-
న్యూఇయర్... నిర్ణయాలు అమలు చేయండిలా!
రాత్రంతా బాగా అల్లరిచేసి, ఆనందించి, పార్టీతో న్యూఇయర్కు స్వాగతం పలికి ఉంటారు. ఆ సందర్భంగా కొత్త నిర్ణయాలు కూడా తీసుకుని ఉంటారు కదా. మీరేకాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం నుంచి 50శాతం మంది కొత్త సంవత్సరం సందర్బంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అందులో మెజారిటీ.. రోజూ ఎక్సర్సైజ్ చేయాలి, బరువు తగ్గించాలి, సిగిరెట్లు మానెయ్యాలి, మద్యం మానెయ్యాలి లాంటివే ఉంటాయి. మరికొందరు పుస్తకాలు చదవడాన్నో లేదా సినిమాలు చూడడాన్నో లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం యువతలో ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ఆ ఆసక్తి తగ్గుతుంది. కొత్త సంవత్సరం నిర్ణయాలు తీసుకున్నవారిలో 75శాతం మంది మొదటివారం తమ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. కానీ, జనవరి చివరికి వచ్చేసరికి కేవలం 40 శాతం మాత్రమే తమ మాటపై నిలబడతారు. ఆర్నెళ్ల తిరిగేసరికి కమిట్మెంట్తో ఉండేది ఎంతమందో తెలుసా? కేవలం 19శాతం. ఆర్నెళ్ల తర్వాత అది మరింత తగ్గుతుంది. చివరకు కేవలం ఎనిమిది శాతం మంది మాత్రమే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ను నెరవేర్చుకుంటారని స్క్రాంటన్ యూనివర్సిటీ అధ్యయనం తెలుపుతోంది. అందులోనూ మహిళల సంఖ్య ఎక్కువని న్యూసైంటిస్ట్ సర్వేలో వెల్లడైంది. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా జరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా చాలామంది సైకాలజిస్ట్లు, యూనివర్శిటీలు అధ్యయనాలు చేశాయి. అవాస్తవిక లక్ష్యాలను లేదా చాలా లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని చేరుకోవడానికి సరైన ప్లాన్, మోటివేషన్ లేకపోవడం కారణమని స్క్రాంటన్ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. మార్పు వచ్చేంతవరకూ వేచి చూసే ఓపిక లేకపోవడం, జరిగిన తప్పుల నుంచి నేర్చుకునే అలవాటు లేకపోవడం కారణాలని సైకాలజీ టుడే పత్రిక పేర్కొంది. ఎవరినో మెప్పించాలనే తప్ప, తనకు తానుగా నిర్దేశించుకోవడం వల్ల మనసు లోపలి నుంచి ఉత్సాహం, ప్రేరణ లేకపోవడం. ఇలా అనేకానేక కారణాలున్నాయి. అందుకే నెలకో, ఆర్నెళ్లకో అవి మన జీవితం నుంచి మాయమైపోతాయి. మళ్లీ పాత అలవాట్లే పునరావృతమవుతాయి. మళ్లీ కొత్త సంవత్సరానికి అవే పాత గోల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మరేం చెయ్యాలి? ఇలాగైతే ఎలా? న్యూ ఇయర్ రిజల్యూషన్స్ నెరవేర్చుకోవడానికి ఏదో ఒక మార్గం చూపాలి కదా అని సైకాలజిస్టులు, యూనివర్శిటీలు అధ్యయనాలు జరిపాయి. వాటి సారాంశాన్ని అర్థం చేసుకుని, ఆచరించడం ద్వారా మన లక్ష్యాలను చేరుకోవచ్చు. కొత్త సంవత్సరంలో స్మార్ట్ గోల్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చని అదే స్క్రాంటన్ యూనివర్శిటీ అధ్యయనం పేర్కొంది. అంటే specific, measurable, achievable, relevant, and time-bound గోల్స్ ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద గోల్స్ను చిన్న చిన్న స్టెప్స్గా మార్చుకోవాలని హెర్జింగ్ యూనివర్శిటీ పేర్కొంది. అంటే, 2024లో పది కిలోల బరువు తగ్గాలనుకుంటే దాన్ని నెలకో కిలోగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. కొత్త పుస్తకం రాయాలనుకుంటే రోజుకో ఐదు పేజీలు రాయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. పర్ఫెక్షన్ గురించి కాకుండా ప్రోగ్రెస్పై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మోటివేషన్ వస్తుందని సైకాలజీ టుడే మేగజైన్ తెలిపింది. అంటే, రోజుకో ఐదు పేజీల లక్ష్యంలో మూడు పేజీలు మాత్రమే రాసినా డీలా పడిపోకూడదు. ఆ చిన్న విజయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అకౌంటబిలిటీ పార్టనర్ను లేదా సపోర్ట్ సిస్టమ్ను పెట్టుకోవడం వల్ల కూడా ఫలితాలుంటాయి. అంటే మనం పెట్టుకున్న లక్ష్యాన్ని కుటుంబ సభ్యులకో, స్నేహితులకో చెప్పండి. వారానికి ఐదు రోజులు వాకింగ్ అని లక్ష్యంగా పెట్టుకుంటే, అలా వెళ్లనప్పుడు వారిని గుర్తుచేయమనండి. ఏ అలవాటూ ఒక్కరోజులో పోదని లేదా 21 రోజుల్లో రాదనీ గుర్తించండి. ఒక కొత్త అలవాటు కావాలంటే కనీసం 60 నుంచి 70 రోజులు ప్రాక్టీస్ చేయాలి. లక్ష్యసాధనలో తడబాటుపడ్డప్పుడు, తప్పులు చేసినప్పుడు చాలామంది డీలా పడిపోతారు. ఎలాగూ తప్పు చేశామని మళ్లీ పాత మార్గానికే వెళ్లిపోతారు. అలాక్కాకుండా లక్ష్యసాధనలో తప్పులు, తడబాట్లు సహజమని గుర్తించండి. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందడుగు వేయాలి లక్ష్యాలు ఎవరినో మెప్పించాలని కాకుండా మనకోసం మనం పెట్టుకున్నప్పుడు మనసులోంచి ప్రేరణ ఉంటుంది. అందువల్ల గోల్స్ ఎప్పుడూ మీ విలువలకు సరిపోయేవిగా ఉండాలి. ఇవన్నీ చేసినా మీ అడుగులు తడబడుతుంటే, ఫిబ్రవరి లేదా మార్చిలో సైకాలజిస్ట్ను కలవండి. మీ ఆలోచనలు, ప్రవర్తనలో అవసరమైన మార్పుల కోసం వారు సహాయం చేస్తారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066 psy.vishesh@gmail.com -
30రోజుల ప్రణాళికతో ఊరు మారింది
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన 30రోజుల ప్రణాళిక పనులు జిల్లాలోని అన్ని గ్రామాల్లో వేగంగా సాగుతోంది. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామం చింతమడకతోపాటు, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్వగ్రామం తోటపల్లి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్రెడ్డి స్వగ్రామం పోతారంతోపాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్కుమార్ దత్తత గ్రామం గండిపల్లి గ్రామాలు స్వచ్ఛతలో ఒక అడుగు ముందున్నాయని చెప్పొచ్చు. తమ తమ నాయకులను ఆదర్శంగా తీసుకొని గ్రామంలోని నాయకులు, యువత, మహిళా సంఘాలు గ్రామాన్ని శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇతర గ్రామాలకు తమ గ్రామం ఆదర్శంగా నిలవాలని పోటీపడుతున్నారు. అయితే తమ పుట్టిన ఊరిలో పారిశుధ్య పనులు వేగంగా జరగడం, గ్రామాల రూపురేఖలు మారడం సంతోషంగా ఉందని, పరిశుభ్రత కార్యక్రమం నిరంతరంగా జరగాలని కోరుకుంటున్నారు. శుభ్రమైన చిట్టాపూర్ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్. గ్రామంలోని పలువీధుల్లో రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగిస్తూ.. చెత్తవేయడంవల్ల జరిగే ఇబ్బందులు, అనర్థాలగురించి వివరిస్తున్నారు. అలాగే గ్రామంలో పాత ఇళ్లను జేసీబీలతో ఇండ్ల యజమానుల అంగీకారంతో కూలగొడుతున్నారు. ఈ గ్రామంలో మొత్తం 112 ఇళ్లు శిథిలావస్థలో ఉండగా అందులో 63 ఇళ్లను యజమానుల అనుమతితో కూల్చివేశామని ఆ గ్రామ సర్పంచ్ పోతనక రాజయ్య తెలిపారు. మిగతా 60 ఇళ్లు వారు పూర్తిగా నిరుపేదలు కావడం వల్ల ఆ ఇళ్లను త్వరలో కూల్చివేస్తామని యజమానులకు గ్రామ పంచాయతీ ద్వారా నోటీసులను కూడా ఇచ్చినట్లు తెలిపారు. గ్రామంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో బహిరంగంగా మలవిసర్జన చేయకుండా ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డిని నిర్మించినట్లు చెప్పారు. ఇంకుడు గుంతల వల్ల కలిగే లాభాలగురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చిట్టాపూర్ లో భాగంగా గ్రామంలో ఉన్న ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో శ్రమదానం కార్యాక్రమాన్ని నిర్వహించి పాఠశాలల ఆవరణలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. గ్రామంలో నిర్మంచిన డబుల్ బెడ్రూం ఇళ్లల్లో కూడా శ్రమదానం నిర్వహించి వీధులన్నింటిని శుభ్రంచేశారు. దోమల నివారణకు మందులను పిచికారీ చేయించి, మురికి కాలువల్లో శుభ్రంగా ఉండటానికి పలు రకాల మందులను చల్లుతున్నారు. చింతమడకలో పనుల జోరు సీఎం స్వగ్రామమైన చింతమడక గ్రామంలో 23 రోజులుగా పారిశుధ్య కార్యక్రమాలు సాగుతున్నాయి. తమ గ్రామ ముద్దుబిడ్డ ఆదేశాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంటే మా గ్రామాన్ని మేం సుందరంగా తీర్చుకోవడం సంతోషంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో 720 కుటుంబాలు ఉండగా 2,524 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో ఎక్కడా చెత్తా చెదారం, పిచ్చిమొక్కలు లేకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం. గ్రామంలో ఉన్న పాత, శి«థిలావస్థలో ఉన్న గోడలు, ఇళ్లను కూల్చివేయడం, ఇళ్ల మధ్యలో ఉన్న పాడుబడ్డ బావులను పూడ్చివేశారు. విద్యుత్ వైర్లు కిందికి వేలాడడం, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల వద్ద నెలకొరిగేలా ఉన్న ప్రమాదపు సమస్యలను పరిష్కరించడం, వ్యవసాయ బావుల వద్ద అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ లైన్లు వేయించారు. గ్రామస్తుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఇళ్లల్లోని చెత్తాచెదారాన్ని తీసిసే పనిలో అందరు భాగస్వామ్యులయ్యారు. విశాలంగా ఉన్న ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను ట్రాక్టర్ల సాయంతో చదును చేశారు. స్థాయి కమిటీలు, అధికారులు, గ్రామస్తులను భాగస్వామ్యం చేస్తూ రోజువారిగా గ్రామంలోని వీధులను తిరుగుతూ పరిశీలించడంతోపాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరి సహకారం కావాలని కోరుతూ అవగాహన కల్పిస్తున్నారు. దీంతో గ్రామం అంతా స్వచ్ఛంగా తయారైంది. మురికికాల్వలు పూడ్చివేయడంతో దోమల బాధ తప్పిందని గ్రామస్తులు చెబుతున్నారు. అద్దంలా.. తోటపల్లి తోటపల్లి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్వగ్రామం. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దత్తత గ్రామామైన మండలంలోని తోటపల్లిలో వేగవంతంగా సాగుతున్నాయి. ఈనెల 6 నుంచి గ్రామంలో పారిశుధ్యం, డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నారు. ఈ పనులకు ప్రత్యేకంగా నిధులు రాకపోయినా తమ సొంత డబ్బులతో పనులను పూర్తి చేస్తున్నట్లు సర్పంచ్ నర్సింగారావు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి, పాఠశాల, దేవాలయాల్లో చెట్ల పొదలు తొలిగించి చదును చేశారు. ప్రణాళిక పనుల్లో సర్పంచ్ నుంచి వార్డు సభ్యులు, ప్రణాలిక కమిటీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. పలు కుటుంబాలు ఉపాధి నిమిత్తం హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో స్థిరపడటం వలన పాత ఇల్లు, వాటిలోని పిచ్చి మొక్కలను తొలిగించడంలో కొంత జాప్యం జరుగుతుంది. 26 శిథిలమైన ఇళ్లను గుర్తించగా 12 ఇళ్లను తొలిగించామని మిగితా ఇళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశామని సర్పంచ్ నర్సింగారావు తెలిపారు. త్వరలోనే వాటిని తొలిగిస్తామన్నారు. లూజ్ విద్యుత్ లైన్లతో పాటు 150 విద్యుత్ సమస్యలు పరిష్కరించారు. రోడ్డు బీటీ డబుల్ రోడ్డు మంజూరి కావడంతో ఆప నులను సైతం పూర్తి చేసి గ్రామానికి రవాణ సౌకర్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న రెండు బోర్లను మూసివేశారు. దీంతో తోటపల్లి గ్రామం అద్దంలా తయారు అవుతుందని, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న ‘పోతారం మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్రెడ్డి స్వగ్రామం పోతారం. అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లుతుంది. ఎంపీ స్వగ్రామం కావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి నెలకొని ఉన్న సమస్యలను ప్రణాళికలో చకచక చేస్తున్నారు. కూలిపోయె దశకు చేరుకున్న ఎనిమిది ఇళ్లను పూర్తిగా కూల్చి వేశారు. ప్రమాదకరంగా ఉన్న రెండు పాత బావులను పూడ్చి వేశారు. హరితహారంలో నాటిన మొక్కలకు తెలుపు, నలుపు రంగులు వేశారు. గ్రామంలో కొన్ని విద్యుత్ వైర్లు వదులుగా ఉండడంతో వాటికి 20 స్తంభాలు పాతడానికి గుంతలు తీశారు. గ్రామంలో నుంచి గొర్రెలు, మేకలు వెళ్లకుండా వాటి కోసం ప్రత్యేకించి గ్రామ చివర్లో గొర్రెల షెడ్లను ఏర్పాటు చేయడానికి గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. ప్రస్తుతానికి గ్రామం క్లీన్ అండ్ గ్రీన్లా కనిపిస్తుంది. భళా.. గండిపల్లి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్కుమార్ దత్తత గ్రామమైన అక్కన్నపేట మండలం గండిపెల్లి. గ్రామంలోని రహదారులను శుభ్రపరుస్తూ చెత్తను తరలించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారులు కొంత వరకు సీసీ రోడ్లు ఉన్నప్పటికి గల్లీల్లో నేటికీ మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఇంకను మురికి కాలువల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. గ్రామంలో ఉన్న 13 పాడుబడ్డ ఇళ్లను కూల్చివేయగా, ఎస్సీ కాలనీలో మరికొన్ని పాత ఇళ్లను తొలగించాల్సి ఉంది. ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, యాదవ కమ్యూనిటీ భవనం, గ్రామ పంచాయతీ నూతన భవనం, కొత్తగా మహిళా భవనం. పాత మహిళ భవన నిర్మాణ మరమ్మతులకు కలిపి దాదాపు రూ.35లక్షలు మంజూరయ్యాయి. అలాగే ఓపెన్ జిమ్, కూరగాయల మార్కెట్, అంగడి స్థలాలను చదును చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఉపాధి హామీ పథకం కింద శ్మశానవాటిక పనులను కొనసాగిస్తున్నారు. మంచినీటి ట్యాంకులను శుభ్రపరుస్తూ, తాగునీరు కలుషితం కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాలకు గుంతలు ఏర్పడితే మొరంపోసి చదును చేస్తున్నారు. అలాగే విద్యుత్ స్తంభాల కొరత మూలంగా లూజ్ లైన్లు, స్ట్రీట్ లైట్లు పూర్తి స్థాయిలో వేయలేకపోతున్నారు. చాలా సంతోషంగా ఉంది.. మా స్వగ్రాం పోతారంలో 30రోజుల కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. గ్రామం మొత్తం శుభ్రంగా తయారు అవుతుందని చెబుతుంటే సంబురంగా ఉంది. గ్రామం శుభ్రంగా ఉంటేనే అందరూ బాగుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. గ్రామం స్వచ్ఛతగా తయారు చేసేందుకు పాల్గొంటున్న అందరికి అభినందనలు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలి. –కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎంపీ 30 రోజుల ప్రణాళిక భేష్.. 30 రోజుల ప్రణాళిక భేష్....గ్రామాలను అన్ని రంగాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు గాను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికతో ఏళ్లుగా జరగని అభివృద్ధి కేవలం రోజుల్లోనే జరగడం సంతోషకరం. నా స్వగ్రామం చిట్టాపూర్లో నా చిన్నతనం నుంచి జరగని పనులు ఇప్పుడు జరిగాయి. – రామలింగారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే గ్రామ పరిశుభ్రత కీలకం నా దత్తత గ్రామం గండిపల్లిలో 30 రోజుల ప్రణాళిక పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామస్తులు కలిసికట్టుగా పరిశుభ్రత పనులు చేసుకోవడం అభినందనీయం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన ఈపనులతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ప్రజాప్రతినిదులతోపాటు, యువత కూడా ముందుకు వచ్చి పనులు చేస్తున్నారు. ఇలా వారంలో ఒకరోజు తప్పకుండా చేయాలని చెప్పాను. –సతీశ్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే -
కన్నవారికి ఆదుర్దా..చిన్నారులకు హైరానా..
రాయవరం : వేలమంది చిన్నారులకు ఆతృత, హైరానా. అంతకు రెట్టింపు సంఖ్యలో వారి తల్లిదండ్రులకు ఉద్వేగం, ఆదుర్దా. ఉన్నత విద్యాసౌధానికి పునాది వంటి పదో తరగతి పరీక్షలు మరో నాలుగు రోజుల్లో (ఈ నెల 21 నుంచి) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇదీ ఊరూవాడా అనేక ఇళ్లలో కనిపించే పరిస్థితి. పరీక్షలు వచ్చే నెల 7 వరకూ జరుగుతాయి. ఇదిలా ఉండగా.. పదో తరగతి పరీక్షల్లో గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తీవ్రమైన కసరత్తు చేస్తోంది. గతేడాది పదవ తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. 2014 పదో తరగతి ఫలితాల్లో జిల్లా మొదటిస్థానాన్ని సాధించింది. ఈ ఏడాదీ ఆ విజయూన్నే జిల్లాకు సొంతం చేయూలన్నది అధికారుల తపన. జిల్లాలో మొత్తం 70,529 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 33,522 మంది బాలురు, 34,144 మంది బాలికలు రెగ్యులర్ విద్యార్థులుగా పరీక్షలు రాయనుండగా, 2,863 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరవుతున్నారు. 317 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల సక్రమ నిర్వహణకు సుమారు 3,800 మంది ఇన్విజిలేటర్లను నియమించనున్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక.. పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది. డిసెంబరు మొదటి వారం నుంచి 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేశారు. అందులో భాగంగా ప్రతి రోజూ ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 10 మార్కులకు సబ్జెక్టుల వారీగా స్లిప్ టెస్ట్, వారాంతంలో 25 మార్కులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. ఈ ఏడాది రెండు సార్లు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించారు. ఇప్పటికే పదవ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు సంబంధిత పోలీస్స్టేషన్లకు చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకూ తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం మొదటి పేపర్ సంబంధించిన సెట్ 1, 2 ప్రశ్నాపత్రాలు పోలీస్స్టేషన్లకు చేరుకోగా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు వాటిని తీసుకుని ఆ స్టేషన్లలో భద్రపర్చారు. ఈ నెల 19, 23 తేదీల్లో మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన సెట్ 1, 2 ప్రశ్నాపత్రాలు ఆయా పోలీస్స్టేషన్లకు చేరుకోనున్నాయి. 10 గ్రేడ్ పాయింట్లు సాధించాలని.. 10కి 10 గ్రేడు పాయింట్లు సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నాను. ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రత్యేక సూచనలు, సలహాలతో అనుకున్న సాధిస్తాననే నమ్మకం ఉంది. - జి.విమల, 10వ తరగతి విద్యార్థిని, సోమేశ్వరం పరీక్షలకు పూర్తిగా సన్నద్ధమయ్యా.. పదవ తరగతి పరీక్షలకు పూర్తిగా సన్నద్ధమయ్యాను. మంచి గ్రేడు సాధించేందుకు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అన్ని సబ్జెక్టుల్లో తీర్చిదిద్దారు. మంచి గ్రేడ్ సాధిస్తా. - వై.మనోజ్యాదవ్, 10వ తరగతి విద్యార్థి, రాయవరం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement