breaking news
samakka -sarakka
-
కన్నెపల్లి నుంచి సారలమ్మ.. చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్క
సాక్షిప్రతినిధి, వరంగల్: భక్తజనమంతా వనమంతా నిండి కుంభమేళాను తలపించే ఆదివాసీల వేడుకకు వేళ అయింది. జనం కదిలి వచ్చి కడలిలా మారే అపురూప సన్నివేశం మేడారం జాతరలో సాక్షాత్కరించనుంది. ఉత్సాహం ఉరకలేసి ఉత్సవంగా మారే సందర్భం రానే వచ్చింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీల ఉత్సవమైన మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతర బుధవారం ప్రారంభం కానుంది. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జాతర సాగుతుంది. గత జాతరకు 1.20 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు ప్రకటించిన అధికారులు, ఈసారి కూడా అదేస్థాయిలో వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ఈ మహాజాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభమేళాను తలపిస్తుంది. నాలుగు రోజులు కుంభమేళా.. ఇలా ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలంలోని ఓ గిరిజన గ్రామం మేడారం. మేడారం జాతరను రెండేళ్లకోసారి నాలుగురోజులపాటు సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును పూజారులు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. దీంతో తొలిరోజు ఘట్టం పూర్తవుతుంది. గురువారం సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఇదే అత్యంత కీలకమైన ఘట్టం కాగా, కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం చూసి తరించి అందరూ పులకించిపోతారు. సమ్మక్కను పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షలాది మంది భక్తులు పాల్గొని జయజయధ్వానాలు పలుకుతూ హారతులు ఇస్తారు. పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు. 18న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతల వనప్రవేశం ఉంటుంది. జాతర కోసం భారీ ఏర్పాట్లు... ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య నేతృత్వంలో జిల్లా యంత్రాంగం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేస్తోంది. టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 3,850 బస్సులను నడుపుతోంది. మేడారం భక్తుల ప్రయాణ సౌకర్యం కోసం వరంగల్ కమిషనరేట్ పోలీసులు వన్ వే ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి పర్యవేక్షిస్తున్నారు. గతంలో రెండే ప్రధాన రోడ్డు మార్గాలుండగా, ఈసారి ఆరింటిని ఏర్పాటు చేశారు. మేడారం జాతర ప్రదేశంలో 360 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణ కోసం 11 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, ములుగు ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్ జాతర బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు జంపన్న వాగుకు ఇరువైపులా 3.6 కిలో మీటర్ల పొడవునా స్నానఘట్టాలను, విడిది కోసం భవనాలను నిర్మించారు. వన దేవతల గద్దెల పక్కనే ఉన్న వైద్య శాఖ భవనంలో 100 పడకల ఆస్పత్రిని వైద్యశాఖ ఏర్పాటు చేసింది. అత్యవసర వైద్యసేవల కోసం 108, 104 వాహనాలను సిద్ధంగా ఉంచింది. 1968 నుంచి.. 1968 నుంచి ప్రభుత్వం ఈ జాతర ఏర్పాట్లు చేస్తోంది. 1996లో రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మొదట సమ్మక్క, సారలమ్మ జాతరలు వేర్వేరు గ్రామాల్లో జరిగేవి. సారలమ్మను సైతం కన్నెపల్లి నుంచి మేడారంలోని సమ్మక్క గద్దెల వద్దకు చేర్చడం 1960 నుంచి మొదలైంది. అప్పటినుంచి మేడారం జాతర సమ్మక్క–సారలమ్మ జాతరగా మారింది. ప్రభుత్వ పరంగా 1944లోనే మేడారం జాతరపై తహసీల్దారుతో కమిటీ ఏర్పాటైనట్లు రికార్డులు చెబుతుండగా, 1967లో దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. మేడారం బయలెళ్లిన పగిడిద్దరాజు గంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో వెలిసిన పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు. ఆలయంలో మొక్కులు సమర్పించిన వడ్డెలు (పూజారులు) పగిడిద్దరాజు పడిగెను పట్టుకుని గ్రామం గుండా తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు పోస్తూ ‘వరుడై వెళ్లి మరుబెల్లికి రావయ్యా’అంటూ మొక్కులు చెల్లించారు. రాత్రి కర్లపెల్లి, లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో సేదదీరారు. వారిచ్చిన విందును ఆరగిఆంచి తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరిగి మేడారానికి పయణమవుతారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మేడారం చేరుకుంటామని ప్రధాన పూజారులు పెనక బుచ్చిరాములు, సురేందర్, రాజేష్, పురుష్తోతం తెలిపారు. -
పులిపై సమ్మక్క, జింకపై సారలమ్మ... ఈ రూపాలు ఎలా వచ్చాయో తెలుసా ?
-
నాగోబా..అదరాలబ్బా
సాక్షి, హైదరాబాద్ : గిరిజన గ్రామాలకు పండుగొచ్చింది. దసరా, దీపావళి అంటే అందరికీ తెలుసు.. కానీ సిరాల్ పండుగ, భౌరాపూర్ జాతర అంటే తెలియని వారే ఎక్కువ. ఇవి గిరిజనులు జరుపుకునే పండుగలు. నాగోబా సహా ఇలాంటి వాటి గురించి అందరికీ తెలియాలని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సంకల్పించి అమలు చేస్తోం ది. ఇందులో భాగంగా ఒక్కో పండగను ప్రభుత్వ కేలండర్లో జోడించిన గిరిజన సంక్షేమ శాఖ.. నిర్దేశిత తేదీల్లో ఆయా తెగలున్నచోట ఈ పండుగలను అధికారికంగా నిర్వహిస్తోంది. గిరిజనుల్లో 8 ప్రధాన తెగలున్నాయి. వీరిలో గోండ్, అంద్, కొలామ్, నాయక్పోడ్, ఎరుకల, చెంచు, లంబాడి, కోయ తెగలున్నాయి. నిర్వహణకు 102.3 కోట్లు గిరిజనుల పండుగలకు ప్రభుత్వం రూ.102.3 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క–సారక్క జాతరకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తుండగా.. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించేందుకు రూ.కోటి ఖర్చు చేస్తోంది. -
మేడారం అంచనాలు సరిగా లేవ్
జిల్లాపరిషత్, న్యూస్లైన్ : జిల్లాలో రెండేళ్లకోసారి జరిగే మేడారం సమక్క-సారలమ్మ జాతరలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రూపొందించి న నివేదికలపై రాష్ట్ర ప్లానింగ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ.ఠక్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మేడారం జాతర ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఎస్. మహంతి నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అరుుతే ప్రధాన కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న జాతర నిమిత్తం చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ * 25.61 కోట్లు, ఆర్ అండ్ బీ * 32.25 కోట్లు, ఇరిగేషన్* 29.06 కోట్లు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం * 16 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ శాఖ *9.30కోట్లతోపాటు ఇతర శాఖలు తమ ప్రతిపాదనలను స్పెషల్ సీఎస్కు అందజేశారు. మొత్తం * 103 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు చేసినట్లు జిల్లాకు చెందిన అధికారులు తెలపగా... వారు అందజేసిన ఫైల్ను ఠక్కర్ క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిసింది. ఐదు శాఖలు రూపొందించిన అంచనాలే *వంద కోట్లకు పైగా ఉండడం... మరికొన్ని శాఖల అంచనాలు కలిపితే మరో * 20 కోట్లు దాటే అవకాశాలు ఉండడంతో ఆయన... శాఖల వారీగా చేపట్టే పనులపై చర్చించారు. అధికారులు చెప్పిన సమాధానాలు సరిగా లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే మొక్కుబడిగా అంచనాలు రూపొందించారని.. ఇది సరికాదని అన్నట్లు సమాచారం. మరోసారి కిందిస్థారుులో పరిశీలనలు జరిపి అంచనాలు రూపొందించాలని సూచించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జి.కిషన్, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ ఎస్ఈలు మోహన్నాయక్, జి.సురేష్కుమార్, పద్మారావుతో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మేడారం జాతరలో పర్యాటక శాఖ స్టాళ్లు వడ్డేపల్లి : మేడారం జాతరలో పర్యాటక శాఖ ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం *1.50 లక్షల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవా రం ఉత్తర్వులు జారీచే సింది. 2014 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జాతర జరుగుతుంది. పర్యాటక ప్రాంతాలు, వసతుల వివరాలు స్టాళ్లలో అందుబాటులో ఉంటాయి.