breaking news
smita bansal
-
ప్రముఖ టీవీ నటిపై మరదలి వేధింపుల కేసు
ప్రముఖ టీవీ నటి స్మితా బన్సల్కు కొత్త సంవత్సరం వేధింపుల కేసుతో ప్రారంభమైంది. ఆమె తనను వేధించిందంటూ మరదలు మేఘాగుప్తా కేసు పెట్టింది. స్మితా బన్సల్ తన అభరణాలు, రూ. 50 లక్షలు సైతం చోరీచేసిందని ఆమె ఆరోపించింది. అయితే తనను ఈ కేసులోకి అనవసరంగా లాగుతున్నారని స్మితా బన్సల్ చెప్తోంది. స్మితా బన్సల్పై సెక్షన్ 498 (ఏ) కింద గుర్గావ్లోని మహిళా ఠాణాలో కేసు నమోదైంది. 'ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర లేదు. ఎఫ్ఐఆర్ నాకు అందిన తర్వాత నాపై మోపిన అభియోగాలేమిటో తెలుసుకొని నేను స్పందిస్తాను. నన్ను ఎందుకు ఈ కేసులోకి లాగారో అర్థం కావడం లేదు' అని స్మితా బన్సల్ తెలిపింది. 'అమానత్', 'ఆశిర్వాద్' వంటి ప్రముఖ హిందీ సీరియళ్లలో నటించిన స్మితా బన్సల్ సోదరుడు సౌరభ్ బన్సల్ 2009లో మేఘా గుప్తాను పెళ్లాడారు. ఆ తర్వాత దంపతులు లండన్ వెళ్లిపోయారు. దంపతుల మధ్య గొడవలు రావడంతో ఈ ఏడాది ప్రారంభంలో మేఘా గుప్తా గుర్గావ్ తిరిగొచ్చేసింది. మేఘా గుప్తాతో తనకు పెద్దగా సంబంధాలు లేవని, ఆమెతో ఎప్పుడూ గడిపింది కూడా లేదని, పెళ్లికాగానే తన సోదరుడు, మరదలు లండన్ వెళ్లిపోయారని స్మితా బన్సల్ వివరించారు. -
ఇక కన్నీళ్లు లేవోచ్!
సీరియళ్లలో అత్తలంటే విలన్లే. కోడలిని ఎలా రాచి రంపాన పెట్టాలి, ఎలా ఇంట్లోంచి బయటకు గెంటేయాలి అని ఆలోచించే అత్త పాత్రలే ఎక్కువ. అలాంటి సమయంలో అత్యంత ఉదాత్తమైన అత్తగా నటించి మెప్పించింది స్మితాభన్సాల్. ‘బాలికావధు’లో ఆనందికి అత్త అయివుండీ అమ్మలా సాకిన ఆమెను చూసి... ఇలాంటి అత్తగారు మాకూ వస్తే బాగుణ్ను అని ఆడపిల్లలంతా కోరుకున్నారు. సున్నిత మనస్తత్వం గల మహిళగా ఆ పాత్రలో కన్నీటిని ఒలకబోసింది స్మిత. కానీ ఇప్పుడు పంథా మార్చింది. త్వరలో ప్రారంభం కానున్న ‘అక్బర్-బీర్బల్’ సీరియల్లో నవ్వుల జల్లులు కురిపించడానికి రెడీ అయ్యింది. ఇందులో అక్బర్ రెండో భార్య ఉమ్రావ్గా నటిస్తోంది స్మిత. ఆమె పాత్ర అత్యంత హాస్యాస్పదంగా ఉంటుందట. ‘ఇన్నాళ్లూ నన్ను చూసి కదిలిపోయారు. ఇప్పుడు కడుపుబ్బ నవ్వుకుంటారు’ అని పూర్తి విశ్వాసంతో చెబుతోందంటే... ఆ పాత్ర ఏ స్థాయిలో కామెడీని పండించబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ కొత్త ప్రయోగం స్మిత కెరీర్ను ఎలా మార్చుతుందో మరి!