breaking news
Section 66A
-
రాంగోపాల్ వర్మకు నోటీసులు
హైదరాబాద్ : దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మపై ఉత్తరప్రదేశ్లోని లుధియానాలో కేసు నమోదు అయ్యింది. ఫిబ్రవరి 13న 'మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమాపై వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వర్మ వివాదాస్పద ట్విట్లపై డేరా అనుచరుడు లుధియానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు బుధవారం వర్మపై సెక్షన్ 66A కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరు పోలీసులు... వర్మకు నోటీసులు అందించేందుకు ముంబయి చేరుకున్నారు. డేరా సచ్చా సౌద అధినేత గుర్మిత్రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబాను వర్మ 'గాడిద'గా అభివర్ణించిన విషయం తెలిసిందే. అలాగే క్లాస్ బ్రీడ్ అంటూ వివాదాస్పద పదజాలం వాడుతూ ట్వీట్ చేశారు. మరోవైపు సెక్షన్ 66Aను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మపై లుధియానా పోలీసులు పెట్టిన కేసు ఎంతవరకూ నిలుస్తుందో వేచి చూడాలి. Ram Rahim of MSG is a hybrid cross between an illusional Salman Khan,/Rajnikant and a delusional Saint/satan and a very real ass — Ram Gopal Varma (@RGVzoomin) February 13, 2015 Ram Rahim of MSG is an Ass but I don't mean Ass in a figurative nor literal way..nd if anyone doesn't understand this he's an Ass — Ram Gopal Varma (@RGVzoomin) February 13, 2015 -
సెక్షన్ 66Aను కొట్టేసిన సుప్రీం
-
IT చట్టంలో 66 సెక్షన్ ఎ చెల్లదు-కోర్టు
-
సెక్షన్ 66Aను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ : భావ ప్రకటనా స్వేచ్ఛకు బంధనాలు వేస్తున్న ఇన్ఫర్మేషన్ చట్టంలోని సెక్షన్ 66Aని సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ అధికరణ 19(1)A కల్పిస్తున్న భావ ప్రకటనా స్వేచ్ఛకు ఈ సెక్షన్ భంగకరంగా ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ సెక్షన్ను దుర్వినియోగం చేయమని ప్రభుత్వం చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. డిజిటల్ మీడియా స్వేచ్ఛకు సంబంధించి సెక్షన్ 66A అత్యంత కిరాతకంగా ఉందని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కంప్యూటర్, మొబైల్ లేదా ఇతర సమాచార సాధనాల ద్వారా ఎవరైనా అసహ్యకరమైన, అవమానకరమైన మెసేజ్, సమాచారం పంపితే అలాంటి వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించే అధికారం ఐటీ చట్టంలోని సెక్షన్ 66A కల్పిస్తోంది. అవమానకరైన సమాచారం అనే పదం చాలా అస్పష్టంగా ఉందని, దీన్ని ఎలా అంటే అలా నిర్వచించుకునే వీలుందని అనేక మంది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు ముంబయిలో శివసేన అధినేత బాల్ఠాక్రే చనిపోయినప్పుడు ముంబైలో బంద్ పాటించడాన్ని షహీన్ ధద అనే యువతి ఫేస్బుక్లో ప్రశ్నించారు. రేణు శ్రీనివాసన్ అనే మరో యువతి ఆ కామెంట్కు 'లైక్' కొట్టింది. దాన్ని నేరంగా పరిగణించి ఆ ఇద్దరు యువతులను పోలీసులు 2012లో అరెస్టు చేశారు. సాధారణ జన జీవనానికి ఇబ్బంది కలిగించిన బంద్ను ప్రశ్నించడం కచ్చితంగా భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుందని, అయితే విస్తృత అర్థాన్నిచ్చే విధంగా ఐటీ చట్టం 66ఏను అన్వయించి వారిని అరెస్టు చేయడమంటే పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లేననీ, ఐటీ చట్టంలోని ఆ సెక్షన్ను తొలగిం చాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రేయా సింఘాల్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) వేసిన విషయం తెలిసిందే.