... ఇంజినీరింగ్లో ఫెయిలై... మాది పశ్చిమ గోదావరిజిల్లా తణుకు సమీపంలోని కాల్దరి గ్రామం. ఇంటర్మీడియట్ తరవాత ఇంజనీరింగ్ కోసం 1986లో హైదరాబాద్ వచ్చాను. అప్పటివరకు తెలుగు మాధ్యమంలో కొనసాగిన చదువు ఒకేసారి ఆంగ్లమాధ్యమంలోకి మారడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. వరుసగా మూడేళ్లు ఫెయిలయ్యాను. దాంతో మా నాన్నగారు ఫీజు కోసం డబ్బు పంపడం మానేశారు. ఇంటికి వచ్చేసి, వ్యవసాయం చేయమన్నారు. అప్పుడు నా వయస్సు 19 ఏళ్లు. తిరిగి వెళ్లడం ఇష్టం లేక రూ.50 వేల రుణంతో సికింద్రాబాద్లో నోట్బుక్ తయారీ యూనిట్ ఒకటి ప్రారంభించాను. దాంట్లో నష్టాలు రావడంతో మూడేళ్ల తర్వాత ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి మారాను. 1997లో నాన్నగారు మరణించడంతో వైజాగ్ వెళ్లి పౌల్ట్రీ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి 2005 వరకు ఇదే వ్యాపారం చేస్తూ దూరవిద్య ద్వారా ఎం.ఏ. పూర్తి చేశాను. ఈ వ్యాపారం రెండుమూడేళ్లు బాగున్నా... ఆ తరవాత అందులో కూడా నష్టాలే వచ్చాయి. ఏజెంట్గా మారతానని ఊహించలేదు నెలకు 50 వేల రూపాయల జీతంతో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు స్నేహితులు, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కోసం ఎల్ఐసీ పాలసీ గురించి నన్ను సంప్రదించారు. వారి కోసమని, నా చేత పాలసీలు చేయించిన ఏజెంట్ను రమ్మన్నాను. అయితే అతను రెండు నెలలైనా రాలేదు. ఒకవైపు స్నేహితుల నుంచి తీవ్రమైన ఒత్తిడి. అప్పటి కొవ్వూరు ఎమ్మెల్యే కృష్ణబాబు గారి ప్రోద్బలంతో నేనే ఏజెంట్గా చేరాను. ప్రోద్బలం అనడం కన్నా... ఓ రకంగా ఒత్తిడి చేశారనవచ్చు. నిజానికి ఆయన మాట కాదనలేక ఏజెన్సీ తీసుకున్నాను. నా మిత్రులు ఆరుగురికి పాలసీ చేసిన తరవాత, నేను ఏజెంట్గా తగనని భావించి, కొద్దో గొప్పో తెలిసిన పౌల్ట్రీ వ్యాపారంలోకి మళ్లీ వెళ్లాను. మలుపుతిప్పిన జీవన్శ్రీ ఎల్ఐసిలో బాగా పాపులరైన జీవన్శ్రీ పాలసీ 2001లో క్లోజ్ అవుతున్న సమయంలో... మా డెవలప్మెంట్ ఆఫీసర్ రఘు పట్టుబట్టి, పాలసీలు చేయమని నన్ను ప్రోత్సహించారు. అప్పట్లో ఆ పాలసీ చేయడానికి జనం ఎగబడుతుండటంతో... ఆఖరి 15 రోజుల్లో 4.5 కోట్ల రూపాయల వ్యాపారం చేశాను. ఇది నన్ను అమెరికా బాట పట్టించింది. అక్కడి ఎండీఆర్టీఏ సభ్యుడిగా 2002లో మొదటిసారిగా అమెరికా వెళ్లాను. లాస్వెగాస్లో సెవెన్ స్టార్ హోటల్లో బస ఏర్పాటుచేశారు. (ఎండీఆర్టీఏ అంటే మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ అసోసియేషన్. ప్రపంచ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏజెంట్స్/అడ్వయిజర్స్ను ఆయా ఇన్సూరెన్స్ సంస్థలు ఎండీఆర్టీఏకి నామినేట్ చేస్తాయి. ఆయా రంగాలలో అభివృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణలను అది ఇస్తుంది). అప్పటివరకు ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే నా దృష్టిలో పంచెకట్టుకుని, డొక్కువాహనంపై, ఫైలు పట్టుకుని తిరుగుతూ ఉండేవారే. జీవన్శ్రీ పుణ్యమాని రూ.4.5 కోట్ల వ్యాపారం చేసినా, నా దృష్టి మారలేదు. అయితే లాస్వెగాస్ పర్యటన నా ఈ దృక్పథాన్ని మార్చేసింది. అక్కడ నుంచి తిరిగి వచ్చాక, ఎల్ఐసీ ఏజెన్సీతో పాటు పౌల్ట్రీ వ్యాపారం కూడా కొనసాగించాను. 2005లో మా అమ్మ మరణించారు. పౌల్ట్రీ వ్యాపారంలో నష్టాలు పెరిగాయి. దాంతో పూర్తిస్థాయి ఎల్ఐసీ ఏజెంట్గా మారాను. ఇక వెనుతిరిగి చూడలేదు. స్వచ్ఛందసంస్థ ఏర్పాటుచేసి... ఆర్థికంగా వెనుకబడి ఉన్న పల్లె ప్రజలను ఆదుకోవాలనుకున్నాను. దీనికోసం నా స్నేహితులు, క్లయింట్ల సాయంతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశాను. ఐఎస్బీలో నేర్చుకున్న విషయాలతో పాటు ప్రొఫెసర్ల సాయంతో ఆ ఐఎస్బీకే కోర్సు రూపొందించి, అక్కడ ఎన్నో అంశాలను బోధిస్తున్నాను. ఏజెంట్లకు గర్వకారణం అనేదే సంతృప్తి నన్ను, నా స్థాయిని చూసి ఎన్నో రంగాలకు చెందిన వారు ఎల్ఐసీ ఏజెంట్స్గా మారారు. ఇది అన్నింటికంటే తృప్తినిస్తోంది. నా దగ్గర ఒకసారి పాలసీ చేసినవాళ్లు నా కుటుంబంగా మారిపోతారు. వారివల్లే నేను ఈ స్థాయికి వచ్చాను... అంటూ సంతృప్తిగా ముగించారు వెంకట్. ఆంగ్లమాధ్యమంలో చదవలేక చదువుకే దూరమైన వ్యక్తి దాదాపు 40 దేశాలు తిరిగి, ఎల్ఐసి వంటి అతిపెద్ద సంస్థ తరపున బిజినెస్ స్కూల్కు కోర్సు డిజైన్ చేసే స్థాయికి ఎదిగిన వైనాన్ని విశ్లేషిస్తే... తన బలాన్ని గుర్తించిన మనిషికి అదే బలంగానూ, ఆ నిత్యవిజయ కాంక్షే అతిపెద్ద బలహీనతగా మారుతుందనే వాస్తవం మనకు అవగతమవుతుంది. - శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ విక్టోరియాస్ విన్నర్స్సీక్రెట్నే ఫాలో అయ్యాను విక్టోరియా యుద్ధవీరులు పడవలపై యుద్ధానికి వెళ్లినప్పుడు రాత్రి వేళ తీరాన్ని చేరుకుంటారు. ఆ వెంటనే వారు వచ్చిన పడవల్ని కాల్చేస్తారు. దీంతో యుద్ధరంగం నుంచి మడమతిప్పే అవకాశం ఉండదు. కేవలం డూ ఆర్ డై ఆప్షన్ మాత్రమే మిగులుతుంది. ఆ స్థితి వారిలోని పోరాట పటిమను పెంచుతుంది. దీన్నే విక్టోరియాస్ విన్నర్స్ సీక్రెట్ అంటారని అమెరికాలోని ఎండీ ఆర్టీఏ (మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ అసోసియేషన్)లో బోధించారు. ప్రతి ఏడాదీ ఇలాంటి గోల్నే ఏర్పాటు చేసుకుంటాను. 2020 నాటికి ప్రతి వ్యక్తికీ ఓ పాలసీ ఉండాలన్నది ఎల్ఐసీ లక్ష్యమైతే, ఈ లోపే లక్ష పాలసీలు పూర్తి చేసి మరో రికార్డ్ సృష్టించాలనేదే నా గోల్!