breaking news
selfie with victim
-
హవ్వ.. గ్యాంగ్రేప్ బాధితురాలితో సెల్ఫీనా!
సాధారణంగా అత్యాచార బాధితుల పేర్లు గానీ, వాళ్ల వివరాలు గానీ ఎక్కడా వెల్లడించరు. అలాంటిది రాజస్థాన్ మహిళా కమిషన్ సభ్యురాలు సోమ్యా గుర్జర్ ఏకంగా అలాంటి బాధితురాలితో సెల్ఫీ తీసుకున్నారు! దీంతో కమిషన్ చైర్పర్సన్ ఆమె నుంచి రాతపూర్వక వివరణ కోరారు. అయితే ఇందులో మరింత చింతించాల్సిన విషయం ఏమిటంటే.. కమిషన్ చైర్పర్సన్ సుమన్ శర్మ కూడా ఆ సెల్ఫీలో ఉన్నారు. జైపూర్లోని ఓ మహిళా పోలీసు స్టేషన్లో బాధితురాలిని కలిసిన సమయంలో గుర్జర్ ఈ సెల్ఫీ తీశారు. అయితే తాను బాధితురాలితో మాట్లాడుతుండగా గుర్జర్ ఈ ఫొటోలు తీశారని, ఆమె తీస్తున్న విషయం కూడా తనకు తెలియదని చైర్పర్సన్ సుమన్ శర్మ చెప్పారు. ఇలాంటి వాటిని తాను సహించేది లేదని, అందుకే ఆమెనుంచి రాతపూర్వక వివరణ కోరానని అన్నారు. గుర్జర్ తీసిన రెండు సెల్ఫీలలో ఒకటి ఇప్పటికే వాట్సప్, ఇతర సోషల్ మీడియా నెట్వర్కులలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో భర్త, అతడి ఇద్దరు సోదరులు కలిసి 30 ఏళ్ల బాధితురాలిపై అత్యాచారం చేశారు. రూ. 51 వేలు కట్నంగా ఇవ్వలేదని ఆమె నుదురు, చేతుల మీద అసభ్యకరమైన మాటలతో పాటు ‘మా నాన్న దొంగ’ అంటూ టాటూలు వేయించారు. దీనిపై ఇప్పటికే 498 ఎ, 376, 406 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. -
అమ్మాయి కదాని సెల్ఫీ దిగితే..!
దొంగతనం చేయడం వరకు ఓకే.. చేసిన తర్వాత బాధితులలోని ఓ మహిళతో సెల్ఫీలు దిగాడు. అక్కడితో కూడా ఆగలేదు. ఆ ఫొటోలను స్నాప్చాట్లో షేర్ చేశాడు. అంతే.. పోలీసులకు దొరికిపోయాడు. విక్టర్ అల్మాంజా మార్టినెజ్ అనే 18 ఏళ్ల యువకుడిని దోపిడీ నేరం మీద పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీలో అతడితో పాటు పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. విక్టర్, అతడి ఇద్దరు స్నేహితులు కలిసి కాలిఫోర్నియాలోని లోవర్ పార్క్ ప్రాంతంలో ఓ ఇంటికి వెళ్లారు. అక్కడివాళ్లను తుపాకులతో బెదిరించి, వాళ్ల కారుతో సహా విలువైన వస్తువులు దోచుకుపోయారు. బాధితుల కుటుంబంలో ఉన్న ఓ మహిళ విక్టర్తో స్నాప్చాట్ సమాచారం షేర్ చేసుకుంది. ఇద్దరూ కలిసి ఓ సెల్ఫీ కూడా దిగారు. ఆ సెల్ఫీ ఆధారంగా విక్టర్ను పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. సాయుధ దోపిడీ, కిడ్నాప్ నేరాలు అతడిమీద మోపి ప్రస్తుతం మాంటెరీ కౌంటీ జైల్లో పెట్టారు.